సిద్దిపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23 : సిద్దిపేట జిల్లా తునికి బొల్లారం ఇండస్ట్రియల్ పార్కులోని ఆజాద్-సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ‘ది ఎక్స్క్లూజివ్ లీన్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఫర్ బేకర్ హ్యూస్’ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు గురువారం లాంఛనంగా ప్రారంభించారు. అమెరికాకు చెందిన గ్లోబల్ ఎనర్జీ టెక్నాలజీ కంపెనీ బేకర్ హ్యూస్ ఆయిల్ ఫీల్డ్ సర్వీసెస్డ్ ఎక్విప్మెంట్(వోఎఫ్సీఈ), ఇండస్ట్రియల్ అండ్ ఎనర్జీ టెక్నాలజీ(ఐఈటీ), టెక్నాలజీ అండ్ డిజిటల్ సొల్యూషన్స్ తదితర రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తోంది. తాజాగా ప్రారంభమైన ఈ యూనిట్లో బేకర్ హ్యూస్ ఇండస్ట్రియల్ అండ్ ఎనర్జీ టెక్నాలజీ (ఐఈటీ) విభాగానికి అవసరమైన హై ప్రెసిషన్ ఉత్పత్తులు తయారవుతాయి. కొత్తగా 230 హై స్కిల్డ్ వర్క్ఫోర్స్కు ఉపాధి లభిస్తుంది. తయారీ రంగంలో ‘మేడ్ ఇన్ తెలంగాణ’ మరింత విశ్వవ్యాప్తం అవుతుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





