- ధాన్యం కొనుగోళ్లలో దక్షిణ భారతంలో మొదటి స్థానంలో..దేశంలో రెండవ స్థానంలో
- తొమ్మిదేళ్లలో రికార్డు స్థాయిలో 6.71 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
రైతు బంధు : రైతు బంధు పథకం ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాల్లోనే నగదు సాయాన్ని అందిస్తూ రైతులకు నిజమైన సాధికారత సాధించి పెడుతున్న పథకం . ఎకరానికి ఏటా రెండు విడతలలో రూ. 10 వేల పంట పెట్టుబడి సహాయాన్ని అందిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటివరకు 65 లక్షల మంది రైతుల ఖాతాల్లో 65,000 కోట్లు జమ చేసింది.రైతు బీమా : రాష్ట్రంలోని ప్రతి రైతుకు రూ.5 లక్షల జీవిత బీమా. 100 శాతం బీమా సొమ్ము చెల్లిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. రైతు కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడమే లక్ష్యం గా పనిచేస్తూ 97913 రైతు కుటుంబాలకు సహాయం అందించింది.ఉచిత విద్యుత్ : అన్ని రంగాలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్తు, వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్తు అందిస్తున్నది.
వ్యవసాయ రంగానికి 41.25 శాతం విద్యుత్ను అందిస్తున్నది. దాదాపు 25 లక్షలకు పైగా వ్యవసాయ కనెక్షన్లకు ఉచిత విద్యుత్ను అందిస్తున్నది.మిషన్ కాకతీయ : రాష్ట్రంలోని 46351 చెరువులు, కుంటలు, చిన్న నీటి వనరుల పునరుద్దరించడం ద్వారా భూగర్భ జలాలు గణనీయంగా పెరిగి రైతులకు ఎంతో మేలు చేకూరుతుంది.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం : అతి తక్కువ సమయంలో పూర్తి చేసి 45 లక్షల ఎకరాలకు రెండు పంటలకు సాగునీరు అందిస్తున్నది. రాష్ట్రంలో సాగు భూమి విస్తీర్ణం 119 శాతం పెరుగుదల జరిగింది.
– కమిషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ, హైదరాబాద్ వారిచే జారీ చేయనైనది