- పిడికిలి బిగించి అభివాదం
- దిల్లీలోనే రాష్ట్ర మంత్రుల మకాం…న్యాయ నిపుణులతో మంత్రాంగం
న్యూ దిల్లీ, మార్చి 11 : దిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన వ్యవహారంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం దిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు హాజరయ్యారు. అందరికీ అభివాదం చేస్తూ కవిత ఈడీ కార్యాలయం లోపలికి వెళ్లారు. పిడికిలి బిగించి మనదే విజయం అనే సంకేతం ఇస్తూ కవిత కార్యాలయం లోకి వెళ్లారు. కాగా, కవితకు మద్దతు తెలిపేందుకు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు తుగ్లక్రోడ్డులోని నివాసం వద్దకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. అంతకుముందు మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో కవిత భేటీ అయ్యారు. గతరాత్రి నుంచే వీరు అనేక అంశాలపైనా చర్చించారు. ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో కసరత్తు చేశారని సమాచారం. ఇదిలావుంటే ఈడీ ఆఫీస్కు వెళ్లే క్రమంలో..ఆ ఆఫీస్లో కూర్చున్న తర్వాత కవిత ముఖంలో కనిపించిన ఆందోళన, భయానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ వి•డియాలో వైరల్గా మారాయి.
బయటకు పిడికిలి బిగించి బీఆర్ఎస్ శ్రేణులకు అభివాదం చేస్తూ ధీమాగా కనిపిస్తున్నా.. అరెస్ట్ తప్పదనే నైరాశ్యం కవిత ముఖంలో స్పష్టంగా కనిపించింది. ఆమె కళ్లలో ఆ భయం కొట్టొచ్చినట్లు కనిపించిందని చెప్పడానికి తాజాగా వైరల్ అవుతున్న కవిత కళ్లకు సంబంధించిన ఫొటోలే కారణం. ఇటీవల తెలంగాణ శాసనమండలిలో కూడా ఈ తరహా భయం, తత్తరపాటు కవితలో కనిపించాయి. శాసనమండలిలో కేటీఆర్, కవిత పక్కపక్కనే కూర్చుని సీరియస్గా మాట్లాడుకుంటున్న దృశ్యాలు లిక్కర్ స్కామ్ కేసులో కలవరపాటును బహిర్గతం చేశాయి. పైగా.. కేటీఆర్ శాసనమండలిలో మాట్లాడుతున్న సందర్భంలో కూడా ఆ వెనుకే కూర్చున్న కవిత ఎంతో ముభావంగా కనిపించారు.
ఆమె ముఖంలో భయం, తత్తరపాటు స్పష్టంగా కనిపించాయి. కాగా కవితను ముగ్గురు అధికారుల బృందం ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. దిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత పాత్ర, నిందితులతో ఉన్న సంబంధాలు, ఇండోస్పిరిట్స్ కంపెనీలో వాటాలు, 100 కోట్ల ముడుపుల వ్యవహారంపై కవితను ఈడీ ప్రశ్నిస్తుంది. ఇప్పటి వరకు దిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత పాత్రపై సేకరించిన ఆధారాలు సాక్ష్యాలతో కవితను ప్రశ్నిస్తుంది. మౌఖికంగా, లిఖితపూర్వకంగా కవిత స్టేట్మెంట్ను అధికారులు రికార్డు చేస్తున్నారు. అరుణ్ పిళ్ళై, బుచ్చిబాబు, అభిషేక్, శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ , సవి•ర్ మహేంద్రు, అమిత్ అరోరాఇచ్చిన సమాచారంతో కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
దిల్లీలోనే రాష్ట్ర మంత్రుల మకాం…న్యాయ నిపుణులతో మంత్రాంగం
దిల్లీ లిక్కర్ స్కామ్లో ఓవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తుండగా మరోవైపు న్యాయ నిపుణులతో మంత్రులు మంతనాలు జరుపుతున్నారు. దాదాపుగా గత ఆరు గంటలు పైగా విచారణ కొనసాగుతోంది. ముందుగా సింగిల్గా కవితను విచారించిన అధికారులు ఆ తరువాత పిల్ళై, సిసోడియాతో కలిపి విచారించారు. కవిత విచారణ రాత్రి 8 గంటల వరకు కొనసాగింది. మరోవైపు ఆరుగురు మంత్రులు న్యాయ నిపుణలతో ఎప్పటికప్పుడు తదుపరి పరిణామాలపై, కార్యాచరణపై చర్చిస్తున్నారు. మంత్రులు కేటీఆర్, హరీష్లతోపాటుగా స్టేట్ ఇంటెలిజిన్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కూడా దిల్లీలోనే ఉన్నారు. పలువురు ఎంపిలు, ఎమ్మెల్యేలు కూడా అక్కడే ఉన్నారు. ఎప్పటికప్పుడు విచారణకు సంబంధించి ఆరా తీస్తున్నారు.