- ఉదయం 9:05 నుంచి 9:45 మధ్య ఏర్పాటు
- కొత్త జిల్లాలపై సిఎం జగన్ ఉన్నతస్థాయి సమీ క్ష
- భవనాలు, సిబ్బంది, తదితర అంశాలపై చర్చ
- అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్నామన్న అధికారులు
అమరావతి, మార్చి 30 : ఏపీలో కొత్త జిల్లాల అవతరణకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 4 న ఉదయం 9:05 నుంచి 9:45 మధ్య కొత్త జిల్లాలు అవతరించబోతున్నాయి. అలాగే ఏప్రిల్ 6న వాలంటీర్ల సేవలకు సత్కారం చేయనున్నారు. ఏప్రిల్ 8న వసతి దీవెన కార్యక్రమం చేపట్టనున్నారు. సీఎం జగన్ కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. 6 జిల్లాల ఏర్పాటునకు గానూ వర్చువల్గా కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్తగా పార్వతీపురం మన్యం, అల్లూరి, అనకాపల్లి, కోనసీమ, రాజమండ్రి, నరసాపురం, బాపట్ల, నర్సరావుపేట, తిరుపతి, అన్నమయ్య, నంద్యాల, సత్యసాయి, ఎన్జీఆర్ విజయవాడ జిల్లాలు అమలులోకి రానున్నాయి. పలాస, బొబ్బిలి, చీపురుపల్లి, భీమిలి, కొత్తపేట, భీమవరం, ఉయ్యూరు, తిరువూరు, నందిగామ, బాపట్ల, చీరాల, సత్తెనపల్లి, ఆత్మకూరు, డోన్, గుంతకల్, ధర్మవరం, పుట్టపర్తి, రాయచోటి, పలమనేరు, కుప్పం, శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త జిల్లాలకు రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర పడింది. 26 జిల్లాల ఏర్పాటునకు గానూ వర్చువల్గా ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జిల్లాల పునర్విభజనపై కీలక సక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుస్థిర ఆర్థిక ప్రగతికోసం నిర్దేశించుకున్న లక్ష్యాలను కొత్త జిల్లాలతో అనుసంధానం చేయాలని అధికారులకు ఆదేశించారు.
కొత్త జిల్లాల్లో పరిపాలనా సముదాయాల నిర్మాణాలకోసం అనువైన స్థలాల ఎంపికను పూర్తిచేయాలన్నారు. దీనితోపాటు కనీసంగా 15 ఎకరాల స్థలం ఉండేలా చూసుకోవాలని, కలెక్టర్తోపాటు, జిల్లా పోలీసు అధికారి కార్యాలయాలన్నీ కూడా ఒకే సముదాయంలో ఉండేలా చూసుకోవాలని సూచించారు. అంతేకాకుండా వీరి క్యాంపు కార్యాలయాలు కూడా అదే ప్రాంగణంలో ఉండేలా తగిన ప్లాన్ను ఎంపిక చేసుకోవాలన్నారు. ఈ భవనాలకోసం మంచి డిజైన్లను ఎంపికచేసుకోవాలని, పదికాలాలు గుర్తుండేలా భవనాల నిర్మాణం ఉండాలన్నారు. ప్రస్తుతం అద్దె భవనాలు తీసుకున్న జిల్లాల్లో.. కొత్త భవనాల నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సక్ష నిర్వహించారు. కొత్త జిల్లాల అవతరణ, మౌలిక సదుపాయాల కల్పన, భవిష్యత్తులో నిర్మించనున్న పరిపాలనా సముదాయాల నిర్మాణం తదితర అంశాలపై అధికారులతో సీఎం చర్చించారు.
ఏప్రిల్ 4 ఉదయం 9:05 నుంచి 9:45ల మధ్య కొత్త జిల్లాల అవతరణకు మహూర్తం ఖరారు కాగా, దీనికి సీఎం ఆమోదం తెలిపారు. ఏప్రిల్ 6న వాలంటీర్ల సత్కారం, ఏప్రిల్ 8న వసతి దీవెన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు పక్రియకు సంబంధించి వివరాలను సీఎంకు సీఎస్ సహా, ఇతర ఉన్నతాధికారులు నివేదించారు. కొత్తజిల్లాలకు సంబంధించి ప్రజలనుంచి 16,600 సలహాలు, అభ్యంతరాలు వచ్చాయని అధికారులు తెలిపారు. ప్రజల అభిప్రాయా లకు అనుగు ణంగా చేయాల్సిన మార్పులు, చేర్పులు చేశామన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులతో చర్చించిన తర్వాతనే కలెక్టర్లు సిఫార్సులు చేశారని అన్నారు. సిబ్బంది విభజన, వారికి పోస్టింగుల్లో సిక్స్ పాయింట్ ఫార్ములా, రాష్ట్రపతి ఉత్తర్వులు.. అన్నింటినీ పరిగణలోకి తీసుకున్నామన్నారు. వీటిని పరిగణలోకి తీసుకునే కొత్త జిల్లాల పాలనాయం త్రాంగం నిర్మాణం, పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనలు తయారుచేశా మన్నారు.
కొత్తజిల్లాలకు సిబ్బంది వెళ్లేలోగా అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరుగుతున్నాయా? లేదా? అన్న విషయాన్ని ఎప్పటికప్పుడు సరిచూసుకో వడానికి ఒక చెక్లిస్టు కూడా తయారుచేశామని తెలిపారు. కొత్త జిల్లాలకు సంబంధించి నూతన వెబ్సైట్లు, కొత్త యంత్రాంగాలు ఏర్పాటవుతున్నందున వాటికి అనుగుణంగా ప్రస్తుతం ప్రభుత్వం వినియోగిస్తున్న సాప్ట్వేర్లో మార్పులు చేర్పులు.. తదితర కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. అలాగే కొత్త జిల్లాల సమాచారంతో కూడిన హ్యాండ్ బుక్స్ కూడా తయారు చేసినట్టు వెల్లడించారు. కలెక్టర్లు, జిల్లా పోలీసు అధికారుల కార్యాలయాలు, క్యాంపు కార్యాలయాలను ఖరారుచేశామని తెలిపారు. సాధ్యమైనంత వరకూ ప్రభుత్వ భవనాలను ఎంపిక చేశామని, లేనిచోట ప్రైవేటు భవనాలను అద్దె ప్రాతిపదికిన తీసుకున్నామని తెలిపారు. సుస్థిర ఆర్థిక ప్రగతికోసం నిర్దేశిరచుకున్న లక్ష్యాలను కొత్త జిల్లాలతో అనుసంధానం చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ సక్షా సమావేశంలో ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ డాక్టర్ సర్ శర్మ, డీజీపీ కే వి రాజేంద్రనాథ్ రెడ్డి, సీసీఎల్ఏ స్పెషల్ సీఎస్ జి సాయి ప్రసాద్, జీఏడీ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, ఐటీ ముఖ్యకార్యదర్శి జి జయలక్ష్మి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.