ఐ అండ్‌ పిఆర్‌ నూతన ప్రత్యేక కమిషనర్‌గా హనుమంత్‌ రావు బాధ్యతలు

అశోక్‌ రెడ్డిని హార్టీకల్చర్‌ డైరెక్టర్‌గా బదిలీ
హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5 : సమాచార పౌరసంబంధాల శాఖ నూతన ప్రత్యేక కమిషనర్‌గా ఎం హనుమంత రావు సోమవారం మాసాబ్‌ ట్యాంక్‌ సమాచార్‌ భవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఆ శాఖ కమిషనర్‌గా ఉన్న అశోక్‌ రెడ్డి హార్టికల్చర్‌ డైరెక్టర్‌గా బదిలీ పై వెళ్లడంతో ఆయన  స్థానంలో కమిషనర్‌గా హనుమంత రావు నియమితులయ్యారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం నూతన కమిషనర్‌ ఆ శాఖ అధికారులతో సమావేశమై శాఖాపరమైన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని ముఖ్యంగా అట్టడుగు స్థాయిలో ప్రచారం చేయడంలో సమాచార శాఖ కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు అందుకు అణుగుణంగా పనిచేయాలని ఆయన ఆదేశించారు. సచివాలయంలో ఐ అండ్‌ పిఆర్‌ ప్రత్యేక కార్యదర్శిగా కూడా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎఫ్‌డీసీ కిషోర్‌బాబు, అడిషనల్‌ డైరెక్టర్‌ నాగయ్య కాంబ్లే, జాయింట్‌ డైరెక్టర్లు జగన్‌, వెంకట్‌ రమణ, వెంకటేశ్వరరావు, శ్రీనివాస్‌, సీఐఈ రాధాకృష్ణ, డిప్యూటీ డైరెక్టర్లు, అసిస్టెంట్‌ డైరెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page