కొత్తగా 494 మందికి పాజిటివ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 23 : రాష్ట్రంలో రోజువారీ కొరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గురువారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో 494 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం తాజాగా 494 కొరోనా కేసులు నమోదు కాగా జిహెచ్ఎంసి పరిధిలో కొత్తగా 315 కేసులు నమోదవగా, రంగారెడ్డి జిల్లాలో 102 కేసులు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 31 కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 7,97,632 కాగా, మొత్తం మృతుల సంఖ్య 4,111కి చేరుకుంది. ఇప్పటి వరకూ మొత్తం కోలుకున్న వారి సంఖ్య 7,90,473 కాగా యాక్టివ్ కేసుల సంఖ్య 3,048గా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది.