నడుస్తూ…సైకిల్‌ ‌తొక్కుతూ..ఉత్సాహంగా ముందుకు

మధ్యప్రదేశ్‌లో కొనసాగుతున్న రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర
డిసెంబర్‌ 4‌న రాజస్తాన్‌లోకి..

image.png
‌కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర నిరాటంకంగా కొనసాగుతూ 82వ రోజుకు చేరింది. యాత్రలో భాగంగా ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో పర్యటిస్తున్న రాహుల్‌ ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. యాత్రలో భాగంగా ఆ రాష్ట్రంలోని మోవ్‌లో యాత్ర కొనసాగిస్తున్న సందర్భంగా కొంతదూరం సైకిల్‌ ‌తొక్కుతూ ముందుకు సాగారు. దానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. రాహుల్‌ ‌గాంధీ సైకిల్‌ ‌తొక్కుతున్న సమయంలో ఆయనకు కట్టుదిట్టమైన భద్రత నడుమ కాంగ్రెస్‌ ‌నాయకులు, కార్యకర్తలు చుట్టుముట్టారు. అయితే రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన ఈ యాత్రలో కాంగ్రెస్‌ ‌నాయకుడి ప్రజలను ఆకర్షిస్తూ ముందుకు సాగుతున్నాడు. చేస్తున్న చిన్నచిన్న పనులతోనే ప్రజలందరినీ ఆకట్టుకుంటూ వెళ్తున్నాడు. ఫుట్‌బాల్‌ ఆడటం, గిరిజనులతో కలిసి నృత్య ప్రదర్శన చేయడం, నడవడం, రాష్ట్రవ్యాప్తంగా స్థానికులతో సరదాగా గడపడం ఇలా తనను కలిసిన సామాన్య వ్యక్తులతో ప్రత్యేక బంధం చూపడం వంటివి చేసి ప్రజల దృష్టిని తనవైపుకు తిప్పుకుంటున్నాడు. సోమవారం ఉదయం ఇండోర్‌లోని బడా గణపతి చౌరమా నుంచి రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర ప్రారంభమయింది. మొత్తంగా ఐదు నెలల పాటు జరిగే ఈ పాదయాత్రం 3500 కి.వి• దూరం సాగుతుంది.కాగా యాత్ర డిసెంబర్‌ 4‌న రాజస్తాన్‌లో ప్రవేశించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page