“1987లో ఆచార్య విమర్శించిన “మతం పేరుతో హింస” అనే అంశం ఈరోజు కూడా పూర్తిగా మాయం కాలేదు. అయితే అది ఇప్పుడు ప్రత్యక్ష హింస నుంచి “వ్యవస్థాత్మక నియంత్రణ” రూపంలో మారింది. అప్పట్లో విప్లవం తన సంతానాన్నే మింగినట్లైతే, ఇప్పుడు అదే వ్యవస్థ తన ప్రజల ఆకాంక్షలను అణచివేస్తోంది. ఆచార్య ఎడిటోరియల్ చివర చెప్పిన “మతాన్ని అధికారానికి వినియోగిస్తే హింస అనివార్యం” అనే వ్యాఖ్య ఇప్పటికీ సరిగ్గా వర్తిస్తుంది. ఇరాన్ ఉదాహరణగా అప్పుడు ఉన్నదే, ఇప్పటికీ అదేవిధంగా ఉంది. నిలిచిపోయింది, కేవలం పద్ధతులు మాత్రమే మారాయి.”
- జనధర్మో విజయతే
నేరము – శిక్ష: యం యస్ ఆచార్య శీర్షికతో రాసిన సంపాదకీయం చదవండి.
ఇస్లామిక్ ఇరాన్లో మానవ మారణహోమం నిరంతరాయంగా సాగుతున్నది. నిన్నరాలిన అధ్యక్ష ప్రధానులు ఆ హోమంలో బలి అయిన కొత్త సమిధలు. ఆయతుల్లా రొహుల్లా ఖోమేని పేరు పెట్టుకున్న మత విప్లవం’’ తాలూకు రుధిర ధారలా ఇవి? ఆవును.
‘‘షా’’ పాలనకు వ్యతిరేకంగా పెల్లుబికిన విప్లవం ఆతర్వాత మత నాయకుల గుత్తాధినత్యంలోకి మారిన తర్వాత.. వేలాది ఉరితీతలు సాగాయి. పరిపాలకులు, నాయకులు, సమర్థులు, సైనికులు అనే తేడా లేకుండా సాధ్యమైనంత మందిని ఉరి తీసారు.
షా వ్యతిరేక విద్యార్థులు
తొలిసారి ప్రజలచేత ఎన్నుకోబడిన అధ్యక్షుడు బనీసదర్ పరిపాలన అయతుల్లా ఖోమేనికి నచ్చలేదు ‘‘ఖురాన్ చెప్పిన సూత్రాలను ఖొమేని చెప్పిన మత సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పాలన సాగడానికి వీల్లేని పరిస్థితి యిదొకటి. కనుక బనీసదర్ తొలగింపబడ్డాడు. ప్రాణాల్ని అరచేతులో పెట్టుకొని నదర్ పారిపోయాడు. ఆ నాటి నుంచి ఇరాన్ ప్రభుత్వాధినేతల మీద కాల్పులు, బాంబు పేలుళ్లు ఉధృతమైనాయి. ‘‘మజ్లిస్’’ (పార్లమెంట్) కూడా బాంబు దాడి నుంచి తప్పుకోలేదు.
షా పాలనను అంతం చేసిన విప్లవం, ఆ తర్వాత అర్థాన్ని కోల్పోయింది. ముల్లాలు-ఖోమేనీలు ఎగదోసిన ప్రతీకారణ్యాలలు ఆరకుండా రగిలాయి. పగ, ద్వేషం కొనసాగింది. నిర్దాక్షిణ్యంగా గొంతునులిమే మారణహోమం సాగింది. విప్లవ ఫలితాలుగా పగ ద్వేషం మిగిలిపోయాయి. మతమౌఢ్యం, తాను బట్టిన కుందేటికి మూడే కాళ్ళనే మూర్ఖమయిన పాలనకు బనీసదర్ అనుయాయులను క్రూరంగా వేటాడడంతో ప్రజలకు విప్లవ ప్రయోజనాల పట్ల విశ్వాసం హరించుకునిపోయింది.
దేవుడికి శత్రువులు, ఇరాన్ కు శత్రువులు అని పేరు పెట్టి ఆ తర్వాత చంపివేయడం ఇరాన్కు అలవాటయింది. జూన్ నుంచి ఇప్పటికి ఇరాన్ ఆరువందల మంది ‘‘దేవుడి శత్రువులను’’ మింగింది. ఆయతుల్లా అధ్యక్షత వహించిన ఈ విప్లవ న్యాయస్థానాలు. కన్నుకు కన్ను, పన్నుకు పన్ను అనే అదే మానవ అనాగరిక న్యాయసూత్రాల ఆధారంగా ప్రాణాలను తీయడమే పనిగా పెట్టుకున్నాయి.
షా అంతం తర్వాత షా అనుయాయుల వేటతో ఈ హింస ఆగిపోలేదు. ఆ తర్వాత ముజాహిద్దీన్-ఎ-ఖల్క్, తదితర వామపక్ష సెక్యులర్ వాద సంస్థల నాయకులను ఊచకోత కోయడం ప్రారంభించారు. ‘‘షా’’ను వ్యతిరేకించడం కోసం ముల్లాలతో చేతులు కలిపిన యీ తీవ్రవాదశక్తులు యిప్పుడు ఆయతుల్లాకు ఎదురు తిరిగాయి.
ఆ హింసకు బలి అయిన కొత్త వ్యక్తులు అధ్యక్షుడు మహ్మద్ అలీరజాయ్ ప్రధాని హొజాకెస్లామ్ మహ్మదావిద్ బహానార్లు. ఈ ఇద్దరు అత్యున్నత శ్రేణి అధికారులు. గుర్తు పట్టరానంత ఘోరంగా కాలి రూలి పోయారు. ఈ చర్యలకు అమెరికా కారణమని ఇరాన్ నిందించింది. ముజహద్దీన్-ఎ- బర్క్ కార్యకర్తలు అధ్యక్ష ప్రధానులను అంతమొందించారని ఖొమేనీ ప్రభుత్వం అనుమానిస్తున్నది.
ఖొమేనీ నేర్పిన హింస-ప్రతిహింస సిద్ధాంతమే ఆయనను ఎదురు దెబ్బతీసింది అని ఫ్రాన్స్లో ఆశ్రయం పుచ్చుకున్న బనీసదర్ వ్యాఖ్యానించాడు. తాను చేసిన నేరాలు తననే తరుముతున్నాయని దీంతో ఖొమేనీకి కూడా చివరి రోజులు దాపురించాయని బనీసదర్ అన్నాడు. ఈ హత్యాకాండ వెనుక తానులేనని బనీసదర్ అన్నాడు.
మానవత్వాన్ని మించిన మతం లేదు. తన మాట వినని వాడిని కాల్చిచంపాలని అల్లా, రాముడు, క్రీస్తు చెప్పలేదు. ఇతర మతస్తులను కాల్చిచంపమని ఖురాన్లో, గీతలో, బైబిల్లో లేదు.
అధికారం కోసం మతాన్ని దేవుణ్ని దుర్వినియోగం చేస్తే ఫలితాలు ఎట్లా ఉంటాయోచెప్పడానికి ఇరాన్ ఒక ఉదాహరణ.
మనుషులు అత్యాచారాలు జరుపటం, పిచ్చిగా అమానుషంగా వ్యవహరించటం, దానికి మతం అంటగట్టి మత పవిత్రతకు కళంకం తేవటం ఒక అలవాటుగా పరిణమించింది. అటువంటి దేశాలలో సంపన్నమైన ఇరాన్ ఒకటి కావటం ఆ దేశ ప్రజల దురదృష్టం.
ఆ దేశ ప్రస్తుత పాలకులవలెనే ఆలోచించి వ్యవహరించే ఏ దేశమైనా, జాతి అయినా హింసా విధ్వంసనలకు తానే బలి అయిపోవటం అనివార్యం.
యం యస్ ఆచార్య సంపాదకీయంలో 23-10-1987 నాటి ఇరాన్ పరిస్థితి అది. ఇప్పుడు…
మతాధిపత్య, సామాజిక ఒత్తిళ్ల మిశ్రమం ఇప్పటి ఇరాన్
ఇరాన్లో ప్రస్తుత పరిస్థితి రాజకీయ, మత, సామాజిక ఒత్తిళ్ల మిశ్రమంగా కొనసాగుతోంది. 1979లో జరిగిన Iranian Revolution తర్వాత ఏర్పడిన ఇస్లామిక్ గణతంత్రం ఇప్పటికీ మతాధిపత్యం ఆధారంగా నడుస్తున్నది. దేశపు పరిపాలనలో అత్యున్నత అధికారిగా ఉన్న Ali Khamenei ప్రభావం అన్ని రంగాల్లో కనిపిస్తుంది. ఎన్నికైన ప్రభుత్వాలు ఉన్నప్పటికీ, తుది నిర్ణయాధికారం మతపెద్దల చేతుల్లోనే ఉంది.
ఇటీవలి సంవత్సరాల్లో ప్రజల్లో అసంతృప్తి గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా మహిళల హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛలపై ఆంక్షలు తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. హిజాబ్ నిబంధనల అమలు, నైతిక అనే ‘‘మోరాలిటీ పోలీస్’’ (రక్షకులు అనేవారి) చర్యలు ప్రజా నిరసనలకు దారి తీసాయి. యువత, మహిళలు ముందుండి నిర్వహించిన ఈ నిరసనలు దేశవ్యాప్తంగా వ్యాపించాయి. ప్రభుత్వం ఈ ఉద్యమాలను కఠినంగా అణచివేయడానికి ప్రయత్నించింది.
ఆర్థిక పరిస్థితి కూడా కఠినంగా ఉంది. అంతర్జాతీయ ఆంక్షలు, ముఖ్యంగా అమెరికా విధించిన ఆంక్షల కారణంగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరిగి సాధారణ ప్రజల జీవితం క్లిష్టమైంది.
విదేశాంగ విధానంలో కూడా ఇరాన్ వివాదాస్పద పాత్ర పోషిస్తోంది. మధ్యప్రాచ్యంలో ప్రభావాన్ని పెంచేందుకు వివిధ మిలీషియా గుంపులకు మద్దతు ఇస్తున్నదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగా ఇతర దేశాలతో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
మొత్తంగా చూస్తే, ఇరాన్లో ప్రజాస్వామ్య ఆకాంక్షలు మతాధిపత్య పాలన మధ్య ఘర్షణ కొనసాగుతోంది. ప్రజలు స్వేచ్ఛ, హక్కుల కోసం పోరాడుతుండగా, ప్రభుత్వం నియంత్రణను కొనసాగించడానికి కఠిన విధానాలను అనుసరిస్తోంది. ఈ విభేదాలు భవిష్యత్తులో కూడా దేశ స్థిరత్వంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఈనాటి స్థితి: హింస, ప్రతిహింసల చక్రంపై విమర్శ
39 ఏళ్ల కిందట రాసిన సంపాదకీయం ఈనాటికీ ఈవిధంగా కనిపిస్తున్నది. 1987లో ఆచార్య పేర్కొన్న ఎడిటోరియల్ ప్రధానంగా Iranian Revolution తరువాత ఏర్పడిన మతాధిపత్య పాలనలో హింస, ప్రతిహింసల చక్రాన్ని తీవ్రంగా విమర్శించింది. ముఖ్యంగా Ruhollah Khomeini నాయకత్వంలో “దేవుడి శత్రువులు” అనే పేరుతో వేలాది మందిని ఉరి తీయడం, విప్లవ న్యాయస్థానాల ద్వారా శిక్షలు అమలు చేయడం వంటి ఘటనలను అది ఆక్షేపించింది. విప్లవం ప్రజాస్వామ్య ఆశయాల నుంచి మత నియంత్రణకు ఏ విధంగా మళ్లిందో ఆ సంపాదకీయం స్పష్టంగా చూపించింది.
అప్పుడు (1980ల దశకం):
- విప్లవానంతర అస్తవ్యస్త పరిస్థితి
- ప్రతిపక్షాలపై నేరుగా ఉరితీతలు, బహిరంగ హింస
- అబోల్ హస్సన్ బనిసదర్ వంటి ఎన్నికైన నాయకుల తొలగింపు
- బాంబు దాడులు, హత్యలు, అంతర్గత యుద్ధ వాతావరణం
ఇప్పుడు (2020ల దశకం):
ఈనాటి ఇరాన్లో పరిస్థితి రూపాంతరం చెందినా, మూల స్వరూపం చాలా వరకు అలాగే ఉంది. అలీ ఖమేనీ ఆధ్వర్యంలో మతాధిపత్య వ్యవస్థ కొనసాగుతోంది. అయితే హింస రూపం మారింది—పబ్లిక్ ఉరితీతల కంటే, నిరసనల అణచివేత, అరెస్టులు, ఇంటర్నెట్ నియంత్రణ వంటి ఆధునిక పద్ధతులు పెరిగాయి.
- మహిళల హక్కులపై ఆంక్షలకు వ్యతిరేకంగా భారీ నిరసనలు
- యువతలో స్వేచ్ఛపై ఆకాంక్ష పెరుగుదల
- భద్రతా బలగాల కఠిన చర్యలు
- అంతర్జాతీయ ఆంక్షల కారణంగా ఆర్థిక ఒత్తిడి
పోలిక:
1987లో ఆచార్య విమర్శించిన “మతం పేరుతో హింస” అనే అంశం ఈరోజు కూడా పూర్తిగా మాయం కాలేదు. అయితే అది ఇప్పుడు ప్రత్యక్ష హింస నుంచి “వ్యవస్థాత్మక నియంత్రణ” రూపంలో మారింది. అప్పట్లో విప్లవం తన సంతానాన్నే మింగినట్లైతే, ఇప్పుడు అదే వ్యవస్థ తన ప్రజల ఆకాంక్షలను అణచివేస్తోంది.
అసలు ఆలోచన మారలేదు:
ఆచార్య ఎడిటోరియల్ చివర చెప్పిన “మతాన్ని అధికారానికి వినియోగిస్తే హింస అనివార్యం” అనే వ్యాఖ్య ఇప్పటికీ సరిగ్గా వర్తిస్తుంది. ఇరాన్ ఉదాహరణగా అప్పుడు ఉన్నదే, ఇప్పటికీ అదేవిధంగా ఉంది. నిలిచిపోయింది, కేవలం పద్ధతులు మాత్రమే మారాయి.





