సిఎం రేవంత్కు చాయ్ ఇచ్చేటోళ్లు జర ఆయన హామీలను గుర్తు చేయండి
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేస్తానని
ఏకశిలా పార్కు ముందు ధర్నా చేసిన ఉద్యోగులకు ఇచ్చిన మాటెందుకు మర్చావ్?
అసెంబ్లీ సమావేశాల్లో బిఆర్ఎస్ పార్టీ మీ పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలదీస్తాం
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కాంగ్రెస్ను చిత్తు చిత్తుగా వొడిద్దాం..
సమగ్ర శిక్ష ఉద్యోగుల రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు
సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 12: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సమగ్ర శిక్ష అబి •యాన్ ఉద్యోగాలు రెగ్యు)రైజ్డ్ చేస్తాననీ చెప్పిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి అధికారం లోకి రాగానే ఆయన చెప్పిన మాటలే మరిచిపో యాడనీ, సిఎంకు పొద్దుగల్ల చాయ్ ఇచ్చేటోళ్లు జర ఆయన ఇచ్చిన హామీలను ఒక్కసారి గుర్తు చేయాలని మాజీమంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు అన్నారు. సెప్టెంబర్ 13, 2023న వరంగ్ ఏకశిలా పార్కు ముందు ధర్నా చేస్తున్న సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేస్తానన్నావనీ, ఆ మాటను ఇప్పుడు ఎందుకు మరిచావని ఎమ్మెల్యే హరీష్రావు ప్రశ్ని ంచారు. గురువారం సిద్ధిపేట కలెక్టరేట్ వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగుల రిలే నిరాహార దీక్షకు మద్ద తు ప్రకటించిన అనంతరం ఎమ్మెల్యే హరీష్రావు మాట్లాడుతూ..అధికారంలోకి వొచ్చిన వెంటనే చాయ్ తాగినంత సేపట్లో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలు తీరుస్తానని అనడమే కాకు ండా, కేసీఆర్ను అధికారం నుంచి దించడానికి ఒక గంట ఎక్స్ట్రా పని చేయాలని సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగాలను అడిగిన విషయాన్ని గుర్తు చేస్తూ…అధికారంలోకి వొచ్చిన నెలలో సెక్రటేరియట్లో కూర్చోని చాయ్ తాగుతూ సమస్య పరిష్కరించుకుంటామన్నావు కదా రేవం• •రెడ్డి.. ఇంకా నెల కాలేదా? అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని రేవంత్ ఇంట్లోవాళ్లు గుర్తు చేయాలన్నారు.
మొదటి సంతకంతో రైతుల రుణమాఫీ చేస్తానని రైతులను మోసం చేసిండనీ, అధికారంలోకి వొచ్చేందుకు నాలుగు కోట్ల మంది ప్రజలను రేవంత్రెడ్డి మోసం చేసిండనీ, మూడు కోట్ల మంది దేవుళ్లపై వొట్టు పెట్టి వాళ్లను కూడా మోసం చేసిండన్నారు. బాండ్ పేపర్ల మీద రాసి హామీల అమలు చేస్తామని ప్రజలను మోసం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అన్నారు. రైతులకు 15000 రైతు భరోసా అన్నాడు, 4000 ఆసరా పెన్షన్ అన్నాడు, 2500 మహిళలకు ఇస్తామ న్నాడు ఇవేవీ ఇవ్కఉండా అన్ని వర్గాలను మోసం మోసం చేసిండన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వొచ్చి ఏడాది పూర్తవు తున్నా… రైట్ టు ఎడ్యుకేషన్ ఆక్ట్ ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. రేవంత్రెడ్డి ఇచ్చిన మాటను గుర్తు చేసేందుకు ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేస్తే అరెస్టు చేయిం చాడనీ, మహిళలలు అని కూడా చూడకుండా పోలీస్ స్టేషన్లో పెట్టించాడన్నారు. ప్రజాస్వా మ్యాన్ని పునరుద్ధరిస్తామని ఘనంగా చెప్తావు, నువ్వు ఇచ్చిన హామీ నీకు గుర్తు చేస్తే అరెస్టు చేస్తావు ఇదేనా ప్రజాస్వామ్యం అంటే?అని అడి గారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమ య్యే లోపే సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తులను పిలిచి మాట్లాడాలని హరీష్రావు డిమాండు చేశా రు. నీ ఏడాది పాలనలో నీ పేరు ఎనుముల రేవ ంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్రెడ్డి అని అంటే కేసు పెట్టావనీ, రుణమాఫీ ఎగబెట్టినవ్, రైతు భరోసా ఎగపెట్టినవ్, 4000 ఆసరా పెన్షన్లు ఎగబెట్టినవ్, మహిళలకు 2500 ఎగ్గొట్టినవ్, నువ్వు ఇచ్చిన అన్ని హామీలు ఎగ్గొట్టినవు కాబట్టి నీ పేరు ఎగవేతల రేవంత్ రెడ్డి అంటామన్నారు.
నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు నిన్ను ఎగవేతల రేవంత్ రెడ్డి అనే పిలుస్తా నువ్వు ఒక కేసు కాదు లక్ష కేసులు పెట్టినా నీ పేరు ఎగవేతల రేవంత్ రెడ్డే అంటామన్నారు. కనీసం విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పెట్టే పరిస్థితి లేదన్నారు. గురుకుల పాఠ శాలలో విషాహారం తిని 49 మంది విద్యార్థులు ఇప్పటివరకు చనిపోయారన్నారు. విద్యార్థులకు పెట్టే అన్నం మెస్ బిల్లులను విడుదల చేయడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వొస్తే 15శాతం విద్యకు బడ్జెట్ పెడతా మని 7శాతం బడ్జెట్ కూడా పెట్టలేదన్నారు. విద్యా వలంటీర్లను పూర్తిగా తొలగించారనీ, సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులను పట్టించు కోవడం లేదనీ, ప్రజలను ముంచి విజయో త్సవాలు చేసుకోవడం సిగ్గుచేటన్నారు. ఒక గంట కాదు నాలుగు గంటలు ఎక్స్ట్రా పని చేసి ముఖ్య మంత్రి రేవంత్రెడ్డి మెడలు వంచి సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సత్తా చూపు దామన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కాం గ్రెస్ను చిత్తుచిత్తుగా వోడిద్దాం అని పిలుపు నిచ్చారు. ఈనెల 16నుండి అసెంబ్లీ సమావేశం జరగనుందనీ, అసెంబ్లీ సమావేశాల్లో బిఆర్ఎస్ పార్టీ మీ పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలదీస్తామన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం బిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు.