‘‘ఏకాగ్రత కోల్పోకుండా ఉండటం తరచూ నీళ్లు, జావ, మజ్జిగ, తాగడం, పోషకాహారం, డ్రై ఫ్రూట్స్, నట్స్ తరచూ తీసుకోవడం. రోజుకు కనీసం ఎనిమిది గంటలు నిద్ర పోవడం చేయాలి. ప్రభుత్వాలు పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు ఏర్పడకుండా చూడాలి. పరీక్షలు రాయడం అంటే .. తరగతి గదిలో నేర్చుకున్న వాటిని మనసుతో ఆలోచించి, స్మరణకు తెచ్చుకొని రాయాల్సి ఉంటుంది. కావున విద్యార్థులకు ఫ్యాన్లు, రాయడానికి వీలుగా బెంచీలు, కుర్చీలు, గాలి, వెలుతురు, నీరు, టాయిలెట్లు, రవాణా, విద్యుత్తు సౌకర్యాల కొరత రాకుండా చూడాలి. ’’
ఇక్కడే విద్యార్థులు తెలుసుకోవాల్సింది.. ఒక్క విద్యార్థికే కాదు టెన్షన్? అన్ని రంగాల్లోని అంటే క్రీడాకారులు గెలుపు కోసం, రైతులు పంట కోసం, కూలీలు పూట గడవడం కోసం, సినిమా వారు పేరు, డబ్బు కోసం, నాయకులు పదవి కోసం.. ఇలా ప్రతి రంగంలోని వారికి టెన్షన్ ఉంటుంది. ఇక్కడే మనం చేయాల్సింది దాన్ని ఎలా అధిగమించాలి అనే మార్గాలను వెతకడం. చాలామంది మానసిక నిపుణులు సూచనలను.. విద్యార్థులు, తల్లిదండ్రులు, పాలకులు తెలుసుకోవాలి. వీరు భయపడి టెన్షన్ కు లోనయ్యేంత తీవ్ర పరిస్థితి పరీక్షల్లో, పత్రాల్లో ఉండదు. మీకు బోధించిన పాఠ్యాంశాలే కావున భయం వీడండి. ఇతరులతో పోల్చుకోవద్దు, అర్ధరాత్రి వరకు చదవొద్దు. ఇలా చదివితే బుర్రకి ఎక్కదు గుర్తుకు రాదు. ప్రతి గంటకు సుమారు 15 నిమిషాలు విరామం తీసుకోవాలి. మధ్య మధ్యలో వ్యాయామం, యోగా లాంటివి చేయాలి. మీరు చదివిన విషయాల అంశాలపై ముఖ్యమైన పాయింట్లు నోట్ చేసుకొని తరచూ గుర్తు చేసుకోవాలి. పిల్లల భవిష్యత్తు కోసం తల్లితండ్రులు ఫోన్లు, టీవీలను చూడడం మానండి. పరీక్షా కేంద్రం యుద్ధభూమి కాదు ! పరీక్షలంటే యుద్ధం చేయడం కాదు? ప్రశాంతంగా ఏకాగ్రతతో కోల్పోకుండా చదువుకున్న అంశాలు, బోధించినప్పటివి గుర్తు చేసుకుని రాయండి.