ఇంతియానం 2.0 ఆవిష్కరణ
మహిళల యాత్రానుభవాల సంకలనం ‘ఇంతియానం 2.0’ పుస్తకావిష్కరణ సభ, ఏప్రిల్ 20, సాయంత్రం 6 గంటలకు తెలంగాణ సారస్వత పరిషత్ లో జరుగుతుంది. తెలుగులో మహిళా యాత్రికుల అనుభవాలతో వచ్చిన తొలి సంకలనం ‘ఇంతియానం’కు ఇది రెండవ భాగం. రెండు భాగాలతో కలిపి మొత్తం 100 మంది మహిళా యాత్రికులు తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ సభకి గౌరవ అతిథులుగా డాక్టర్ సి. మృణాళిని, అమరేంద్ర దాసరి వస్తున్నారు. అపర్ణ తోట, స్వర్ణ కిలారి సభా నిర్వహణ చేస్తారు. సాహిత్యాభిమానులందరికీ ఆహ్వానం.
కథలకి ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ అవిభక్త శ్రీకాకుళం, విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శిగా దీర్ఘకాలం (1969-1984) పనిచేసిన ఎ. వి. చయనులు 2000 సం.లో మరణించారు. జీవించినంత కాలం పీడితవర్గ రాజకీయాలవైపు నిలబడ్డారు. ఆయన సాహిత్యాభిమాని. వారి స్మృతిలో కథలు ఆహ్వానిస్తున్నాం. 45 సం. వయసులోపు వాళ్ళు మాత్రమే పంపాలి. ఒకరు ఒక కథ మాత్రమే పంపాలి. కథలు యూనీకోడ్/పిడిఎఫ్ లో ఉండాలి. పేజీల పరిమితి లేదు. కథావస్తువుకి పరిధిలేదు కానీ హాస్య, వ్యంగ్యరచనలకి ప్రాధాన్యం. ఎంపికైన ఒక కథకు 10 వేలు- ఎ. వి చయనులు స్మృతిసభలో ఇస్తారు. కథలు చేరడానికి ఆఖరుతేదీ – 2025 జూన్ 15. కథలు పంపవలసిన మెయిల్ ఐడి-
vidyasagarsriadibhatla@gmail.com
ఎస్ ఎ విద్యాసాగర్ (+91 94923 40651)