Take a fresh look at your lifestyle.

పరీక్షలు విద్యార్థులకేనా..!

‘‘ఏకాగ్రత కోల్పోకుండా ఉండటం తరచూ నీళ్లు, జావ, మజ్జిగ, తాగడం, పోషకాహారం, డ్రై ఫ్రూట్స్, ‌నట్స్ ‌తరచూ తీసుకోవడం. రోజుకు కనీసం ఎనిమిది గంటలు నిద్ర పోవడం చేయాలి. ప్రభుత్వాలు పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు ఏర్పడకుండా చూడాలి. పరీక్షలు రాయడం అంటే .. తరగతి గదిలో నేర్చుకున్న వాటిని మనసుతో ఆలోచించి, స్మరణకు తెచ్చుకొని రాయాల్సి ఉంటుంది. కావున విద్యార్థులకు ఫ్యాన్లు, రాయడానికి వీలుగా బెంచీలు, కుర్చీలు, గాలి, వెలుతురు, నీరు, టాయిలెట్లు, రవాణా, విద్యుత్తు సౌకర్యాల కొరత రాకుండా చూడాలి. ’’

ప్రభుత్వాలకు ప రీక్షా కాలం ఇంకో ఆరు నెలలో, ఏడాదో ఉంది. కానీ ఇంటర్‌, ‌పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా కాలం చేరువైంది. ఈ సంక్లిష్ట సమయంలో ఒత్తిడికి (టెన్షన్‌ ‌కు) లోనై కొందరు  విద్యార్థులు ఆత్మ హత్య లకు పాల్ప డుతున్నారు.. ఇలాంటి వేళ పాలకులు, అధికారులు, తల్లిదండ్రులు అభం శుభం తెలియని విద్యార్థుల్లోని ఒత్తిడిని తగ్గించేలా మూలాలను వెతికి, ఆత్మహత్యలు పున రావృతం కాకుండా చూడాలి. ప్రభుత్వం  విద్యార్థులకు నిర్వహి ంచే పరీక్ష కేంద్రాల్లో అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. గతంలో లాగా విద్యార్థులు అసౌకర్యానికి లోను కాకుండా రేపటి తరం విద్యార్థుల జీవితాలకు స్వాంతన చేకూర్చేలా ప్రశాంతంగా పరీక్షలు రాసేలా చక్కటి వాతావరణాన్ని ఏర్పాటు చేయండి. పదిహేను ఏళ్ల పాటు చదివిన చదువు (అక్షరా)లకు తూకం వేసే కాలమిది.  నాడు నాటిన ‘‘జ్ఞానవిత్తనం’’ నేడు వృక్షమై ఫలాన్నిస్తుంది. అదే కాలానికి ఉన్న శక్తి.. జామ విత్తనం వేసి మామిడి పండును ఆశించడం దుర్లభం. అన్ని తరగతులకు వార్షిక పరీక్షలు అయితే, పదో తరగతికి, ఇంటర్‌ ‌విద్యార్థులకు బోర్డు పరీక్షలు. ఆ తర్వాత ఉన్నత, వృత్తి విద్యా చదువులకు ప్రవేశ పరీక్షలు ఉంటాయి.
నేటి విద్యార్థులకు రేపటి భవిష్యత్తును నిర్ణయించేవి కాబట్టి  వారు ఒత్తిడికి లోనవుతున్నారు. పరీక్షా  కాలం దగ్గర పడుతున్న కొద్దీ టెన్షన్‌ ‌భరించలేక పోతున్నారు. చదివింది గుర్తుకు రావటం లేదనీ, మర్చిపోతున్నాం అంటూ టెలీ మానస్‌ ‌టోల్‌ ‌ఫ్రీ నెంబర్‌ 14416  ‌కు ఇంటర్‌ ‌విద్యార్థుల ఫోన్ల వెల్లువ పెరిగిపోతుంది. మన రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నట్టు తెలుస్తుంది. గత అక్టోబర్‌ ‌నుండి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 60 వేల ఫోన్లు వచ్చినట్టు తెలుస్తుంది. అందులో అత్యధికులకు పరీక్షలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. ఆ తర్వాత మానవ సంబంధాలు( హ్యూమన్‌ ‌రిలేషన్షిప్‌) ఆర్థిక సమస్యలు ఉన్నాయి.
రాష్ట్రంలో మార్చి 15వ తేదీ నుండి ఇంటర్‌ ‌పరీక్షలున్నాయి. ఈ పరీక్షల్లో మొత్తం 9.51 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. అలాగే పదవ తరగతి పరీక్షల కోసం విద్యార్థులు సిద్ధమవుతున్నారు. టెన్షన్‌ ‌నివారణకు టోల్‌  ‌ఫ్రీ నెంబర్‌ ‌కు ఫోన్‌ ‌చేస్తున్న వారిలో 90 శాతం పైగా ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు ఉన్నారు. పరీక్షల ఒత్తిడి ఒక వైపు, ఆ తర్వాత ఉండే జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్, ‌నీట్‌, ఎం‌సెట్‌ ‌లో అర్హత సాధిస్తామా ! మంచి ర్యాంకు వస్తుందా లేదా ! అనే ఒత్తిడి ఈ రెండు గ్రూపుల విద్యార్థుల్లో ఉంటుందని నిపుణులు అంటున్నారు. దీంతోపాటు తల్లిదండ్రులు.. విద్యార్థుల  స్థాయిని తెలుసుకోకుండానే వారికి భారీ ఫీజులు చెల్లించి కార్పొరేట్‌, ‌ప్రైవేట్‌ ‌కాలేజీల్లో చేర్పించడంతో విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారని తెలుస్తుంది .ఈ పరీక్షల ఆందోళన ఒత్తిడి అనేది మనం వండుకునే వంటల్లో ఉప్పు లాంటిది. ఉప్పు వేయకపోతే కూరకు అసలు రుచి ఉండదు. అదే కొంచెం ఎక్కువైనా.. తినడానికి పనికిరాదు. అలాగే టెన్షన్‌ ‌కూడా, కొంచెం టెన్షన్‌ ‌గా ఉంటేనే విద్యార్థులు చదువుకుంటారు. లేకపోతే పూర్తిగా ఆటపాటల్లో లీనమై మొత్తంగా పరీక్షల్ని అశ్రద్ధ చేస్తారు, దీంతో ఎందులోనూ రాణించరు. ఈ ఒత్తిడి టెన్షన్‌ అతిగా పెంచుకుంటూ పోతే,  ప్రభావం మన శరీరం, మనసు మీద పడుతుంది. కాళ్లు వణుకుతాయి. చేతుల్లో చెమటలు రావడం. ప్రశ్న పత్రంలో ప్రశ్నలు ఎన్నడు కనీ, విననివిగా అనిపించడాలు. ఏది గుర్తుకు రాదు.
ఇక్కడే విద్యార్థులు తెలుసుకోవాల్సింది.. ఒక్క విద్యార్థికే కాదు టెన్షన్‌? అన్ని రంగాల్లోని అంటే క్రీడాకారులు గెలుపు కోసం, రైతులు పంట కోసం, కూలీలు పూట గడవడం కోసం, సినిమా వారు పేరు, డబ్బు కోసం, నాయకులు పదవి కోసం.. ఇలా ప్రతి రంగంలోని వారికి టెన్షన్‌ ఉం‌టుంది. ఇక్కడే మనం చేయాల్సింది దాన్ని ఎలా అధిగమించాలి అనే మార్గాలను వెతకడం. చాలామంది మానసిక నిపుణులు సూచనలను.. విద్యార్థులు, తల్లిదండ్రులు, పాలకులు తెలుసుకోవాలి. వీరు భయపడి టెన్షన్‌ ‌కు  లోనయ్యేంత తీవ్ర పరిస్థితి పరీక్షల్లో, పత్రాల్లో ఉండదు. మీకు బోధించిన పాఠ్యాంశాలే కావున భయం వీడండి. ఇతరులతో పోల్చుకోవద్దు, అర్ధరాత్రి వరకు చదవొద్దు. ఇలా చదివితే బుర్రకి ఎక్కదు గుర్తుకు రాదు. ప్రతి గంటకు సుమారు 15 నిమిషాలు విరామం తీసుకోవాలి. మధ్య మధ్యలో వ్యాయామం, యోగా లాంటివి చేయాలి. మీరు చదివిన విషయాల అంశాలపై ముఖ్యమైన పాయింట్లు నోట్‌ ‌చేసుకొని తరచూ గుర్తు చేసుకోవాలి. పిల్లల భవిష్యత్తు కోసం తల్లితండ్రులు ఫోన్లు, టీవీలను చూడడం మానండి. పరీక్షా కేంద్రం యుద్ధభూమి కాదు !  పరీక్షలంటే యుద్ధం చేయడం కాదు? ప్రశాంతంగా ఏకాగ్రతతో కోల్పోకుండా చదువుకున్న అంశాలు, బోధించినప్పటివి గుర్తు చేసుకుని రాయండి.
వ్యక్తిత్వ వికాస నిపుణులు ఏకాగ్రత చదువుల్లో ఎంతో అవసరం ఉందంటున్నారు. అది లేకుండా ఎన్ని గంటలు చదివిన బుర్రకెక్కదని చెప్తున్నారు.మండుతున్న ఎండలో నేల మీద ఒక కాగితం పడేస్తే, అది అలాగే ఉంటుంది .అదే ఒక భూతద్దంతో కిరణాలు దాని మీద కేంద్రీకృతం అయ్యేలా చేస్తే.. కాగితం క్షణాల్లో కాలిపోతుంది. అలాగే విద్యార్థులు మనసుని చదువుల మీద కేంద్రీకృతం చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు అంటున్నారులి. లిపరీక్షలు అందరికీ ఒకటే కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క వేరు వేరు పేపర్లు ఇవ్వరు కదా! ఎప్పటి పాఠం అప్పుడే చదివే వారికి పరీక్షల సమయంలో ఏ టెన్షన్‌ ఉం‌డదని  పెద్దలు, పిల్లలు గుర్తుపెట్టుకోవాలి.
ఏకాగ్రత కోల్పోకుండా ఉండటం తరచూ నీళ్లు, జావ, మజ్జిగ, తాగడం, పోషకాహారం, డ్రై ఫ్రూట్స్, ‌నట్స్ ‌తరచూ తీసుకోవడం. రోజుకు కనీసం ఎనిమిది గంటలు నిద్ర పోవడం చేయాలి. ప్రభుత్వాలు పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు ఏర్పడకుండా చూడాలి. పరీక్షలు రాయడం అంటే .. తరగతి గదిలో నేర్చుకున్న వాటిని మనసుతో ఆలోచించి, స్మరణకు తెచ్చుకొని రాయాల్సి ఉంటుంది. కావున విద్యార్థులకు ఫ్యాన్లు, రాయడానికి వీలుగా బెంచీలు, కుర్చీలు, గాలి, వెలుతురు, నీరు, టాయిలెట్లు, రవాణా, విద్యుత్తు సౌకర్యాల కొరత రాకుండా చూడాలి. ప్రైవేట్‌, ‌కార్పొరేట్‌ ‌విద్యా కేంద్రాలు విద్యార్థులకు హాల్‌ ‌టికెట్స్ ఇవ్వడంలో రుసుముల పేరుతో ఆలస్యం చేయడం లాంటి సంఘటనలు లేకుండా వారికి ముందే హాల్‌ ‌టికెట్‌ ‌పంపిణీ చేసేలా చూడాలి.
పరీక్షలు సమీపంలో ఉన్నందున విదార్థులు ఎలాంటి ఒత్తిడులకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, పాలకులపై ఉందని గమనించండి.  ఈ పరీక్షలు విద్యార్థులకు మాత్రమే కాదు.. అవి నిర్వహించే యాజమాన్యాలకు, అధికారులకు, బోధించిన ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, పాలకులకు కూడా పరీక్ష కాలమేనని గ్రహించండి. విద్యార్థులారా.. పరీక్షలు అంటే భయాన్ని వదిలిపెట్టండి. రోజు కాలేజీకో, బడికో వెళ్లినట్లే సహజంగా కొంచెం ప్రణాళికతో ముందుకు సాగండి. పరీక్షల్లో చక్కగా చదివేసిన వాటినే అలవోకగా రాసేయవచ్చు. విద్యార్థులకు ఇంకో అతి విలువైన మాట.. మార్కులు ర్యాంకులే ప్రతిభకు కొలమానం కాదు. పరీక్షలు రాయబోయే ఏ ఒక్క విద్యార్థి నిరాశ, నిస్పృహలకు లోను కావద్దు. ఆత్మ విశ్వాసం కన్న గొప్ప ఆస్తి లేదు.  ఆల్‌ ‌ది బెస్ట్..!

image.png

‌మేకిరి దామోదర్‌,‌సామాజిక విశ్లేషకులు, వరంగల్‌, 9573666650

Leave a Reply