ఎరుక మరిచిపోకూడదు …!!

తెలంగాణ నినాదం
రక్తంలో పుట్టింనెత్రు
ఏరులై పారింది
కత్తుల వంతెన మీద
నడిచింది కలగనటమంటే
రాజ్యంకు శుత్రువుగా మారటమే
కోస్తాంధ్ర పెట్టుబడిదారి
పాలనలో ప్రజాస్వామ్యం
ముక్కలైంది.
ఆట పాట మాట బంద్‌
నిప్పుల కొలిమిలో నడిచిన
మనుషులు రాష్ట్రాన్ని
స్వస్నించారు .
ప్రజల హక్కుల కోసమే
ప్రజాస్వామ్య ప్రత్యేక
తెలంగాణలోపాలకుల
పాశవిక పాలనలో పౌరుని
గొంతు మూగబోయింది…!
ఆ గొంతు పెకలటానికి
ప్రజాస్యామ్య నినాదం
రాజయ్యవల్సిందే ..!!
గొంతు చిన్నదే కాని
అది అశేష ప్రజల తరపున
నిలబడి మాట్లాడుతున్నదనే
ఎరుక మరిచిపోకూడుదు
విశాలాంధ్రలో ప్రజారాజ్యం
ఎట్లా కలగా మిగిలిందో ?
భౌగోళిక తెలంగాణలో న్యాయం
ప్రజాస్వామ్యం కల్లగా మారుతుంది !
మనఆట. మనపాట.మనమాట
మనరాత.ప్రజాస్వామ్య కని
ప్రతిబింబిచేదిగా ఉండాలి
సభ పెట్టుకునే హక్కు
మాట్లాడే హక్కు
చదువుకునే హక్కు
ఉపాధిని పొందే హక్కు
స్త్రీలు. దళితులు. ముస్లింలు
ఆదివాసి లపై దాడులు
లేని పాలన కోసం
50 వసంతాలుగా
ఈ నేల పై నెత్తురు చిందుతున్నది
ఆ ప్రయాణంలో
చెట్టు గుట్టలు
దాటింది ముళ్ళను
ఏరిచేసింది. విలువైలు
ప్రాలులను అర్పించారు
(జూన్‌ 2న తెలంగాణ
రాష్ట్రం ఏర్పడ్డ సందర్భంగా…)
-శోభరమేష్‌
కాకతీయ విశ్వవిద్యాలయం
8978656 327

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page