రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా రంజాన్‌ ‌వేడుకలు

  • హైదరాబాద్‌లో ప్రశాంతంగా రంజాన్‌ ‌‌ప్రార్థనలు
  • సిద్దిపేటలో ముస్లింలకు మంత్రి హరీష్‌ ‌‌శుభాకాంక్షలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 3 : మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా రంజాన్‌ ‌పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. చార్మినార్‌, ‌మక్కా మసీదు, వి•రాలం ఈద్గాతో పాటు రాష్ట్రంలోని అన్ని మసీదులు, ఈద్గాల్లో సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. సామూహిక ప్రార్థనలతో మసీదులు, ఈద్గాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. ముస్లిం సోదరులు ఒకరికొకరు రంజాన్‌ ‌శుభాంక్షలు చెప్పుకున్నారు. నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు కొనసాగించిన ముస్లిములు సోమవారం సాయంత్రం విరమించారు. కొరోనా కారణంగా రెండు సంవత్సరాల నుంచి ముస్లింలు ఇంటి వద్దనే రంజాన్‌ ‌వేడుకలు జరుపుకున్నారు. ప్రస్తుతం కొరోనా తగ్గుముఖం పట్టడంతో ఘనంగా ప్రార్థనలు నిర్వహించారు. ఇక రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు ముస్లిం సోదరులకు రంజాన్‌ ‌శుభాకాంక్షలు తెలిపారు. సిద్దిపేట ఈద్గా వద్ద నిర్వహించిన రంజాన్‌ ‌వేడుకల్లో మంత్రి హరీష్‌ ‌రావు, ఎమ్మెల్సీ ఫారూఖ్‌ ‌హుస్సేన్‌ ‌పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్టాడుతూ..రంజాన్‌ ‌పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు సంతోషంగా జరుపుకుంటున్నారని తెలిపారు. ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. పేద ముస్లిం ఆడపిల్లల వివాహాల కోసం షాదీముబారక్‌ ‌పథకం తెచ్చామన్నారు. పేద ముస్లిం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు మైనార్టీ రెసిడెన్షియల్‌ ‌పాఠశాలలను స్థాపించామన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలను సమానంగా గౌరవిస్తుందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ముస్లిం సోదరులతో అలయ్‌ ‌బలయ్‌ ‌తీసుకొని మంత్రి రంజాన్‌ ‌శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ ‌నేత ఫారుక్‌ ‌హుస్సేన్‌ ‌మాట్లాడుతూ.. రంజాన్‌, ‌బక్రీద్‌ ‌పండుగను సిద్దిపేటలో మంత్రి హరీష్‌ ‌రావు సహకారంతో సీఎం కేసీఆర్‌ ‌రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడుతున్నారన్నారు. తెలంగాణలో అన్ని పండగలను కలిసిమెలిసి జరుపుకుంటున్నా మన్నారు. సిద్దిపేటలో ముస్లింల కోసం 3కోట్లతో హజ్‌ ‌హౌజ్‌ ‌నిర్మించామని ఫారుక్‌ ‌హుస్సేన్‌ ‌తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page