Take a fresh look at your lifestyle.

మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం వాయిదా తీర్మానం

న్యూ దిల్లీ, మార్చి 28 : మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం బీఆర్‌ఎస్‌ ‌పార్టీ పోరాటం ఉధృతం చేసింది. ఈ బిల్లుపై చర్చను కోరుతూ లోక్‌సభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. అఖిలపక్ష సమావేశం నిర్వహించి మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లుపై చర్చించాలని ఎంపీలు నామా నాగేశ్వరరావు, మాలోతు కవిత ఈ తీర్మానాలు ప్రవేశపెట్టారు.

మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లు కోసం దేశంలోని యూనివరసిటీలు, కాలేజీల్లో రౌండ్‌టేబుల్‌ ‌సమావేశాలు, చర్చలు నిర్వహించేందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మహిళా బిల్లుకు మద్దతు కోసం దేశంలోని ప్రముఖ విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, ఆలోచనపరులు, మేధావులకు ఎమ్మెల్సీ కవిత పోస్టు కార్డులు పంపించారు.

Leave a Reply