శతాబ్దాలు దాటుతున్నా వన్నెతగ్గని విశ్వవిద్యాలయం
అత్యున్నత విద్యా ప్రమాణాలకు నెలవైన ఉస్మానియా విశ్వ విద్యా లయం తెలం గాణకు తలమా నికమైనది.. చది వితే ఈ యూని వర్సిటీ లోనే చదవాలనే కోరిక ప్రతి విద్యార్థి కల. ఇప్పటివరకు ఉస్మానియా యూని వర్సిటీ ఎందరో విద్యావేత్తలను, శాస్త్రవేత్తలను, మేధా వులను అందించింది. హైదరాబాద్లోని ప్రస్తుత ఆబిడ్స్ ప్రాంతంలో ఒక అద్దె భవనంలో తరగతులు ప్రారంభించగా, 1939లో ప్రస్తుత ఆర్ట్స్ కళాశాల భవనం నిర్మించబడిరది. 1919లో కేవలం ఇంటర్మీడియట్ తరగతులతో ప్రారంభమైంది. 1921 నాటికి డిగ్రీ, 1923 నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రారంభ సమయంలో ఉర్దూ బోధనా భాషగా ఉండగా, స్వాతంత్య్రా నంతరం 1948 నుంచి ఆంగ్లం బోధనా భాషగా మారింది. నిజాం పరిపాలన కాలంలో హైదరాబాదులో స్థాపించిన కొన్ని కళాశాలలు రాజ కుటుంబీకులకు, సంపన్న వర్గాలకు మాత్రమే అందుబాటులో వుండేవి. ఉన్నత విద్యను అన్ని సామాజిక వర్గాలకు అందించాలనే ఉద్దేశంతో బ్రిటిష్ ప్రభుత్వం 1913 లో తమ పాలనలో వున్న ప్రాంతాలలోనే గాక సంస్థానాలలో కూడా విశ్వవిద్యాలయాలను స్థాపిం చాలని తీర్మానించింది. ఆ విధంగా పాట్నా, బనారస్, మైసూరు, ఉస్మానియా విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డాయి. ఆబిడ్స్ గన్ఫౌండ్రి దగ్గర తరగతులు ప్రారంభమయ్యాయి.
భారతదేశంలో ఉన్నత విద్యాప్రాప్తిలో ఉస్మానియా విశ్వ విద్యాలయం 7వ ప్రాచీన సంస్థగా, దక్షిణ భారతావనిలో 3వ సంస్థగా పేరుగాంచింది. ఇది హైదారాబాదు సంస్థానంలో స్థాపించబడిన మొట్టమొదటి విద్యాసంస్థ. తన తొమ్మిది దశాబ్దాల చరిత్రలో ఈ విశ్వవిద్యాలయం అన్ని విభాగా లలోనూ మంచి పురోగతి సాధించింది. ఇక్కడ ఉర్దూ ప్రథమ భాషగా మాద్యమంగా ప్రవేశ పెట్టి బ్యూరో ఆఫ్ ట్రాన్స్లేషన్ ను ఏర్పాటు చేసారు. మొదట గన్ ఫౌండ్రీ ప్రాంతంలో 25 మంది సిబ్బంది, 225 విద్యార్థులతో ఇంటర్మీడియట్ సాయంకాలం కోర్సులతో ప్రారంభించి క్రమంగా 1921 లో బి.ఏ, 1923 లో ఎం.ఎ.ఎల్.ఎల్.బి 1927 లో మెడిసిన్, 1929 లో ఇంజనీరింగ్ కోర్సులనూ ప్రవేశపెట్టారు. అయితే నగరంలో వివిధ ప్రాంతాల్లో వున్న కళాశాలలను పరిపాలనా సౌలభ్యం కోసం ఒకే ప్రాంతంలో వుంటే బాగుంటుందని సంకల్పించి, తార్నాక ప్రాంతంలో 2400 ఎకరాల విస్తీర్ణంలో ప్రస్తుత క్యాంపస్ ను ఏర్పాటు చేశారు.
భవనాల నిర్మాణానికి ఆర్కిటెక్ లుగా సయ్యద్ అలీ, రజా, నవాబ్ జయంత్ సింగ్ బహదూర్ లను నియమించారు. వారు అమెరికాలోని కాలిఫోర్నియా స్టాన్ఫోర్డ్, హార్వర్డ్, కొలంబియా, బ్రిటన్ లోని ఆక్స్ పర్డ్, కేంబ్రిడ్జ్ మొదలైన విశ్వవిద్యాలయాలను సందర్శించి వచ్చారు. బెల్జియానికి చెందిన ఇ.జస్సార్ను సలహాదారుగా నియమించి లా, ఇంజనీరింగ్, ఆర్ట్స్ కళాశాల లైబ్రరి, సెనేట్ హాలు వంటి భవనాలను నిర్మించారు. ఆర్ట్స్ కాలేజి భవనానికి 1923 జూలై 5న పునాదులు వేసి, 1939 డిసెంబర్ నాలుగో తేదీన పూర్తి చేశారు. అదే రోజున హైదరాబాద్ నిజాం దీనిని ప్రారంబించాడు. నైజాంలో విద్యాశాఖ మంత్రిగా ఉండిన అక్బర్ హైదర్ చాన్సెలర్గా, నవాబ్ మెహదీయార్ జంగ్ బహదూర్ వైస్ ఛాన్సలర్ గా నియమితులయ్యారు.
1949 లో హైదరాబాదు రాష్ట్రం భారతదేశంలో విలీనం కావడంతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అప్పటి వరకు ఉన్న ఉర్దూ మాధ్యమాన్ని రద్దు చేసి ఆంగ్లమాద్యమం ప్రవేశ పెట్టారు. ఇస్లాం యూనివర్సిటీ గా నామకరణం చేయాలని మొదట్లో వచ్చిన ప్రతిపాదనను కాదని ఉస్మానియా యూనివర్సిటీగా పేరు పెట్టారు. ఇండియా టుడే పత్రిక మన దేశంలో వున్న 160 యూనివర్సిటీలపై సర్వే నిర్వహించగా 2010 వ సంవత్సరంలో 10వ స్థానం, 2011లో 7వ స్థానం, 2012 లో ఆరవ స్థానం లభించింది. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన యూనివర్సిటీలలో ఉస్మానియా విశ్వవిద్యాలయం మొదటి స్థానంలో నిలిచింది. ఉస్మానియా యూనివర్సిటీ ముఖ చిత్రంగా ఉన్న ఆర్ట్స్ కళాశాల భవనానికి మరో అరుదైన గుర్తింపు దక్కింది. దేశంలోని ప్రసిద్ధ ట్రేడ్ మార్క్ భవనాల జాబితాలో ఈ నిర్మాణం చోటు దక్కించుకుంది. ముంబైలోని తాజ్ హోటల్, స్టాక్ ఎక్స్చేంజ్ భవనాల తర్వాత ట్రేడ్ మార్క్ కలిగిన మూడో కట్టడంగా ఆర్ట్స్ కళాశాల భవనం నిలిచింది.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమం
ప్రత్యేక తెలంగాణకై విశ్వవిద్యాలయం విద్యార్థులు 1965 నుంచి పోరాడుతున్నారు. తెలంగాణ ప్రాతంలో ఇది అతిపెద్ద విశ్వవిద్యాలయంగా ఉండటం, ఇక్కడి విద్యార్థులు తెలంగాణ వారే అధికసంఖ్యలో ఉండటం ఇందుకు దోహదం చేసింది. స్వాతంత్య్రోద్యమ సమయంలో ఇక్కడ విజయవంతంగా జరిగిన వందేమాతరం ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడి విద్యార్థులు, మేధావులు ప్రత్యేక తెలంగాణకు మద్దతు ఇచ్చారు.
ఉద్యమ దివిటీ ఉస్మానియా..
ఉస్మానియా విశ్వవిద్యాలయం ఈ పేరు వింటే మొదట గుర్తొచ్చేది తెలంగాణ పోరాటమే. ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం పాత్ర మర్చిపోలేనిది. విద్యార్థి లోకం పిడికిలి బిగించి జై తెలంగాణ అంటూ చేసిన నినాదాలు దిల్లీని కదిలించాయంటే అందులో అతిశయోక్తి లేదు. నాడు తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది ఉస్మానియా విశ్వవిద్యాలయే. ఉస్మానియా యూని వర్సిటీ ఎన్నో ఉద్యమాలకు ఊపిరిలూదిన నేల ఇది. ఉద్యమం ఏదైనా పునాది మాత్రమే ఇక్కడే. ఆనాడు స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా మొదలైన తొలి దశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. 1969 తొలి దశ ఉద్యమం మొదలు 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించే వరకు రణ రంగాన్ని తలపించింది ఉస్మానియా యూనివర్సిటీ. ఈ ప్రయాణంలో ఎన్నో గాయాలు, ఉద్యమ సమయంలో ఆ నేలను తాకిన ప్రతి నెత్తుటి చుక్క సాక్షిగా స్వరాష్ట్ర సాధనే ధ్యేయంగా అలుపెరుగని పోరాటం చేసింది. ఆనాడు పోరా డిన ఎందరో విద్యార్థుల త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం. కలలు కన్న స్వరాష్ట్ర సాధన కోసం ఉస్మా నియా యూనివర్సిటీ క్యాంపస్ కదనరంగంగా మారింది.
తెలంగాణ రాష్ట్ర సాధనకై చేసిన ఆ పోరు రాష్ట్రాన్ని సాధించే వరకు తన తీరు మార్చుకోలేదు. ఉద్యమమేదైనా పునాది మాత్రం ఉస్మానియా యూనివర్సిటీ నుంచే. ఇక్కడే రాష్ట్రం సిద్ధించి దశాబ్ధం కాలమవతుందిసమైక్య పాలనలో తెలం గాణకు జరుగుతున్న అన్యాయాన్ని మొదటగా గుర్తించిన ఉస్మానియా విద్యార్థి లోకం ఉద్యమ బాట పట్టింది. స్థాని కులకే సింగరేణిలో ఉద్యోగాలు ఇవ్వాలంటూ 1969 జనవరి 9న పాల్వంచలో అన్నా బత్తుల రవీంద్రనాథ్ చేసిన ఉద్యమానికి ఉస్మానియా యూనివర్సిటీ అండగా నిలిచింది. అదే మొదటి అడుగుగా ప్రారంభమైన ఉద్యమం పల్లె పల్లెకు తెలంగాణ భావ జాలాన్ని తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిం చారు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు. ఈ ఉద్యమానికి ఉద్యోగులు సైతం మద్దతు తెలప డంతో ఉద్యమం ఉగ్రరూపం దాల్చింది. విద్యా ర్థుల ఉద్యమాన్ని పసిగట్టిన నాటి కాసు బ్రహ్మా నందరెడ్డి ప్రభుత్వం ఉద్యమాన్ని అణచాలని విద్యార్థులపై కాల్పులపై జరిపి, నిర్బంధాన్ని విధించింది. ఫలితంగా 369 మంది విద్యార్థులు అమరుల య్యారు. ఆ సమయంలో నిప్పుకనికల్లా మండుతున్న విద్యార్థి లోకంపై నాటి సర్కార్ నీళ్లు చల్లింది. కానీ వారిలోని పోరాట పటిమను, స్వరాష్ట్ర కాంక్షను మాత్రం చెరపలేకపోయింది, సాగరహారం, మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె, జేఏసీతో కలిసి ఎన్నో పోరాటాల్లో కీలక పాత్ర పోషించారు ఉస్మానియా యూని వర్సిటీ విద్యార్థులు. ఎన్నో పోరాటాల తర్వాత తెలంగాణ విద్యార్థులు గోడును, సబ్బండ వర్గాల ఆకాంక్షను ఆలకించిన ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం సోనియాగాంధీ చొరవతో 2013 జులై 30న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర తీర్మానాన్ని చేసింది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ. 2014 ఫిబ్రవరి 21న రాజ్యసభ తెలంగాణ బిల్లును ఆమోదించింది
. దీంతో ఉస్మానియా క్యాంపస్ లో పండుగ వాతావరణం నెలకొంది. చివరగా 2014 జూన్ 2న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి ఆమోద ముద్ర లభించింది. ఇలా సమైక్య పాలకుల బానిస సంకెళ్లను తెంచడానికి నీళ్లు, నిధులు, నియామకాలు ఉద్యమ నినాదంగా ఉస్మానియా యూనివర్సిటీ జంగ్ సైరన్ మోగించింది. ఈ పోరాటంలో ఎంతో మంది విద్యార్థులు లాఠీ దెబ్బలకు ఓర్చుకుని, రక్తపు బొట్టులను చిందించారు. ఎందరో అమరుల త్యాగాలకు నిలయమైన ఉస్మానియా యూనివర్సిటీ చివరకు అనుకున్నది సాధించింది. 1976 వరకు తెలగాణ ప్రాంతానికి మొత్తం ఉస్మానియా విశ్వవిద్యాలయం ఒక్కటే ఉన్నత విద్యాసంస్థ. హైదరాబాద్ ఓయూ క్యాంపస్లోని కాలేజీలే కాకుండా కోఠిలోని మహిళా కాలేజీ, సైఫాబాద్ సైన్స్ కాలేజీ, సికిం ద్రాబాద్ కాలేజీ, వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ దాని అనుబంధ కాలేజీలుగా ఉన్నాయి.
తెలంగాణలోని అఫిలి యేటెడ్ కాలేజీలు అన్నీ కూడా ఉస్మానియా విశ్యవిద్యాలయం పరిధిలోకి వచ్చేవి. 1972 కంటే ముందు తెలంగాణ ప్రాంతంలో జరిగిన విద్యార్థి ఉద్యమాలన్నిటికీ కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయమే సెంటర్ పాయింట్. ఆ కాలేజీలు ఏర్పడిన తర్వాత ముఖ్యంగా ప్రత్యేక తెలంగాణ తొలి, మలి ఉద్యమాలకైతే గుండెకాయలాంటిది ఉస్మానియా విశ్వవిద్యాలయంఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రపంచం ఘరవించదగ్గ విద్యార్థులలో 9వ భారత ప్రధాన మంత్రి పి.వి. నరసింహారావు, కేబినెట్ మంత్రి జైపాల్ రెడ్డి, తెలంగాణతో కూడిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 16వ మరియు చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, అడోబ్ సిస్టమ్స్ సీఈవో శంతను నారాయణ్ సీనియర్ న్యాయవాది సుబోధ్ మార్కండేయ ఉన్నారు, బ్రతుకు బాట నేర్పేది యూనివర్సిటీ ప్రశ్నించే గొంతుకే ఉస్మానియా యూనివర్సిటీ వెయ్యేళ్ళు అయినా వన్నెతగ్గని మన యూనివర్సిటీ ఇంకా ఎంతో మంది బిడ్డలకు అమ్మలా ఆశ్రయం ఇవ్వాలని కోరుకుంటూ ఉస్మానియా యూనివర్సిటీ అలుమ్నీ అయినా అందుకు గర్విస్తూ జయ జయ హూ ఉస్మానియా యూనివర్సిటీ
డాక్టర్ కృష్ణ సామల్ల, ప్రొఫెసర్
ఫ్రీలాన్స్ జర్నలిస్ట్
9705890045