కోవిడ్‌ ‌ముప్పు పూర్తిగా తొలగిపోలేదు

వ్యాక్సినేషన్‌ ‌మాత్రమే కొరోనాను అరికడుతుంది
మళ్లీ కేసులు పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలి
రాష్ట్రాల సిఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్
‌పెట్రోలు, డీజిల్‌ ‌ధరలపై వ్యాట్‌ ‌తగ్గించుకోవాలని రాష్ట్రాలకు సూచన

న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 27 : ‌దేశంలో కోవిడ్‌-19 ‌ముప్పు పూర్తిగా తొలగలేదని, అంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రజలను అప్రమత్తం చేస్తూ ముందుకు సాగాలన్నారు. దేశంలోని కోవిడ్‌ ‌పరిస్థితిపై ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని బుధవారంనాడు వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా సమస్యలపై చర్చించారు. థర్డ్ ‌వేవ్‌ అనంతరం భారీగా తగ్గిన కేసులు, మరణాల మళ్లీ పెరుగుతుండటంతో, నాలుగో వేవ్‌ ‌వొచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతున్నది. దేశంలో కొత్తగా కొరోనా రోజువారీ కేసులు దాదాపు 3 వేలకు చేరుతున్న నేపథ్యంలో ప్రధాని వీడియో కాన్ఫెరెన్స్ ‌ద్వారా పరిస్థితిని సవి•క్షించారు. కొరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, వ్యాక్సినేషన్‌ అం‌శాలపై చర్చించారు. ఫోర్త్ ‌వేవ్‌ ‌వొస్తే తీసుకోవాల్సిన చర్యలు, హాస్పిటళ్లలో మౌలిక సదుపాయాలు, మందులు తరతర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ఇతర దేశాలతో పోలిస్తే కోవిడ్‌ ‌సంక్షోభాన్ని మనం సమర్ధవంతంగా ఎదుర్కున్నామని, ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నట్టు తెలుస్తున్నందున అంతా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కోవిడ్‌ ‌సవాళ్లను ఇంకా అధిగమించ లేదనే విషయం మాత్రం చాలా స్పష్టమని ముఖ్యమంత్రులను ప్రధాని అప్రమత్తం చేశారు. కోవిడ్‌ ‌బారిన పడకుండా చూసే రక్షణకవచం టీకాలేనని అన్నారు. దేశంలోని వయోజనుల్లో 96 శాతం మంది కనీసం ఒకటి లేదా రెండు డోసులు తీసుకోవడం ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయమని అన్నారు. 15 ఏళ్లు పైబడిన అర్హులైన వారిలో 85 శాతం మంది సెకెండ్‌ ‌డోస్‌ ‌తీసుకున్నారని చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో కోవిడ్‌ ‌నిబంధనలపై అవగాహన కల్పించాలని సీఎంలకు సూచించారు. అర్హత కలిగిన పిల్లలందరికీ సాధ్యమైనంత త్వరగా వ్యాక్సినేషన్‌ ఇచ్చే పక్రియకు ప్రాధాన్యం ఇవ్వాలని మార్గనిర్దేశం చేశారు. ఇతర దేశాలతో పోలిస్తే దేశంలో కోవిడ్‌ ‌సంక్షోభాన్ని పూర్తి స్థాయిలో ఎదుర్కున్నప్పటికీ కేసులు పెరుగుతుండటం ఆందోళనకర అంశం. మనమంతా అప్రమత్తంగా ఉండాలి. కోవిడ్‌ ‌సవాలును అధిగమించాలి. ఈ విషయంలో కేంద్రం, రాష్ట్రం మధ్య సమన్వయం చాలా ముఖ్యమన్నారు. దేశంలో వ్యాక్సినేషన్‌ ‌పక్రియ కొనసాగుతుంది. మన దేశ వయోజన జనాభాలో 96 శాతం మంది మొదటి డోస్‌ ‌వ్యాక్సినేషన్‌ ‌పక్రియ పూర్తయ్యిందని అన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఆంధప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. టిఆర్‌ఎస్‌ ‌ప్లీనరీ కారణంగా సిఎం కెసిఆర్‌ ‌హాజరుకాలేక పోయారు.
సమాఖ్య స్ఫూర్తితో పెట్రోలుపై పన్నులు తగ్గించండి : రాష్ట్రాలకు ప్రధాని మోదీ సూచన
పెట్రోల్‌ ‌ధరలపై ప్రధాని స్పందిస్తూ..కొన్ని రాష్ట్రాలు మాత్రమే పెట్రోల్‌పై వ్యాట్‌ ‌తగ్గించాయి. ఇప్పటికైనా పన్నులు తగ్గించాలని మిగతా రాష్ట్రాలను కోరుతున్నా. సమాఖ్య స్ఫూర్తితో పెట్రోల్‌పై పన్నులు తగ్గించండి. అన్ని రాష్ట్రాల కంటే తక్కువగా ఉత్తరాఖండ్‌లో లీటర్‌ ‌పెట్రోల్‌ ‌ధర రూ. 104 ఉండగా..ఎక్కువగా మహారాష్ట్రలో లీటర్‌ ‌రూ. పెట్రోల్‌ ‌ధర రూ. 122గా ఉందని తెలిపారు. వ్యాట్‌ను తగ్గించుకుని ప్రజలకు భారం తగ్గించాలని ప్రధాని మోడీ సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర హోమ్‌ ‌మంత్రి అమిత్‌షా, ఉత్తరప్రదేశ్‌ ‌సీఎం యోగి ఆదిత్యనాథ్‌, ‌హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌ ‌లాల్‌ ‌కట్టర్‌, ‌పశ్చిమబెంగాల్‌ ‌ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఛత్తీస్‌గఢ్‌ ‌ముఖ్యమంత్రి భూపేష్‌ ‌బఘెల్‌, ‌పంజాబ్‌ ‌సీఎం భగవంత్‌ ‌మాన్‌,ఎపి సిఎం జగన్‌ ‌సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page