•గతంలో ఉన్న రేషన్ బియ్యం మాఫియాను అరికట్టాం..
•ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు
జయశంకర్ భూపాలపల్లి ,ప్రజాతంత్ర, మార్చి 31 : రాష్ట్రంలోని ప్రతీ నిరుపేద కుటుంబం కడుపు నిండా భోజనం చేయ డమే లక్ష్యంగా ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభిం చిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రాంనగర్ కాలనీ చౌకధరల దుకాణంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డితో కలిసి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లా డుతూ.. రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటు ంబం కడుపు నిండా భోజనం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభిం చిందని అన్నారు. దారిద్య్రరేఖకు దిగువ నున్న కుటుంబాలకు సన్న బియ్యం అందిస్తున్నామని తెలిపారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నేరవేరుస్తూనే గత ప్రభు త్వాలు చేయలేని ఒక చరిత్రాత్మకమైన పనిని కేవలం సంవత్సరంన్నర కాలంలోనే ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి చేసి చూపె ట్టారని అన్నారు. గతంలో రేషన్ బియ్యం పంపిణీలో మాఫియాలు ఉండేవని ఇప్పుడు వాటిని శాశ్వతంగా నిర్మూలించామని తెలి పారు. గత పదేళ్లలో రేషన్ కార్డులు ఇవ్వలేదని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు జారీ చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఏ సందర్భంగా సన్న బియ్యం పంపిణీ పథకం రాష్ట్ర ప్రజలకు కలిగించే ప్రయోజనాలను మంత్రి వివరించారు. పేద ప్రజలకు పోషకాలతో కూడిన నాణ్యమైన బియ్యం అందిం చేం దుకు రాష్ట్ర ప్రభుత్వ చారిత్రక పథకాన్ని ప్రారంభించిందని అన్నారు.
ఈ పథకం చారిత్రకమని, ఇది రాష్ట్రంలో ఆహార భద్రతను మరింత బలోపేతం చేస్తుందని తద్వారా పేదలకు సన్నబియ్యం తో కూడిన ఆహారం అందుతుందని పేర్కొన్నారు.ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చిన ఆరు గ్యారంటీలు నెరవే రుస్తూనే ప్రభుత్వ ఉద్యోగ నియమాలు చేపట్టామని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ పధకాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ పథకం అమలుతో నిరుపేదలకు సన్న బియ్యం తో కూడిన ఆహారం అందు తుందని తెలిపారు. రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ అనేది నిరంతరా యంగా కొనసాగుతుందని అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు అందించి సన్న బియ్యం పంపిణీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, డీఎస్ఓ రాములు, ఆర్డిఓ రవి, తహసీల్దార్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.