దేశంలో కులమతాల పేరిట రాజకీయాలు

హిజాబు, హలాలులపై కూడా రాజకీయం
జాతిపితనే అవమానించేలా ప్రసంగాలు
సర్జికల్‌ ‌స్ట్రయిక్స్, ‌కాశ్మీర్‌ ‌ఫైల్స్ ‌పేర విద్వేషాలు
ప్లీనరీ వేదికగా మతరాజకీయాలపై మండిపడ్డ కెసిఆర్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 27 : ‌దేశంలో మతం, కులం పేరిట రాజకీయాలు చేస్తున్న పార్టీలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ధ్వజమెత్తారు. ఈ దేశానికి కావాల్సింది కత్తుల కోలాటలు, తుపాకుల చప్పుళ్లు కాదు.. కరెంట్‌, ‌సాగునీరు, తాగునీరు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అని కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ ‌ప్లీనరీ వేదికగా సీఎం కేసీఆర్‌ ‌మాట్లాడుతూ జాతిపిత గాంధీని దూషణలు చేస్తున్నారు. ఏ దేశం కూడా ఇలాంటి దూషణలు చేయదు. ఇదేం దుర్మార్గం.. స్వాతంత్య్రం కోసం వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి, జాతిపితగా పేరు తెచ్చుకున్న వ్యక్తిని దుర్భషలాడటమా? ఆయనను చంపిన హంతకులను పూజిచం డమా? ఇది సంస్కృతా? ఇది పద్ధతా? ఎందుకు ఈ విద్వేషం. ఏం ఆశించి దీన్ని రగుల్చుతున్నారు. ఏ రకమైన మత పిచ్చి లేపుతున్నారు. మత విద్వేషాలు మంచిది కాదు. కుటిల రాజకీయాలు చేసి, పదవుల కోసం విధ్వంసం చేయడం తేలికనే. అదే కట్టాలంటే ఎంత శ్రమ అవసరం అని కేసీఆర్‌ ‌ప్రశ్నించారు. దేశంలో మత చిచ్చు రేపుతున్నారని బీజేపీ నేతలను ఉద్దేశించి కేసీఆర్‌ ‌తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జాతిపితగా పేరు తెచ్చుకున్న వ్యక్తిని దుర్భాషలాడు తున్నారని.. ఇదా మన సంస్కృతి..

ఇదేనా భారతదేశం అని ప్రశ్నించారు. ఏం ఆశించి బీజేపీ నేతలు విద్వేషాలు రెచ్చగొడుతున్నారని.. దేశాన్ని ఎటు తీసుకువెళ్తు న్నారని నిలదీశారు. సమస్యలతో దేశం సతమతమవుతుంటే.. దీనిపై దృష్టి పెట్టకుండా.. విద్వేషం, ద్వేషం ఒక పిచ్చి దేశానికి లేపి రాజకీయ పబ్బం గడుపుతున్నారని కేసీఆర్‌ ‌మండిపడ్డారు. పుల్వామా, సర్జికల్‌ ‌స్టైక్్ర‌ ‌కశ్మీర్‌ ‌ఫైల్స్ అం‌టూ విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. ఇదేవి• దౌర్భాగ్యం. ప్రేమతో, అనురాగంతో. సోదరభావంతో ఉజ్వలమైన భారత్‌ను నిర్మించాలి. పిచ్చి కొట్లాటలతో నష్టపోతున్నామని కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. దేశ రాజధానిలో దేవుని పేరువి•ద జరిగే ఊరేగింపులో కత్తులు, తుపాకులతో చెలరేగిపోయారు.

ఈ భారతదేశమేనా మనకు కావాల్సింది. మహాత్ముడు కలలగన్నది ఈ దేశమేనా? ఇదేనా ప్రజలు కోరుకునేది. కత్తుల కోలాటలు ఎవరికి కావాలి. కావాల్సింది కరెంట్‌, ‌సాగునీరు, మంచినీళ్లు, ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు. వాటన్నింటిని పక్కకు పెట్టేసి, మతం, కులం పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ఈ దేశం ఇట్లనే నాశనం కావాల్నా. లేదు టీఆర్‌ఎస్‌ ‌గా మనం కూడా ఒక పాత్ర పోషించాల్నా? మన శక్తిని ప్రదర్శించి ఈ దుర్మార్గాన్ని నిలువరించి ఒక మార్గాన్ని చూపెట్టాల్నా.. ఇలాంటి ప్రశ్నలు మన ముందున్నా యని కేసీఆర్‌ ‌తెలిపారు. మన పొరుగు రాష్ట్రం కర్ణాటక రాజధాని బెంగళూరు సిలికాన్‌ ‌వ్యాలీ ఆఫ్‌ ఇం‌డియాగా పేరు సంపాదించిందని కేసీఆర్‌ ‌గుర్తు చేశారు. అక్కడ 30 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలున్నాయి. పరోక్షంగా మరో 30 లక్షల మంది బతుకుతున్నారు.

దీని వెనుకాల ఎంతో కృషి ఉంది. కానీ ఇటీవల కాలంలో హిజాబ్‌, ‌హలాల్‌ ‌జరుగుతుందీ ఆ రాష్ట్రంలో. కులం,మతం పేరుతో దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నారు. అమెరికాలో మనోళ్లు 13 కోట్ల మంది ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారు వి•రు మా మతస్తులు, కులస్తులు కాదు అని పంపిస్తే ఈ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తదా? మత విద్వేషాలను రెచ్చగొట్టే ఈ దేశం ఉద్యోగాలను ఇస్తదా? ఇది ఎవరికీ మంచిది కాదు. దీని వల్ల ఏం సాధిస్తారు. దేశం అన్ని రంగాల్లో నాశనమై పోయింది. పోయినా సర్కారే మంచిగా ఉండే అని మాట్లాడుతున్నారు. నిరుద్యోగం పెరిగింది. ఆకలి పెరిగింది. రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. నిత్యావసరల ధరలు పెరుగుతున్నాయి. పరిశ్రమలు మూతపడ్డాయని దీనిని ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page