కీసర, ప్రజాతంత్ర , డిసెంబర్ 06 : చామకూర మల్లారెడ్డి మేడ్చల్ ఎమ్మెల్యేగా రెండవసారి ఎన్నికైన సందర్భంగా నాగారం మున్సిపాలిటీ కౌన్సిలర్ బిజ్జ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం ఆయన నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు పూల బోకే అందజేసి, శాలువాతో సన్మానించి అభినందించారు. నియోజవర్గ ప్రజలకు, కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని మల్లారెడ్డి అన్నారు. నాగారం మున్సిపాలిటీని అన్ని రంగాలలో మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించడానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్ నగర్, సంతోష్ నగర్, వెస్ట్ గాంధీనగర్ కాలనీలా సంక్షేమ సంఘం నాయకులు, బి ఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు అందుబాటులో ఉంటా మల్లారెడ్డి
