Take a fresh look at your lifestyle.

కుంభకోణాలు ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయా…

‘‘‌కింది స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు కోట్ల రూపాయల్లో అవినీతి కుంభకోణాలు జరుగుతున్నయన్న ఆరోపణలు తరచుగా విన వస్తూనే ఉన్నాయి.ప్రభుత్వం అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగులు వీరి  సమ్మేళనమే ప్రభుత్వం అయినప్పడు ప్రభుత్వంలోని కొందరి చేతుల్లో  ఆర్థిక వ్యవస్థలో నిధులను స్వప్రయోజనాలకే ప్రక్క తోవపట్టిస్తు ఎక్కువ మొత్తంలో అవినీతి పాల్పడుతున్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సంఘటనలు కొనసాగుతూనే ఉండటం శోచనీయం.’’

  • వివిధ రంగాల్లో అతిగా విస్తరిస్తున్న అవినీతి ..
  • కోట్ల రూపాయల కుంభకోణాల ఆరోపణలు…
  • కింద  నుంచి పై  స్థాయి వరకు అక్రమాలేనా..
‘’భారతదేశ  స్వాతంత్రానంతరం దేశ సామాజిక అభివృద్ధిలో ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు చోటు చేసుకున్నప్పటికీ,రాజ్యంగ బద్ధమైన  ప్రజాస్వామ్య విలువలతో కూడిన స్వతంత్ర భారతావనిలో దేశ పురోగతి అభివృద్ధి లో ప్రజల భాగస్వామ్యంతో పన్నుల రూపంలో ప్రభుత్వాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా అందుతున్న తిరిగి ప్రభుత్వాలు అనుసంధానంగా ప్రజలకు కావలసిన సౌకర్యాలకు వినియోగించే  పరిస్థితులు సరియైన రీతిలో లేకపోవడం ప్రజలు పాలకుల వ్యవహారాల్లో అవసరాలను నెరవేర్చుకునే పరిస్థితిలో పన్నుల రూపంలో జమవుతున్న మొత్తాలు ప్రభుత్వం ఆధీనంలో ఉన్నప్పుడు స్వార్థపరులు స్వార్థం కొరకు స్వాలబ్ది కొరకు ప్రభుత్వంలోని కొందరు   కార్పొరేట్‌ ‌సంస్థలలో మరికొందరు సమాజంలో అభివృద్ధి పనుల్లో  ఖర్చు పెట్టే నిధుల్లో చాలావరకు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు లేకపోలేదు.కింది స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు కోట్ల రూపాయల్లో అవినీతి కుంభకోణాలు జరుగుతున్నయన్న ఆరోపణలు తరచుగా విన వస్తూనే ఉన్నాయి.
ప్రభుత్వం అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగులు వీరి  సమ్మేళనమే ప్రభుత్వం అయినప్పడు ప్రభుత్వంలోని కొందరి చేతుల్లో  ఆర్థిక వ్యవస్థలో నిధులను స్వప్రయోజనాలకే ప్రక్క తోవపట్టిస్తు ఎక్కువ మొత్తంలో అవినీతి పాల్పడుతున్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సంఘటనలు కొనసాగుతూనే ఉండటం శోచనీయం.అన్ని రంగాల్లో కోట్ల రూపాయల్లో కుంభకోణాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి నిజానిజాలు నిర్ధారణ మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టే విచారణ దర్యాప్తు సంస్థలు విచారణ కొనసాగించిన చట్ట ప్రకారం నిర్ధారించే చర్యలు ఏ కుంభకోణంలోనూ పూర్తిస్థాయిలో లేకపోవడం,ఆర్థిక లావాదేవీలు అవినీతి కుంభ కోణాలుచేసేవాళ్లు చట్టానికి దొరకకుండా పక్క ప్రణాళికలతోనే దేశ ఆర్థిక వ్యవస్థను దోపిడీ చేయడం కొంత మందికి సర్వసాధారణమైనదేమో..’’
దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ రంగాల్లో ప్రైవేట్‌ ‌రంగాల్లో కొంతమంది స్వలాభం కొరకు సప్రయోజనాలతో కోట్ల రూపాయలను ప్రభుత్వ బ్యాంకింగ్‌ ‌లాంటి ఆర్ధిక వ్యవస్థల నుండి అప్పు తీసుకొని తిరిగి కట్టకుండా ఎగవేస్తూన్న  ప్రముఖులు కూడా అనేక కుంభకోణాల్లో చిక్కుకోవడం ,దేశ ఆర్థిక అభివృద్ధిలో దేశ రక్షణ కొనుగోళ్ల విషయంలో ముఖ్యమైన పాలసీలలో పథకాలలో కోట్ల రూపాయలను వెచ్చించే క్రమంలో గుట్టుచప్పుడు కాకుండా కొంత శాతాన్ని వాటా కింద సొంత లాభాల కోసం అక్రమ మార్గంలో తీసుకోవడం జరుగుతుందనే ఆరోపణలు ఉంటున్నాయి. ఇలాంటి కుంభకోణాల్లో ఎక్కువగా ప్రముఖుల పేర్లు విన వస్తాయి  దేశాన్ని పాలించిన ప్రధానులు మొదలు ఎమ్మెల్యేలు, ఎంపీలు ,ఎమ్మెల్సీలు ,రాజకీయ నాయకులు ,అధికారులు కార్పొరేట్‌ ‌సంస్థల అధినేతలు తదితరుల ప్రమేయం  కుంభకోణాలలో ఉంటుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో అధికార పక్షం వారైతే ప్రతిపక్షం వారి ఆరోపణతో ప్రతిపక్షాల వారైతే అధికార పక్షంలోని వారు ఇలాంటి విషయాలను బయటికి తీసుకురావడం ఒకరి మధ్య ఒకరికి  సయోధ్య కుదరనప్పుడు  కుంభకోణాలు ఆరోపణలు వెలుగు చూడడం సర్వసాధన మైపోతున్నాయి.
ప్రజలకు సేవ చేయవలసిన నాయకులు దేశ వ్యాపార వాణిజ్య ఆర్థిక లావాదేవీల్లో దేశాన్ని ప్రధమ స్థానంలో ఉంచే నాయకులు అధికారులు వ్యాపారవేత్తలు ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టే ప్రయత్నంలో కుంభకోణాల పేరిట కోట్ల రూపాయలను సేకరించే విధానంతో భారత రాజకీయ  ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవ్వడమే కాకుండా దేశంలోని వేలకోట్ల రూపాయల సంపాదన సంపాదన కేవలం కొంతమంది చేతుల్లోనే ఉండిపోతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రజలు కట్టిన ధనం పన్నుల రూపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చేరుతున్నప్పటికీ ప్రభుత్వాలు తీసుకునేటటువంటి విధానాలు ప్రజలకు ఉపయోగకరమైన కార్యకలాపాలను చేసే క్రమంలో కోట్ల రూపాయలు.కొంతమంది స్వార్థపు వ్యక్తులచే దుర్వినియోగం అవుతుండడం శోచనీయం.
దేశంలో ఎన్ని కుంభకోణాలు జరుగు తున్నప్పటికీ  ఆరోపణలు వస్తే తప్ప దర్యాప్తు సంస్థలు విచారణ కొనసాగించిన  చట్ట పరిధిలో శిక్షించపడే వారి శాతం కూడా చాలా తక్కువే వివిధ వ్యవస్థల్లో అవినీతి ఆరోపణలు లేకుండా కుంభకోణాలు జరగకుండా నిస్వార్థులైన దేశ నాయకులు అధికారులు పక్కా ప్రణాళికలతో ముందుగా జాగ్రత్త వహిస్తే ఇలాంటి అవినీతి ఆరోపణలు కుంభకోణాలు కొంతైనా అరికట్టడానికి వీలు అవుతుందేమో దేశంలో అవినీతి ఆరోపణలు కుంభకోణాలు క్షేత్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాల్లో పాటు కేంద్ర ప్రభుత్వాల్లో కూడా తరచుగా సంఘటనలు పునరావృతం అవుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఆర్థిక ఆరోపణలతో వెలుగులోకి కుంభకోణాలు ..
చాలా సందర్భాల్లో దేశాన్ని పాలించిన ప్రభుత్వాల్లో సైతం వేల కోట్ల రూపాయల కుంభకోణాలు జరగాయన్న ఆరోపణలు వినవచ్చాయి.దర్యాప్తు సంస్థలు వివరాలతో దర్యాప్తు ముందుకు కొనసాగించిన ఎక్కువ శాతం కుంభకోణాల ఆరోపణలు పూర్తిగా  సమాదానం లేని ప్రశ్నలు గానే మిగిలిపోతున్నాయా అని పిస్తోంది అని అనుకునే వారు లేకపోలేదు .ప్రతిపక్షాలు పాలకులు  ఒకరికొకరు అవినీతి కుంభకోణ ఆరోపణలు చేసుకో వడం దేశ ప్రజల యొక్క దృష్టిని తమవైపు మళ్లించు కోవడానికి పెద్ద ఎత్తున వీటిపై స్పందించే తీరు స్వార్థ రాజకీయాల కొరకేనా అని గుసగుసలు ఆడుకునేవారు లేకపోలేదు.
రాజకీయంలో పలుకుబడి కలిగిన వ్యక్తులు కొందరు స్వార్థపూరిత అధికారుల ప్రమేయంతో ఇలాంటి కుంభకోణాలు జరుగుతుండడం ఏదో ఒక క్రమంలో  సందర్భంలో విషయం బయటికి రావడం దీనిపై ఎవరికి అనుకూలమైన విధానంలో వారు రచ్చ రచ్చ చేయడం  మామూలైపోతుంది. పాలకులు ప్రతిపక్షాలు అధికారులు తమ విధినిర్వాహనలను కర్తవ్య ధర్మాన్ని దుర్వినియోగం కాకుండా ప్రజలు, దేశ సంక్షేమం కొరకే పాటుపడితే ఇలాంటి ఆరోపణలకు తావుండదేమో.
 విభేదాలతోనే పొడచూపుతున్న ఆరోపణలు …
దేశంలో ప్రభుత్వాలు మారుతున్న క్రమంలో గత ప్రభుత్వాలలో జరిగిన అవకతవకలను  అధికార పక్షం ,ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు ఆరోపణలను ప్రత్యారోపణలు చేసుకోవడం సర్వసాధనమైపోయింది. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న హయాంలో జరిగిన భోఫర్స్ ఆర్మీకి చెందిన తుపాకుల కొనుగోలు విషయాల్లో వేల కోట్ల రూపాయల కుంభకోణంలో అవకతవక జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాఫెల్‌ ‌యుద్ధమానాలకు సంబంధించి విలువైన సమాచారం దాచి వేల కోట్ల రూపాయలు అనుకూలమైన ప్రైవేట్‌ ‌వ్యక్తులకు అప్పగించారని అనుమానాలు ఆరోపణలు వచ్చాయి. దేశంలో బయటకు వచ్చిన కుంభకోణాలలో ప్రభుత్వ, కార్పొరేట్‌ ‌సంస్థల కుంభకోణాలలో స్టాక్‌ ‌మార్కెట్‌ ‌కుంభకోణం టూజి స్పెక్ట్రామ్‌ ‌కుంభకోణం తెల్గీ డూప్లికేట్‌ ‌స్టాంప్‌ ‌ఫోర్జరీ కేసుకు సంబంధించిన కుంభకోణం, హవాల కుంభకోణం కామన్వెల్త్ ‌క్రీడలకు సంబంధించిన కోట్ల రూపాయల దుర్వినియోగం లాంటి కుంభకోణంలో అధికారులు సహకారం అందించడం వల్లనే ఇలాంటి సంఘటనల చోటుచేసుకుంటున్నయా అనే వాదనలు తరచూ బలంగా వినిపిస్తున్నాయి.
 ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్‌ ‌కుంభకోణంకు సంబంధించినటువంటి లిక్కర్‌ ‌పాలసీ ప్రైవేట్‌ ‌వ్యక్తులకుకట్టబెట్టడం కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం జరిగిందని ఇందులో ప్రముఖ రాజకీయ నాయకుల పాత్ర వ్యాపారవేత్తల   పాత్ర ఉన్నట్టు గుర్తించిన దర్యాప్తు సంస్థలు డిల్లి డిప్యూటి సీఎం తోపాటు భారత రాష్ట్ర సమితి చెందిన ఎమ్మెల్సీ ఈ కుంభకోణంలో పాత్ర ఉన్నట్లు అనుమానించి సదరు మహిళ ఎమ్మెల్సీని విచారిస్తున్న విషయం విదితమే.   ఎమ్మెల్సీ తరఫున సౌత్‌ ‌గ్రూప్‌ ‌నుంచి  ప్రముఖ వ్యాపారవేత్తలతో ఈ కుంభకోణం నడిపినట్లు దర్యాప్తు సంస్థలు పేర్కొంటున్నా  ఇది ఎంత వరకు నిజమో కాదో తెలియదు కానీ ఇప్పటివరకు జరిగిన ఆర్థిక లావాదేవీల కుంభకోణాల్లో  సత్యం గ్రూప్‌ ‌సంస్థకు సంబంధించిన కుంభకోణంలో తప్ప వివిధ సందర్భాల్లో వచ్చిన  కుంభకోణం ఆరోపలన్నీ చివరకు నిరోధారమైనదిగా  క్లీన్‌ ‌చిట్‌ ఇచ్చిన సందర్భాలు ఎక్కువే ,మధ్యలో కార్పొరేట్‌ ‌కంపెనీలు ప్రభుత్వ రంగ సంస్థల కంపెనీల్లో జరిగిన కుంభకోణాలు వెలుగు వచ్చినప్పటికీ కుంభకోణాల్లో ప్రముఖులు పేర్లు ప్రత్యక్షంగానో పరోక్షంగానో రావడం కోట్ల రూపాయల కుంభకోణాలల్లో ప్రజా ప్రతినిధులు నాయకులు మంత్రులు కీలకపాత్ర పోషించారన్న ఊహాగానాలు వస్తున్నాయి.
ఆర్థిక వ్యవస్థ  పై అవినీతి ప్రభావం పడుతుంది ..
ఆర్థికపరమైన కుంభకోణాల్లో కోట్ల రూపాయలను అక్రమ మార్గంలో సంపాదించి వివిధ ప్రభుత్వ రంగ సంస్థలలో కార్పొరేట్‌ ‌సంస్థల లోని పలుకుబడిన కొందరు ఆర్ధిక లావాదేవీలలో మోసానికి పాల్పడడం కుంభకోణాల్లో తరచుగా వినిపిస్తున్న మాటలైన ప్రతి అవినీతి ఆరోపణల కుంభకోణాల్లో ప్రభుత్వంలోని కొంతమంది ఉన్నతాధికారులు రాజకీయ నాయకుల ప్రమేయాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ప్రజల దృష్టిని ఆకర్షించే రీతిలో కుంభకోణాలు చర్చ అంశంగా మారుతున్నాయి. ప్రజల నుండి పన్నుల రూపంలో వచ్చే ధనం వ్యవస్థలకు శాఖలకు కేటాయించబడ్డప్పుడు ఆయా సంస్థల నుండి పథకాల అమలులో ప్రజల  సంక్షేమం కోసం బదిలీ అయ్యే క్రమంలో కొంతమంది మోసపూరిత ధోరినిలో గుప్పిట్లోకి ఆర్థిక లావాదేవీలను తెచ్చుకునే విధంగా చేస్తున్నారని ఆరోపణలు లేకపోలేదు.
ఉద్యోగులలో సైతం మితి మీరిన లంచగొండితనం ..
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో కొంతమంది చేస్తున్న అవినీతి అక్రమాలు తారస్థాయి చేరుకోవడం సర్వసాధనమైపోతున్నాయి పని జరగాలంటే ఫైల్‌ ‌కదిలాలంటే లంచాల పేరిట ముడుపుల చేయాల్సిన పరిస్థితులు ఆయా కార్యాలయాల్లో సంభవిస్తుండటం విచారకరం.తరచుగా ఇలాంటి విషయాల్లో ఉన్నత చదువులు చదివి ఉద్యోగం సంపాదించి విధిగా బాధ్యతతో విధులు   నిర్వహించవలసిన ఉద్యోగులు కొందరు లంచాలకు మరిగి లంచం ఇస్తేనే పనిచేస్తారనే రీతిలో కార్యాలయంలో జరుగుతున్న సంఘటనలను బట్టి చూస్తే అవతమవుతుంది.అన్ని రంగాల్లో విస్తృతంగా లంచగొండితనం పేరుకుపోతున్నది.ప్రభుత్వ టెండర్లలో సైతం తమ అనుకూలం వారికే టెండర్లు.కైవసం చేసుకునే పరిస్థి తులు ఉన్నాయి.ప్రజల యొక్క సొమ్ము ప్రభుత్వాలు అనుసరించవలసిన విధానాలతో ప్రజలకు అందిస్తున్న సేవల్లో కొంతమంది అధికారులు ఆర్థిక వ్యవస్థను కొల్లగొట్టే విధంగా అవినీతి కుంభకోణాల్లో తమ ప్రత్యేకత పాత్రను చాటుకుంటున్నారని లంచం తీసుకుంటూ పట్టుబడుతున్న అధికారుల వార్త సమూ హారాలను చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుందేమో.
లంచమి చ్చుకోలేని వారి పరిస్థితి వర్ణాతీతమే ప్రభుత్వాలు పాలకులు మాత్రం అవినీతికి ఆస్కారం లేకుండా చేయాలని మాటలు చెప్పడం మాత్రమే కానీ ఆచరణాత్మకంగా పూర్తిగా విఫలం అవుతున్న సందర్భాలు చాలా ఎక్కువగా నే ఉంటున్నాయి . నెల నెల జీతం తీసుకుని సక్రమంగా తమ బాధ్యతల నిర్వహించవలసిన ఉద్యోగులు తమ కర్తవ్య ధర్మాన్ని విస్మరించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం సరికాదని అనే వారు లేకపోలేదు . కుంభకోణాలు అవినీతి సాంప్రదాయం పూర్తిగా నిర్మూలించబడాలంటే బాధ్యతాయుతమైన భారత పౌరులుగా ఉద్యోగులుగా ప్రజా శ్రేయస్సు ను ఆకాంక్షించే ప్రజా ప్రతినిధులుగా దేశ ఔన్నత్యాన్ని అభివృద్ధిని ఆకాంక్షించే వారిగా అవినీతికి తావులేని నిష్పక్షపాతమైన వైఖరితో తమ విధులను సక్రమంగా నిర్వహిస్తే అవినీతి ఆరోపణలు కుంభకోణం లాంటి సంఘటనలు పునరావృతం కావేమో..
– దాడిశెట్టి శ్యామ్‌ ‌కుమార్‌
‌బీసీజే, వరంగల్‌ ‌జిల్లా,9492097974.

Leave a Reply