ప్రజాస్వామ్యం, రాజ్యాంగానికి తీవ్ర ముప్పు

– ఉపాధి హామీ పథకం రద్దుతో కోట్లాది పేదలకు నష్టం
-కాంగ్రెస్‌  అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే

న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, డిసెంబరు27: దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని,  దిల్లీలో జరిగిన కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌కమిటీ  సమావేశంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.  మహాత్మా గాంధీ గ్రాణ ఉపాధి హా పథకం రద్దుతో కోట్లాది పేదలకు ఉపాధి కరువవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దిల్లీలోని ఇందిరా భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో ఖర్గే పలు కీలక అంశాలపై మాట్లాడారు. నరేగా రద్దును మహాత్మాగాంధీకి అవమానంగా, ’రైట్‌ ‌టు వర్క్’‌పై మోదీ సర్కార్‌ ‌క్రూర దాడిగా ఖర్గే అభివర్ణించారు. ’పేదల కడుపుపై తన్నిన మోదీ ప్రభుత్వం… పేదల కంటే కార్పొరేట్ల లాభాలే ముఖ్యం’ అని ఖర్గే విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో అమలైన హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. 2006లో ఆంధప్రదేశ్‌లో ప్రారంభమైన ఈ పథకం గ్రామీణ భారత ముఖచిత్రాన్ని మార్చిందని, దళితులు, ఆదివాసీలు, మహిళలకు భరోసా ఇచ్చిందని, పేదరికం నుంచి బయటపడ్డ తరాన్ని సృష్టించిందని ఖర్గే చెప్పుకొచ్చారు. ఎలాంటి అధ్యయనం లేకుండా రద్దు చేశారని మండిపడ్డారు. మూడు నల్ల వ్యవసాయ చట్టాల తరహాలోనేనని, రైతు ఉద్యమంలా దేశవ్యాప్త పోరాటం అవసరమని పిలుపునిచ్చారు. ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సిందేనని ఆయన డిమాండ్‌ ‌చేశారు. ఇందుకోసం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సభ్యులకు ఖర్గే సూచించారు.కాంగ్రెస్‌ ’‌సంస్థా సృజన అభియాన్‌’‌ను కొనసాగిస్తామని ఖర్గే తెలిపారు. 500 జిల్లాల్లో జిల్లా అధ్యక్షుల నియామకం పూర్తయిందని, బూత్‌ ‌స్థాయి వరకూ పార్టీని బలోపేతం చేస్తున్నామని ఖర్గే చెప్పారు. 2026 ఎన్నికలకు కాంగ్రెస్‌ ‌సిద్ధమని ఆయన ప్రకటించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page