‌పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం

దావోస్‌లో రికార్డు స్థాయిలో పెట్టుబడులు ఆకర్షించాం
•గ్రీన్‌ ‌పవర్‌,  ఎంఎస్‌ఎంఈ  ‌పాలసీలకు అద్భుత స్పందన
•డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు విజ్ఞప్తి
•యూరోపియన్‌ ‌యూనియన్‌ అధ్యక్షుడితో భేటీ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : పెట్టుబడులకు యువ రాష్ట్రమైన తెలం గాణ స్వర్గధామం లాంటిదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. యూరోపియన్‌ ‌యూనియన్‌ అధ్యక్షుడు ఉర్సుల ఓన్‌ ‌దిల్లీ పర్యటన నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం దిల్లీలో కాన్పె •డరేషన్‌ ఆఫ్‌ ఇం‌డియన్‌ ఇం‌డస్ట్రీ ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన విందు సమా వేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రతినిధిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హాజరై భారతదేశ వాణిజ్య అభివృద్ధిలో తెలంగాణ పాత్రను, రాష్ట్రంలో పెట్టు బడులకు ఉన్న అవకాశాలను అతిథులకు వివరించారు. సమావేశంలో యూరోపి యన్‌ ‌యూనియన్‌ ‌కమిషన్‌ ‌సభ్యులు, యూరప్‌ ‌దేశాల రాయబారులు, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో వ్యాపార అనుకూల విధానాలు రూపొందించడం, క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో విశేష ప్రతిభ కనబరుస్తూ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలం గాణ ముందంజలో ఉందని సమా• •శానికి హాజరైన యూరోపియన్‌ ‌యూని యన్‌ ‌ప్రతినిధి బృందానికి డిప్యూటీ సీఎం వివరించారు.

పాలకులు మారడం సాధా రణం, కానీ కొన్నిసార్లు కేవలం మార్పు కోసమే పాత విధానాలు రద్దు చేస్తారు. అయితే తెలంగాణలో పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉందని తెలిపారు. గత రెండు, మూడు దశాబ్దాలుగా ఒక ప్రభుత్వం తర్వాత మరో ప్రభుత్వం వొచ్చి నప్పటికీ రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే విధానాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. గతేడాది క్రితం కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి వొచ్చినప్పటికీ గత సర్కా రు అమలు చేసిన మంచి విధానాలను కొనసాగిస్తున్నామని తెలిపారు. అదే విధంగా కొన్ని కీలకమైన పాలసీల్లో లోటు ను గుర్తించి అభివృద్ధికి అనుకూ లమైన కొత్త విధానాలను అమలు చేస్తు న్నామని తెలిపారు. ఇందుకు ఉదాహ రణగా చూస్తే.. గ్రీన్‌ ఎనర్జీ పై ఒక క్లీన్‌ అం‌డ్‌ ‌గ్రీన్‌ ‌పాలసీని ప్రారంభించాం. గత ప్రభుత్వం ఇలాంటి విధానాన్ని రూపొందించలేదు. అయితే ప్రపంచం మొత్తం గ్రీన్‌ ‌పవర్‌ ‌వైపు అడుగులు వేస్తూ ఉండడంతో మేము సమగ్ర గ్రీన్‌ ఎనర్జీ పాలసీని రూపొందించాం. ఈ విధానానికి పరిశ్రమలు, డేటా సెంటర్లు, వినియోగదారుల నుంచి విశేష ప్రశంసలు అందాయని వివరించారు. మరో ప్రధాన అంశం ఎంఎస్‌ఎంఈ (‌సూక్ష్మ, చిన్న, మధ్యతరహా) పై కొత్త పాలసీని రూపొందించాం. గత ప్రభుత్వంలో ఒక సాధారణ పారిశ్రామిక విధానం ఉండేది, అది పెద్ద కంపెనీలకు మేలు చేసే విధంగా ఉండేది. కానీ ఎంఎస్‌ఎంఈలు పరిశ్రమల అభివృద్ధికి, పెద్ద సంఖ్యలో ఉపాధికి వెన్నుముక వంటివి అని మేము భావించాం. అందుకే అనేక రకాల ప్రోత్సాహాలతో కూడిన కొత్త  ఎంఎస్‌ఎంఈ ‌పాలసీని తీసుకొచ్చినట్టు తెలిపారు.

తెలంగాణలో ‘‘ఈజ్‌ ఆఫ్‌ ‌డూయింగ్‌ ‌బిజినెస్‌’’ అం‌దించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. పరిశ్రమలకు అవసరమైన నీరు, విద్యుత్తు, పారిశుద్ధ్య వ్యవస్థ, రవాణా వంటి నాణ్యమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దావోస్‌ ‌లోని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) ‌సమీట్లో పాల్గొనడం ప్రారంభించాం. గత రెండు ఎడిషన్లలో తెలంగాణ రికార్డు స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించిందని వివరించారు. తెలంగాణ రాష్ట్రం రూపొందిస్తున్న పాలసీలకు పెట్టుబడిదారుల నుంచి విశేష మద్దతు, విశ్వాసానికి దావత్‌ ‌లో కుదిరిన వ్యాపార ఒప్పందాలు నిదర్శనం అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలంటే వారికి అంతర్జాతీయ ప్రమాణాల స్థాయిలో ప్రతిభావంతులైన మానవ వనరులు అందుబాటులో ఉండాలి. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా తీసుకుందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే భారత దేశంలోనే మొదటిసారి యువతకు ప్రత్యేకంగా నైపుణ్య శిక్షణ అందించేందుకు ‘‘యంగ్‌ ఇం‌డియా స్కిల్‌ ‌యూనివర్సిటీ’’ని స్థాపించామని డిప్యూటీ సీఎం అన్నారు.  యూనివర్సిటీలో ప్రతి కోర్సును పరిశ్రమల భాగస్వామ్యంతో రూపొందించాం, వాళ్లే పాఠాలు బోధిస్తారు, ఇది మా స్కిల్‌ ‌యూనివర్సిటీ ప్రత్యేకత అని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ఐ.టి.ఐ. లను ఆధునికీకరించాం, విద్యార్థులు అత్యాధునిక యంత్రాలతో శిక్షణ పొందేలా కొత్త సిలబస్‌ అమలు చేస్తున్నట్టు తెలిపారు.

ప్రాథమిక విద్యారంగాన్ని కూడా సంస్కరించేందుకు చర్యలు చేపట్టాం అన్నారు. ఈ చర్యల ఫలితంగా పిల్లలు చిన్న వయసులోనే స్కిల్స్ అభివృద్ధి చేసుకొని భవిష్యత్తులో దేశ అభివృద్ధికి తోడ్పడే స్థాయికి ఎదగగలుగుతారు అని వివరించారు. భారత్‌ ఒక విభిన్న దేశం, ఈ దేశంలోని ప్రతి రాష్ట్రం పాలసీలు, పాలన, ప్రాధాన్యతలు విషయంలో ప్రత్యేకత తో కూడుకొని ఉంటాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. భారత్‌ ఒక విభిన్న దేశం, ఈ దేశంలోని ప్రతి రాష్ట్రం ప్రత్యేకమైన పాలసీలు, పాలన, ప్రాధాన్యతలు ఉంటాయని దేశ సమాఖ్య నిర్మాణం ఇందుకు అనుకూలంగా ఉందని తెలిపారు. యూరోపియన్‌ ‌యూనియన్‌ ‌సభ్య దేశాలు మీ వ్యాపార, వాణిజ్య ప్రయోజనాలను అభివృద్ధి చేసుకునేందుకు భారతదేశంలోని రాష్ట్రాలతో నేరుగా పని చేసుకునే సౌలభ్యం ఉందని వివరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సందర్శించాల్సిందిగా యూరోపియన్‌ ‌యూనియన్‌ అధ్యక్షుడు ఉర్సుల ను డిప్యూటీ సీఎం కోరారు. యూరోపియన్‌ ‌యూనియన్‌ ‌దేశాలకు చెందిన పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వర్గాలకు తెలంగాణను పరిచయం చేయడానికి యూరోపియన్‌ ‌యూనియన్‌ అధ్యక్షుని సహకారం ఎంతైనా అవసరం ఉందని ఆయన తెలిపారు. సమావేశంలో సీఐఐ ప్రెసిడెంట్‌ ‌సంజీవ్‌ ‌పురి, డిప్యూటీ సీఎం స్పెషల్‌ ‌సెక్రటరీ కృష్ణ భాస్కర్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page