ఇరాన్ను విమర్శించే ఉమ్మడి ప్రకటనపై సంతకం
ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాలో సోమవారం జరుగుతున్న గ్రూప్ ఆఫ్ 7 శిఖరాగ్ర సమావేశం నుంచి అకస్మాత్తుగా నిష్క్రమించారు. అక్కడ ఆయన ఇతర దేశాధినేతలతో కలిసి ఇరాన్ను విమర్శించే ఉమ్మడి ప్రకటనపై సంతకం చేశారు. అనంతరం ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉధృతమవుతున్న సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు వెళ్ళిపోయారు. మొదట ట్రంప్ ఆ ప్రకటనపై సంతకం చేయడానికి నిరాకరించారు. కానీ ఆ ప్రకటనలో భాషను స్వల్పంగా సవరించిన తరువాత సంతకం చేశారు. వైట్ హౌస్ ప్రెస్ కార్యదర్శి కరోలిన్ లెవిట్ మాట్లాడుతూ, ‘మధ్య ప్రాచ్యంలో చోటుచేసుకుంటున్న పరిణామాల దృష్ట్యా ట్రంప్ ఈ రెండు రోజుల శిఖరాగ్ర సమావేశం నుంచి ముందుగానే వెళ్ళిపోయారు’ అని చెప్పారు. కానీ మరిన్ని వివరాలు వెల్లడిరచలేదు. ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్ అధికారులు అమెరికా సైనికంగా జోక్యం చేసుకోవాలని ఒత్తిడి పెంచుతున్నారు, ప్రత్యేకంగా ఇరాన్ అణు సౌకర్యాలను ధ్వంసం చేయడంలో సహాయం కోరుతున్నారు. చరిత్రలోనే అత్యంత తీవ్రంగా మారిన ఇజ్రాయెల్-ఇరాన్ సాయుధ సంఘర్షణ ఐదవ రోజుకు చేరుకుంది. ఇజ్రాయెల్ ఇప్పటికీ ఇరాన్ అణుశక్తి అభివృద్ధి లక్ష్యాన్ని పూర్తిగా తుడిచిపెట్టలేకపోయింది. ఇజ్రాయెల్, అమెరికా ‘బంకర్ బస్టర్’ బాంబులు (30,000 పౌండ్ల బరువుతో భూమి లోతులో ఉన్న అణు కేంద్రాలను ధ్వంసం చేయగల బాంబులు) వాడాలని కోరుతోంది. ఇలాంటి కేంద్రాల్లో ఫోర్డో అనే ప్రముఖ అణు స్థావరం కూడా ఒకటి. ఆ కేంద్రాన్ని నాశనం చేయగల ఏకైక ఆయుధం ‘మాసివ్ ఆర్డినెన్స్ పెనిట్రేటర్’’ అని నిపుణులు అంటున్నారు. దీనిని ప్రయోగించేందుకు దీ-2 బాంబర్ విమానం అవసరం. ఇజ్రాయెల్ వద్ద ఇవెంతో లేదు. ట్రంప్ పలు సందర్భాల్లో అమెరికా విదేశీ యుద్ధాల్లో జోక్యం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు స్పష్టంగా చెప్పారు. కానీ అదే సమయంలో అణు ఆయుధాలతో ఉన్న ఇరాన్కు గట్టిగా వ్యతిరేకత కూడా తెలిపారు. ‘సూటిగా చెప్పాలంటే ఇరాన్ అణు ఆయుధాన్ని కలిగి ఉండకూడదు’ అని ఆయన తన సోషల్ మీడియా వేదికలో పేర్కొన్నారు. మొదట G7దేశాలు రూపొందించిన ప్రకటనపై ట్రంప్ సంతకం చేయలేదు. కానీ భాష మారిన తరువాత, ఇతర నేతలతో కలిసి ఆయన కూడా సంతకం చేశారు. ఇజ్రాయెల్ సోమవారం మరింత తీవ్రంగా స్పందిస్తూ ‘‘విమాన సమర్థత పూర్తిగా తమదే’’ అని ప్రకటించింది. టెహ్రాన్లోని కొన్ని ప్రాంతాల నివాసితులను ఖాలీ చేయాలని ఆదేశించింది. ఇది అక్కడి రాష్ట్ర టెలివిజన్ కాంప్లెక్స్పై దాడికి సంకేతంగా కనిపించింది. ఆ దాడి టీవీ యాంకర్లు లైవ్లో ఉండగానే జరిగింది. అదేవిధంగా ఇజ్రాయెల్, టెహ్రాన్లో ఉన్న ఇరాన్ ఎలైట్ క్వడ్స్ ఫోర్స్ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసిందని తెలిపింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మీద దాడిని కూడా ప్రధానమంత్రి నెతన్యాహు ఖండిరచలేదు. ఇరాన్ సోమవారం ఉదయం బల్లిస్టిక్ క్షిపణులను విరివిగా ప్రయోగించింది. కొన్ని ఇజ్రాయెల్ నగరాలను తాకాయి. కనీసం ఎనిమిదిమంది మృతిచెందారని ఇజ్రాయెల్ అధికారులు చెప్పారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి, అమెరికాతో అణు అభివృద్ధిపై చర్చలు తిరిగి ప్రారంభించేందుకు సిద్ధత చూపారు. ట్రంప్ అధ్యక్షతన ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్, మధ్యప్రాచ్య ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్లను ఇరాన్ ప్రతినిధులతో సమావేశం కావాలని సూచించినట్టు ఓ అమెరికా అధికారి చెప్పారు. ‘ట్రంప్ నిజంగా డిప్లమసీకి కట్టుబడి యుద్ధం ఆపాలని అనుకుంటే తదుపరి చర్యలు కీలకమైనవి’ అని అరఘ్చి అన్నారు. ఇప్పటికే ఇరువైపులా సామాన్యుల మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ యుద్ధం రోజుల్లో కాదు వాస్తవానికి వారాలపాటు సాగేలా కనిపిస్తోంది. ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, ఇజ్రాయెల్ దాడుల్లో కనీసం 224 మంది మృతిచెందారు, 1400మందికి పైగా గాయపడ్డారు. ఇక ఇజ్రాయెల్లో కనీసం 24మంది చనిపోయారు, 600 మందికిపైగా గాయపడ్డారు.