నిజ నిర్ధారణ చేస్తూ తిప్పికొడుతున్న భారత్
న్యూదిల్లీ, మే 9: భారత్, పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో పాకిస్తాన్ డియా, సోషల్ డియా తప్పుడు ప్రచారాలకు తెరలేపాయి. పెద్ద ఎత్తున అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాయి. సోషల్ డియాలో పాకిస్తాన్కు చెందిన ప్రముఖులు సైతం తప్పుడు వీడియోలను, ఫొటోలను పోస్టు చేస్తున్నారు. భారత ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. తప్పుడు ప్రచారాలపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఉక్కుపాదం మోపుతోంది. నిజా నిజాలను బయటపెడుతోంది. మహ్మద్ అలీ రెజా రజు అనే వ్యక్తి తన ట్విటర్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేశాడు.’ బ్రేకింగ్ .. ఇండియాలోని జమ్మూ ఎయిర్ బేస్లో చాలా చోట్ల ప్రభావం పడ్డట్టు తేలింది’ అని రాసుకొచ్చాడు. దానిపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ చేసింది. ఆ వీడియో 2021, కాబూల్ ఎయిర్పోర్టుకు సంబంధించినదని తెలిపింది.
యుద్ధ వార్తల కవరేజ్లో సంయమనం పాటించడి : రక్షణశాఖ
దేశ భద్రతకు సంబంధించిన యుద్ధవార్త సేకరణలో జాగ్రర్తగా ఉండాలని జర్నలిస్టులకు రక్షణశాఖ హెచ్చరించింది. అడుగడుగునా ప్రమాదం పొంచివున్న సమయంలో జాగరూకతతో విధులునిర్వహించాలని సూచించింది. ఆపరేషన్ వార్తలు, దళాల కదలికల కవరేజీల విషయంలో మీడియా సంయమనం పాటించాలని రక్షణశాఖ ఓ ప్రకటనలో సూచించింది.’భద్రతా దళాల ఆపరేషన్ల ఫలితాలను ప్రభావితం చేసే సమాచారాన్ని వెల్లడిస్తే.. వారి ప్రాణాలకు ముప్పు కూడా రావచ్చు. గతంలో కూడా కార్గిల్ యుద్ధం, 26/11 దాడులు, కాందహార్ హైజాక్ ఘటనలు అత్యుత్సాహపు రిపోర్టింగ్కు నిదర్శనగా నిలిచాయి. కేబుల్ టెలివిజన్ చట్టం ప్రకారం..
దేశ భద్రతకు సంబంధించిన యుద్ధవార్త సేకరణలో జాగ్రర్తగా ఉండాలని జర్నలిస్టులకు రక్షణశాఖ హెచ్చరించింది. అడుగడుగునా ప్రమాదం పొంచివున్న సమయంలో జాగరూకతతో విధులునిర్వహించాలని సూచించింది. ఆపరేషన్ వార్తలు, దళాల కదలికల కవరేజీల విషయంలో మీడియా సంయమనం పాటించాలని రక్షణశాఖ ఓ ప్రకటనలో సూచించింది.’భద్రతా దళాల ఆపరేషన్ల ఫలితాలను ప్రభావితం చేసే సమాచారాన్ని వెల్లడిస్తే.. వారి ప్రాణాలకు ముప్పు కూడా రావచ్చు. గతంలో కూడా కార్గిల్ యుద్ధం, 26/11 దాడులు, కాందహార్ హైజాక్ ఘటనలు అత్యుత్సాహపు రిపోర్టింగ్కు నిదర్శనగా నిలిచాయి. కేబుల్ టెలివిజన్ చట్టం ప్రకారం..
ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ల సమయంలో కేవలం అర్హత ఉన్న అధికారి సమయానుసారం బ్రీఫింగ్స్ ఇచ్చేందుకు అర్హులు. ఈ క్రమంలో అందరూ అప్రమత్తంగా వ్యవహరించి.. సున్నితంగా, బాధ్యతాయుతంగా కవర్ చేయాలని పేర్కొంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా ఆపరేషన్ సిందూర్ వేళ తప్పుడు వార్తలు ప్రచారంలోకి రాకుండా చర్యలు తీసుకొంటోంది. పీఐబీ ఫ్యాక్ట్ చెక్లు నిర్వహిస్తోంది. ఇంతకుముందు గుజరాత్లోని పోర్టు సహా, జలంధర్లో డ్రోన్, క్షిపణి దాడుల దృశ్యాలంటూ సోషల్ మీడియాలో పాక్ అనుకూల వ్యక్తులు వీడియోలు షేర్ చేసిన సంగతి తెలిసిందే. వీటిని భారత్ తిప్పికొట్టింది. పీఐబీ ఫ్యాక్ట్చెక్ చేసి.. అవన్నీ అవాస్తవేమనని తేల్చింది.