అస్తిత్వ ఉద్యమాలిచ్చిన సమాధానాలు, వర్తమాన సవాళ్ళకి సరిపోతున్నాయా?
అస్తిత్వ ఉద్యమ చైతన్యం నుంచి పుట్టిన మేధావి, సాహిత్యకారుడు, సామాజిక ఉద్యమకారుడు, క్రాంతదర్శి ద్రావిడ జాతి విముక్తి లక్ష్యంగా తన మార్గాన్ని విస్తరించుకుంటున్న డా. జిలుకర శ్రీనివాస్ తో ముఖాముఖి.్న కె. ఎన్. మల్లీశ్వరి
అస్తిత్వ ఉద్యమాలని పిలుస్తున్న దళిత, స్త్రీ, మైనార్టీ, తెలంగాణవాదాలన్నీ అసమానతలు రద్దు కావాలని బయల్దేరినవే. ఆయా అస్తిత్వవైరుధ్యాలను సమర్ధించినవి కావవి, వాటికి పరిష్కారం చూపిన ఉద్యమాలవి. క్రమేపీ విస్కృతి పెంచుకుంటూ వచ్చాయి. కుల, మత, జెండర్ ఆధారిత ఉద్యమాలకన్నా ప్రాంతం ఆధారిత ఉద్యమాలు బలమైనవి. జాతి ఉద్యమం కూడా చాలా శక్తిమంతమైనది. అందుకే తెలంగాణ ఉద్యమం సఫలమైంది, తమిళజాతివాదం విజయవంతమైంది. అయితే, ఇప్పుడు అస్తిత్వ ఉద్యమాలు ఎదుర్కొంటున్న తక్షణసమస్య ఉత్తరాది విస్తరణవాదాన్ని ఎదుర్కోవడం. దక్షిణాది ఇప్పుడు అభద్రతలో ఉంది. 2014 నుంచి ప్రతీమారుమూల పల్లెలో ఉత్తరాది విస్తరణవాద దుష్ఫలితాలు స్పష్టం అవుతున్నాయి. తెలంగాణ ఏర్పడిన సంతోషం లేకుండా ఉత్తరాది పెట్టుబడిదారులు, వ్యాపారుల ప్రవేశంతో పరిస్థితులు తల్లకిందులయ్యాయి. ఆంధ్రపెత్తనం పోయి, ఉత్తరాదిపెత్తనం విపరీతంగా పెరిగింది. తెలంగాణసంస్కృతితో పాటు, ఇతర దక్షిణాది కళాచారాలన్నీ ఉత్తరాది దాడికి నిలవలేక కనుమరుగయ్యే స్థితికి చేరుకున్నాయి. ఈ సమస్య ఇప్పుడు అస్తిత్వఉద్యమాల ముందున్న సవాలు. మతం, మార్కెట్ రెండుముఖాలుగా దక్షిణాదిలోకి చొచ్చుకొచ్చిన ఫాసిస్టు భావజాలాన్ని, దాని రాజకీయాలను ఎలా ఎదుర్కోవాలనే సంవాదం జరుగుతూనే వున్నది. అందుకే సాహిత్యంలో దక్షిణాదివాదం, ద్రవిడవాదం వస్తున్నాయ్ని తెలుగు ప్రాంతాలను దాటి ద్రావిడ ఏకీకరణ గురించి మాట్లాడటానికి మీ ప్రేరణ ఏమిటి?
తమిళుల చ్కెతన్యం నాకు ప్రేరణ. అలాంటి చ్కెతన్యమే కన్నడిగులలో వుంది. వాళ్లు హిందీపేరుతో ఉత్తరాది ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. తెలుగుప్రజలు దక్షిణాది జనులతో మమేకమై ద్రావిడులంతా సమైక్యం కావాలనే ఆలోచన కలిగింది. ఈ క్రమంలోనే నేను నా మిత్రులు కలిసి ‘ద్రవిడ స్వాభిమాన వేదిక’, ‘ద్రవిడ బహుజన సమితి’ సంస్థలను ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాలు చేపట్టాము. తమిళనాట చిరుతపులిగా, తమిళసూర్యుడిగా పేరుగాంచిన తల్కెవర్ తిరుమావళవన్ గారి ఉద్యమాన్ని, రచనలను చదివి కన్విన్సు అయ్యాను.
నిజానికి, తాత్వికరంగంలో యూరపు కేంద్ర సంవాదాలను ధిక్కరించే ఉద్యమాలు వచ్చాయి. మనదేశంలో ఏ సంవాదమైనా ఉత్తరాది కేంద్రంగా సాగుతుంది. చరిత్ర, సాహిత్యం, రాజకీయం, ఆర్థికం, కళాచారాల గురించిన చర్చలు, సంవాదాలన్నీ ఉత్తరాది కేంద్రంగానే సాగుతున్నాయి. మన ఆలోచనలు, జీవన నడవడికను ఉత్తరాది కేంద్రభావనే ప్రభావితం చేస్తున్నది. తెలుగువాళ్లకు మానసికంగా ఢిల్లీ దగ్గరగా వుంటుంది. దక్షిణాది రాష్ట్రాలు మన ఆలోచనలలో దూరంగా వున్నవి. దీనినే ఆర్యీకరణ లేదా ఉత్తరాదీకరణ అంటాను. ఉత్తర, దక్షిణాదులకు ముఖద్వారం తెలంగాణ. ఉత్తరాది ఫాసిస్టు శక్తులు తెలంగాణను హస్తగతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ఆంధ్రను రాజకీయంగా చేజిక్కించుకున్నారు. ఆర్థికంగా, కళాచారాల ప్రకారంగా ఉత్తరాది ఆక్రమణను ప్రతిఘటించే క్రమంలోనే భౌతికఘర్షణలు జరగుతున్న వార్తలు వెలువడుతున్నాయి. అందువల్ల, ఉత్తరాది విస్తరణవాదానికి బాధితులుగా వున్న తెలుగురాష్ట్రాలతోపాటు, మిగతా దక్షిణాది రాష్ట్రాలు కూడా విక్టిమ్ స్టేట్స్గా వున్నాయి. ఇప్పుడు దక్షిణాది ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఉత్తరాది పెత్తనం. అందుకే ద్రావిడ ఏకీకరణ జరగాలని కోరుతున్నాను.్న ద్రావిడ సాహిత్య భావనని రాజకీయార్థంలో ఎలా చూస్తున్నారు?
వింద్యపర్వతాలకు ఈవల గల దక్షిణప్రాంతాన్ని దక్షిణాది అని ఉత్తరాది ఆర్యుల సాహిత్యం నిర్వచిస్తున్నది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లోని నర్మదానది తీరభాగం, చత్తీస్ఘడ్, ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తిమళనాడు, కేరళ, గోవా, పాండిచ్ఛేరి భూభాగాన్ని దక్షిణాది అంటారు. ప్రపంచంలోని చాలాదేశాలకన్నా పెద్ద భూభాగం ఇది. ఈ ప్రాంతాలలో వెలువడిన సాహిత్యమే ద్రావిడసాహిత్యం. అయితే ద్రావిడవాదంలో కులనిర్మూలన కీలకమైన అంశం. కులాన్ని సమర్ధిస్తూ రాసే ద్రావిడరచనలను ఉత్తరాదీ ఆర్యభావజాల ప్రతిఫలన రచనలుగానే చూస్తాం. కుల, వర్గ, ఇతర అన్నిరకాల్కెన అసమానతలను వ్యతిరేకిస్తూ ద్రావిడ రచయితలు సృష్ఠించే సాహిత్యాన్ని ద్రావిడసాహిత్యంగా చూడాలి. దక్షిణాది ఉనికి, అస్తిత్వం, సంస్కృతి, కళాచారాలు మూలవస్తువులుగా వుండి, ఉత్తరాది సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక ఆధిపత్యాన్ని వ్యతిరేకించేది ద్రావిడసాహిత్యం. ఇది కేవలం రాజకీయ వ్యక్తీకరణ కాదు, అంతకు మించినద్ని ద్రావిడ సాహిత్యరంగంలో వివిధ భాషల మధ్య పోలిక ఎలాగుర్తించగలం?
ద్రావిడులకి మేము దక్షిణాదివాళ్లం అనేస్పృహ వుంది. దక్షిణాది నాగరికత, సంస్కారం, ప్రగతిశీల భావజాలం, ద్రావిడ సారూప్యతలు. తమిళ, కన్నడ, మలయాళీ, తెలుగు, తులు సాహిత్యాలలో సమానత్వం దిశగా సామాజిక చ్కెతన్యం కనిపిస్తుంది. స్థానికత నుంచి అంతర్జాతీయత వరకూ ద్రావిడ రచయితలు విస్తరించారు. ఇప్పుడు దక్షిణాదిభాషల నుంచి విరివిగా తర్జుమాలు జరుగుతున్నాయి. వాటిని చదివే పాఠకులమధ్య అనుబంధం, ఐక్యత పెరిగి, దక్షిణాది భాషాసాహిత్యాల గొప్పదనం, పరస్పరత బోధపడతాయ్ని సాహిత్యకారులు ఎటువంటి ఆచరణ ద్వారా ద్రావిడ సాంస్కృతిక విప్లవానికి దోహదం చేయగలరు?
సాహిత్యం లేకుండా ద్రావిడ సాంస్కృతిక విప్లవం లేదు. ద్రావిడకళలు, ఆచారాలు ఇతర ప్రాంతాలకన్న భిన్నమైనవి. వాటిని ఉత్తరాది ఆర్యవాదం సంస్కృతం, హిందీ, హిందూపేరుతో నాశనం చేయాలని చూస్తున్నది. మార్కెట్ అందుకు ఒక సాధనం. ఒకేదేశం, ఒకేమార్కెట్, ఒకేపన్ను, ఒకేభాష నినాదాలలో ఉత్తరాదీకరణ, దోపిడీ అంతస్సూత్రంగా ఉన్నాయి. ఉత్తరాది పెట్టుబడిదారులు సరుకులు మాత్రమే అమ్మరు. వాళ్ల సంస్కృతి కూడా అమ్ముతారు. తమ వ్యాపారానికి అనుకూలమైన వాతావరణాన్ని తయారు చేస్తారు. వాళ్ల పండగలు, ఆచారాలు, కళలు, వేషధారణ, ఆహార అలవాట్లను దక్షిణాదిమీద రుద్దుతున్నారు. సరుకులు అమ్ముకోవడానికి స్థానిక ద్రావిడభాషలు నేర్చుకోరు. ద్రావిడులే హిందీ నేర్చుకొనేలా చేస్తారు. ఈ మార్కెటు విస్తరణ కోసమే కేంద్రపాలకులు హిందీని రుద్దుతున్నారు. ఉత్తరాదిలో ఏ స్కూలులో కూడా ద్రావిడ భాషలు రెండోభాషగా లేవు. కానీ దక్షిణాది ప్రయివేటుస్కూళ్లలో హిందీ తప్పనిసరిగా నేర్పుతున్నారు. ఇంగ్లీషుమీడియం స్కూళ్లలో తెలుగు తగ్గిపోతున్నది. ఈమధ్య తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో సంస్కృతాన్ని రెండోభాషగా పెట్టడానికి ప్రయత్నం జరుగుతుంది. ఇది తెలుగును హత్యచేసే కుట్ర. ద్రావిడ రచయితలు ఈ భాషాధిపత్యాన్ని వ్యతిరేకించాలి. లేకపోతే పాళీ, ప్రాకృత భాషాసాహిత్యాలు కనుమరుగైన తీరుగానే ద్రావిడ భాషాసాహిత్యాలు అంతరించే ముప్పు వుంది. అందుకని, ద్రావిడ సాహిత్యకారులంతా ఉత్తరాది పెత్తనానికి వ్యతిరేకంగా రచనలు చేయాలి. దక్షిణాది కేంద్రరచనలు చేయాలి. చరిత్రను, వర్తమానాన్ని దక్షిణాది ప్రయోజనాల కోణంనుంచి అంచనా వేయాలి. ప్రాపంచిక దృక్పథంగా ద్రవిడవాదాన్ని రచయితలు స్వీకరించాలి. తద్వారా ద్రావిడ విప్లవానికి రచయితలు తోడ్పడినవారవుతారు.