పాలమూరు ప్రజా గర్జనకు తరలివెళ్లిన బిజెపి నాయకులు

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 1 : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలమూరు ప్రజా గర్జన బహిరంగ సభకు కల్వకర్తి నియోజకవర్గ ప్రజలతో కలిసి జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి ఆధ్వర్యంలో భారీగా తరలి వెళ్లారు. కల్వకుర్తి నియోజకవర్గం లోని ఆమనగల్లు, మాడుగుల తలకొండపల్లి, కడ్తాల మండలాల నుంచి బిజెపి బీజేవైఎం నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో బస్సులు వాహనాలలో తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ఆమనగల్లు జడ్పీటీసీ కండే హరిప్రసాద్, ఆమనగల్లు మున్సిపాలిటీ కన్వీనర్ శ్రీకాంత్ సింగ్, ఆమనగల్లు మున్సిపాలిటీ చైర్మన్ రాంపాల్, కల్వకుర్తి అసెంబ్లీ కన్వీనర్ గోరటి నరసింహ, వైస్ దుర్గయ్య, కౌన్సిలర్స్ విజయ్ కృష్ణ, శ్రీశైలం యాదవ్, లక్ష్మణ్, కృష్ణ యాదవ్, శ్రీదర్, కల్వకుర్తి నియోజకవర్గం బీజేపీ పార్టీ మీడియా ఇంచార్జ్ రవి రాథోడ్, రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి ప్రభాకర్, విష్ణు చారి, ఆనంద్ , కెకె శ్రీను, యాదయ్య, బాలు నాయక్ బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు తరలి వెళ్లిన వారిలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page