వేసవి వచ్చిందంటే ప్రజలు కూల్డ్రింక్ షాపులవైపు పరుగెడతారు. ప్రతి ఇంట్లో రిఫ్రిజిరేటర్లలో కూల్డ్రింక్ బాటిల్స్ నిండి ఉంటాయి. చాలామంది ప్రతి వారం షాపింగ్ మాల్స్ కు వెళ్లి కార్టూన్ కొద్దీ శీతలపానీయాలు కొని కార్ట్ ను బలవంతంగా తోసుకువస్తుంటారు. వాస్తవానికి కూల్ డ్రింక్స్ చల్లదనాన్ని ఇవ్వవు. ఇవ్వకపోగా మనిషి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయని అనేక పరిశోధనలలో తేలింది. మన శరీరంలో జరిగే మార్పును గ్రహించకుండా ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకమైన అలవాట్లను మనిషి నేర్చుకున్నాడు. ముఖ్యంగా ఈ ప్రాశ్చ్యత్త ఫ్యాషన్ నాగరికతలో భాగంగా కూల్డ్రింకులను బాగా అలవాటు పడ్డారు. కూల్డ్రింక్స్ లో ఎక్కువశాతం పురుగుల మందుల అవశేషాలు పుష్కలంగా ఉన్నట్లు సెంటర్ ఫార్ సైన్స్ అండ్ ఎన్విరోనమెంటల్ ఇండియా దశాబ్ద క్రితమే తేల్చి చెప్పింది. మానవ శరీరాలను ప్రమాద కారకంగా మారే పదార్థాలు కూల్డ్రింక్స్ లో ఉండే పదార్థాలు కార్బోనేటేడ్ వాటర్, కార్న్ సిరప్, పంచదార, ఎస్పిరటం, కారమెల్,పాస్ఫరిక్ ఆమ్లం, కెఫిన్, సిట్రిక్ ఆమ్లం, పొటాషియం బెంజైట్,పొటాషియం సిట్రేట్ ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. కూల్డ్రింక్స్ లో ఉండే ఆర్గానో క్లోరిన్, అర్గోనో ఫాస్ఫరస్ పురుగుల మందులైన లిండేన్,డిడిటి, మలాథియాన్ ఉన్నట్లు పరిశోధనలు చెపుతున్న ప్రభుత్వాలు వీటిని బ్యాన్ చేయడం లేదు.
ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కూల్డ్రింక్ కంపెనీలు ఏటా ఏడు వేల కోట్లు దోచుకుంటున్నాయి. ప్రజల డబ్బుతో హీరోగా, క్రీడాకారులుగా, అవార్డు గ్రహీతలు పెద్దమనుషులు గా చలామణి అవుతున్నవారు కోట్లల్లో డబ్బు తీసుకుని ప్రజా ఆరోగ్యాన్ని నిర్వీర్యం చేసే వాణిజ్య ప్రకటనలు ఇస్తున్నారు. వీరిపై క్రిమినల్ కేసులు బనాయించాల్సిన ప్రభుత్వం వీరిని అవార్డులతో సత్కరించడం సిగ్గుచేటు. కూల్డ్రింకులు పిహెచ్ శాతం టాయిలెట్ క్లినర్స్ యాసిడ్తో సమానంగా ఉంటుంది ఇది శరీరానికి చాల ప్రమాదకరం. స్థూలకాయం, ఊపిరి తిత్తులు, బి. పి, షుగర్, ఎముకల మెత్తబడి పోవడం, కీళ్ల నొప్పులు అధికంగా ఉంటాయి. జీర్ణ వ్యవస్థను ధ్వంసం చేసి, రీనల్ ఫైల్యూర్ కు దారి తీస్తుంది. గర్భిణీ స్త్రీలు కూల్డ్రింకులు సేవిస్తే పుట్టబోయే పిల్లలు – పిండం పై ప్రభావం ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులు, కిడ్నీ, లివర్, క్యాన్సర్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది.
శీతల పానీయాలు, సోడాలు లేదా శీతల పానీయాలు తరచుగా ఖాలీ కేలరీలుగా సూచిస్తారు, ఎందుకంటే అది శరీరానికి ఎటువంటి ప్రయోజనాలు అందించవు అందుకు బదులుగా అనేక విధాలుగా హాని చేస్తాయి. బరువు పెరగడం, శ్వాసకోశ సమస్యలు, ఒబెసిటీ నుండి మధుమేహం ముప్పును బహిర్గతం చేయడం వరకు, శీతల పానీయాలను క్రమం తప్పకుండా తాగడం వల్ల అన్ని రకాల అనర్థదాయకం. శీతల పానీయాలు బరువు పెరుగుటకు దారితీస్తాయనేది కొసమెరుపు. సోడాలు మరియు శీతల పానీయాలు చక్కెరతో నిండి ఉంటాయి, తద్వారా వేగంగా బరువు పెరుగుతారు. ఒక సాధారణ డబ్బా కోకాకోలాలో 8 టేబుల్ స్పూన్ల చక్కెర ఉంటుంది. శీతల పానీయాలు మీ కోరికలను తీర్చగలవు కానీ అవి మీ కడుపుని నింపవు. అవి కొంతకాలం ఆకలి బాధలను అణచివేయవచ్చు, కానీ చివరికి మీరు ఎక్కువ తినేలా చేయవచ్చు. శుద్ధి చేసిన చక్కెరలో రెండు ప్రధాన సమ్మేళనాలు ఉన్నాయి – గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్. గ్లూకోజ్ శరీరంలోని కణాల ద్వారా సులభంగా జీవక్రియ చేయబడుతుంది, అయితే ఫ్రక్టోజ్ కాలేయం ద్వారా మాత్రమే జీవక్రియ చేయబడుతుంది. శీతల పానీయాల ద్వారా అందించబడిన ఫ్రక్టోజ్ అధికం ఓవర్లోడ్కు కారణమవుతుంది. ఈ ఓవర్లోడ్ కారణంగా, కాలేయం ఫ్రక్టోజ్ను కొవ్వుగా మారుస్తుంది, ఇది కాలేయంలో పేరుకుపోతుంది.
ఇది ఏ సమయంలోనైనా కొవ్వు కాలేయ వ్యాధిగా మారుతుంది, ఇది చాలా ప్రమాదకరమైనది. ఇన్సులిన్ హార్మోన్ యొక్క ప్రధాన విధి రక్తప్రవాహం నుండి కణాలలోకి గ్లూకోజ్ను నడపడం. శీతల పానీయాల రూపంలో చక్కెరను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల, శరీర కణాలు ఇన్సులిన్ ప్రభావాలకు నిరోధకతను కలిగి ఉంటాయి. దీని కారణంగా, ప్యాంక్రియాస్ ఎక్కువ ఇన్సులిన్ను ఉత్పత్తి చేస్తుంది, ఇది రక్తంలో ఇన్సులిన్ స్పైక్కు కారణమవుతుంది. సోడాలు చక్కెరతో లోడ్ చేయబడినందున, అధికంగా ఫ్రక్టోజ్ తీసుకోవడం ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుందని తెలిసిన వాస్తవం. అందువల్ల, శీతల పానీయాలను అధికంగా తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్కు కారణం కావచ్చు. అనేక అధ్యయనాలు సోడా వినియోగాన్ని టైప్ 2 డయాబెటిస్కు కూడా అనుసంధానిస్తాయి. శీతల పానీయాలు ఎటువంటి ఖనిజాలు లేదా పోషకాలు లేకుండా కేవలం ఖాళీ కేలరీలు. సాధారణ శీతల పానీయాల 1 సీసాలో దాదాపు 150-200 కేలరీలు ఉంటాయి, ఇవి శరీరానికి చక్కెర మరియు కేలరీలను మాత్రమే అందిస్తాయి. షుగర్ రష్ శరీరంలో డోపమైన్ను విడుదల చేస్తుంది అలాగే కోరికలను తీర్చుతుంది, ఇది కాలక్రమేణా చాలా వ్యసనానికి బానిసను చేస్తుంది. శీతల పానీయాలు దంతాలకు భయంకరమైనవి వాటిని కుళ్ళిపోయే అవకాశం ఉంది.
సోడాల్లో ఫాస్పోరిక్ యాసిడ్ మరియు కార్బోనిక్ యాసిడ్ ఉంటాయి, ఇవి దీర్ఘకాలంలో పంటి ఎనామిల్ను నాశనం చేస్తాయి. చక్కెరతో కలిపిన యాసిడ్ నోటిలో బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి సరైన వాతావరణాన్ని సిద్ధం చేస్తుంది, ఇది కావిటీలకు కారణమవుతుంది ప్రజలు వేసవిలో మజ్జిగ, లస్సి, పండ్ల రసాలు, రాగి జావ, తాటి ముంజలు, కర్బుజా, కళింగర, కీర దోస పిల్లలకు అలవాటు చేస్తే మంచిది. మంచి ఆరోగ్య అలవాట్లు ఇంటినుండే ప్రారంభం కావాలి. పెళ్లిళ్లలో, శుభకార్యాలలో ఆరోగ్యాన్ని హానికలిగించే అన్ని రకాల కూల్డ్రింక్స్ నిలుపుదల చేయాలి. ప్రభుత్వం దీనిని నిషేధించే వరకు ప్రజలు పౌర సంఘాలు ఉద్యమించాలి. స్వలాభం కోసం వాణిజ్య ప్రకటనలు ఇచ్చే హీరోలు, హీరోయిన్లు, క్రీడాకారులను ప్రశ్నించండి. మనం చనిపోయిన తర్వాత దహన సంస్కారం చేస్తే శవం పూర్తిగా కాలిపోతుంది. ఎముకలు పూర్తిగా కాలిపోతాయి. కానీ నోటిలోని పళ్లు మాత్రం కాలిపోవు. శవాన్ని కాల్చడానికి బదులుగా భూమిలో పాతి పెడితే శరీరం మొత్తం మట్టిలో కలిసి పోతుంది.
20 సంవత్సరాల తర్వాత ఆ మట్టి భాగాన్ని తవ్వి తీస్తే పళ్లు మాత్రం చెక్కు చెదరకుండా ఉంటాయి. అంత గట్టిగా మన పళ్లు తయారు చేయబడ్డాయి. ఏ పళ్లను అగ్ని కాల్చలేక పోయిందో, ఏ పళ్లను మట్టి తనలో కరిగించు కోలేక పోయిందో, అదే పళ్లను 20 రోజుల పాటు ఏదైనా ఒక కూల్డ్రింక్లో ఉంచి పరిశీలిస్తే అవి పూర్తిగా కరిగిపోతున్నాయి. ఆ పళ్లు రంగుమారి నొక్కితే పిండిగా అయిపోతున్నాయి. ఒక కూల్డ్రింకులో ఒక పన్ను వేసి ఎనిమిదవ రోజు చూసేసరికి ఆ పన్ను పూర్తిగా కరిగిపోయి మాయమైంది. మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే లోపు 50 టన్నుల ఆహారాన్ని అయినా ఈ పళ్లతో నములుతాం. అన్ని టన్నుల ఆహారాన్ని నమిలినా అరగని పళ్లు మాత్రం ఒక కూల్డ్రింక్ నెల తిరగకుండా కరిగించేస్తున్నదంటే అవి తాగే పానీయాల లేక విషపదార్ధాలా? విషపదార్థాలే, కాకపోతే ఎక్కువగా నీటి శాతం ఉండబట్టి మెల్లగా చంపే విషం లా పనిచేస్తాయి. అలాంటి గట్టి పళ్లనే నాశనం చేసే డ్రింక్స్కి మన లోపలి పేగులు, నరాలు, కణాలు ఒక లెక్కా ఏమిటి. ప్రభుత్వం సత్వరమే శీతలపానీయాలను తక్షణమే బ్యాన్ చేయాలి. అమ్మకం దారులను తక్షణమే అరికట్టాలి.
డా।।. ముచ్చుకోట సురేష్బాబు రాష్ట్ర అధ్యక్షులు, ప్రజాసైన్స్ వేదిక