బిడ్డ పుట్టకముందే స్కూల్స్ అడ్మిషన్ కోసం వెతుకుతున్న రోజులివి.. సామజిక స్పృహ తెలిసిన ఏ పేరెంట్ అయినా అబ్బాయైతే ఇంజనీర్.. అమ్మాయైతే డాక్టర్ ఇదో ఊతపదం ల వల్లేవేస్తున్నారు. మన సమాజంలో ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులకు ఉన్న క్రేజ్ ఇంతా అంతా కాదు. తల్లితండ్రుల ఆరాటాన్ని ఆసరాగా చేసుకున్న విద్య సంస్థలు నేడు ఇంజినీరింగ్, మెడిసిన్ విద్యను వ్యాపారమయం చేసిన పరిస్థితి నెలకొంది. ఐఐటీలు, నిట్లు వంటి జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో తమ పిల్లలు ఇంజినీరింగ్ చదవాలని చాలామంది పేరెంట్స్ తపన పడుతుంటారు. ఇందుకోసం వారు ఎంతటి ఖర్చుకైనా వెనుకాడరు.ఈ మధ్య వచ్చిన ‘‘సార్ ‘‘ సినిమాలో విద్య కొనుగోలు వ్యవహారాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు.
కాన్వెంట్ కిచిడి :
యూకేజీ మొదలు పై క్లాస్ లోను ప్రత్యేక కోర్స్ లే.. అసలు చదువు నేర్పకుండా కొత్త కోర్స్ ల తో ఆకర్షణ పదాలతో పిల్లలకు వలేస్తున్నారు ఒకటో తరగతికి లక్షా పైనే వసూలు చేస్తున్నారు. అయిదో తరగతి పాసైన విద్యార్ధి దగ్గర నుంచి ఒలంపియాడ్ అని ఐఐటీ ఫౌండేషన్ అంటూ కార్పొరేట్ విద్యాసంస్థలు తల్లిదండ్రుల ఆరాటాన్ని సొమ్ము చేసుకుంటున్నాయి. ఇంత ఖర్చుచేసి ఫౌండేషన్ కోర్సుల్లో చేర్పించినా జేఈఈలో, ఎంసెట్లో సరైన ర్యాంకురాని వారు ఎందరో ఉంటారు. ఈ కార్పొరేట్ ఒత్తిళ్లకు తట్టుకోలేక ఆత్మ హత్యలు చేసుకున్న విద్యార్థులెందరో .. క్రికెట్ తప్ప మరేవీ ఆటలు కానట్టు. మానసిక వికాసం లేకుండా ఆటలు టీవీ లోనో మొబైల్ లోనో తప్ప మైదానము లో అడుగే పెట్టని వారెందరో . క్రాష్ కోర్స్ అని షార్ట్ టర్మ్ అని ఇబ్బడి ముబ్బడిగా ఫీజు లు వసులు చేస్తున్నారు, ఇంజినీరింగ్, మెడిసిన్ తప్పితే మిగతా కోర్సులేవీ మంచి చదువులు కావన్న ధోరణి సమాజంలో ప్రబలిపోయింది. ఇతర కోర్సుల్లో చేరేవారిని సగటు విద్యార్థులుగా.. తెలివితేటలు లేనివారిగా పరిగణించడం పరిపాటైంది.
దేశవ్యాప్తంగా అందరినోటా నానుతున్న కోర్సు ఇంజనీరింగ్..సింగిల్ విండో కౌన్సెలింగ్లో కాలేజీల సంఖ్య క్రమంగా పడిపోతోంది. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE)) ఆమోదం పొందిన కాలేజీల జాబితాను యూనివర్సిటీ లు ఇంకా ఖరారు చేయనందున ఈ సంవత్సరం వివరాలు ఇంకా వెలువడలేదు. 2022 ఏడాది కౌన్సెలింగ్కు నమోదు చేసుకున్న ఇంజినీరింగ్ అభ్యర్థుల సంఖ్య 2.11 లక్షలు దాటింది. 2015-2016లో దేశవ్యాప్తంగా ఉన్న టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్లో మొత్తం ఇంజినీరింగ్ సీట్లు 18 లక్షలు ఉండగా, 2021-22 నాటికి 13.5 లక్షల సీట్లకు తగ్గాయి. ఇందులో 13.29 లక్షల సీట్లు ఉన్నాయి. భర్తీ అవుతున్నది 7.36 లక్షలు. ఆఖరికి ఉద్యోగాలు దక్కించుకుంటున్నది 3.90 లక్షలు మాత్రమే. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) తాలూకూ లెక్కలివీ. ఆయా కాలేజీలు ఇచ్చిన వివరాల ఆధారంగా ఈ గణాంకాలు వెల్లడించినప్పటికీ.. వాస్తవానికి ఉద్యోగాలు పొందిన వారు 2.50 లక్షలకు మించకపోవచ్చన్నది నిపుణుల అంచనా. ఇదీ దేశంలో ఇంజినీరింగ్ విద్య వాస్తవ పరిస్థితి.AICTE చేస్తిన్న యాజమాన్య సంతుష్టికారణ నిర్ణయాల కారణంగా ఇంజినీరింగ్ విద్య రోడ్డున పడింది అంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు.. ఒకప్పుడు ఇంజినీరింగ్ కళాశాలకి అనుమతి రావాలంటే 50 ఎకరాల భూమి తప్పనిసరి, కానీ ఇప్పుడు 2 ఎకరాలు ఉంటే చాలు, అదే విధంగా ఒకప్పుడు 12 నుండి15 మంది విద్యార్థులకు ఒక లెక్చరర్ ఉండాలి అనే నిబంధన ఉండేది.. ఆ నిబంధనను కాస్త ఇప్పుడు 18 నుండి 20 మంది విద్యార్థులకు ఒక లెక్చరర్ ఉంటే చాలు, ఇలా యాజమాన్యాల పైరవీలకి తలొగ్గి నిబంధనలకు తూట్లుపొడిచి AICTE నాణ్యమైన ఇంజినీరింగ్ విద్యను విద్యార్థులకు దూరం చేసింది.
సాధారణంగా ఓ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన విద్యార్ధి ని హౌస్ వైరింగ్ చేయమన్న ,లేదా ఓ కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసిన విద్యార్ధి నైనా సిస్టం ఫార్మట్ చెయ్యమన్నా ఏ ఎలక్ట్రిసీయాన్ నో లేక వై సి టి సి తీసుకెళ్లాలి తప్ప సొంతంగా నేర్చుకున్న విద్యను సామాజిక అవసరాలకు అనుసందించలేక పోతున్నాము. స్కూల్ విద్యనుండి డిగ్రీ వరకు రాంక్ లు తప్ప ప్రాక్టికల్ టైం పాస్ సబ్జక్టస్ గ మిగిలిపోయాయి,పుస్తకాలు చదివే ఓపిక లేదు.. ఆన్ లైన్ మధ్యమాల్లో కాపీ చేయడమే తప్ప స్వతహాగా రాసేది కష్టమే. మెకానికల్ విద్యార్థి బైక్ రిపేర్ చెయ్యలేడు..అంటే థర్మల్ ఇంజినీరింగ్ ల్యాబ్ లోటూ స్ట్రోక్ ఫోర్ స్ట్రోక్ ఇంజిన్ ప్రయాగాలు అర్థవంతంగా అర్ధం చేసుకోలేదని అర్ధం .ఇది ఒక విద్యార్థి లోపమే కాదు..విషయ పరిజ్ఞానము కలిగిన అనుభవం ఉన్న అధ్యాపక బృందాలు లేకపోవడం ,కాలేజీలు విద్యాలయాలు క్వాలిటీ అధ్యాపకులను నియమించకపోవువటం ,అంగట్లో సరుకుల్ల సర్టిఫికేట్ కొనుక్కొని తక్కువ జీతాలకు జాయిన్ అవుతున్న వారికి అవకాశం తప్ప రీసెర్చ్ మరియు అకడెమిక్ ఎక్స్లెన్స్ పైన దృష్టి పెట్టక పోవడం దురదృష్ట కరం.. అందువల్ల ఓ సత్యనాదెళ్ళ ,సుందర్ పిచాయ్ లాంటి వాళ్ళు ఈ తరం లో వస్తారన్నది నిరాశే..
ఏదో ఒక కోర్సు అనే అలసత్వ ధోరణితో కాకుండా, పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటే సక్సెస్ఫుల్ కెరీర్ సాధ్యమే.. విద్యార్థి దశలో అత్యంత కీలకమైన ఈ సమయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోకుంటే అవస్థలు తప్పవు.దురదృష్టవశాత్తూ , నిరుద్యోగం ప్రాథమిక మరియు మాధ్యమిక స్థాయిలలో పేలవమైన బోధనతో మరియు ఉన్నత విద్య నాణ్యతకు సంబంధించినదని కొద్దిమంది మాత్రమే గ్రహించారు . ఉపాధిని పొందలేని వారు , వృత్తి విద్యా కోర్సులు , శిక్షణ పొందలేని వారు ఏ స్థాయిలోనైనా ఉపాధి పొందేందుకు వీలుగా , ఆర్థిక స్థోమత కలిగినప్పుడు తిరిగి చదువులకు వెళ్లేందుకు వీలుగా పాఠ్యాంశాలను పునర్వ్యవస్థీకరించాలి . ఇది ఉన్నత విద్యా వ్యవస్థపై ప్రస్తుత భారాన్ని తగ్గించడమే కాకుండా వివిధ స్థాయిలలో ఉపాధి కోసం గుణాత్మక ఉత్పత్తిని కూడా ఉత్పత్తి చేస్తుంది. విద్య ఎప్పటికీ అంతం కాదని, ఇది సుదీర్ఘ ప్రక్రియ అని గుర్తుంచుకోవాలి..!
– డా:కృష్ణ సామల్ల, ప్రొఫెసర్ • ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్
9705890045