కాళేశ్వరం నిర్మాణమే బ్లండర్‌

దాంతో వరి దిగుబడులు పెరగడం అబద్దం
ప్రాజెక్టు గురించి గొప్పలు చెప్పన కెసిఆర్‌ అందుకు బాధ్యులు
చేవెళ్ల ఎంపి కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి విమర్శలు

హైదరాబాద్‌, జూన్‌11: కాళేశ్వరం పేరుతో కేసీఆర్‌ రాష్టాన్న్రి అప్పులపాలు చేశారని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం మంచి అయినా, చెడు అయినా బాధ్యుడు కేసీఆర్‌ అని పేర్కొన్నారు. ఒకప్పుడు మాజీ సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టుపై గొప్పలు చెప్పుకుని ఇప్పుడు తప్పించుకుంటున్నారని విశ్వేశ్వర్‌ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణలో వరి దాన్యం దిగుబడి పెరగలేదని, ప్రపంచంలో అతి పెద్ద ఇంజనీరింగ్‌ బ్లండర్‌ కాళేశ్వరం అని, కాళేశ్వరంలో అవినీతి జరిగినా ప్రాజెక్ట్‌ కూడా మిగలలేదని ఎద్దేవా చేశారు. తాను బీఆర్‌ఎస్‌ పార్టీని వీడేందుకు కాళేశ్వరం కూడా ఓ కారణం అని విశ్వేశ్వర్‌ రెడ్డి చెప్పారు. ప్రాజెక్ట్‌ డిజైన్‌ అన్ని విధాలుగా తప్పు.. మేడిగడ్డను బ్యారేజ్‌గా కాకుండా డ్యాంగా వాడుకోవడం వల్లనే దెబ్బతిన్నదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ స్వయం ప్రత్యక్షం అయిందా? అని ప్రశ్నించారు. గవర్నర్‌ కేసీఆర్‌ను కాళేశ్వర్‌ రావు అని పిలిచారన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రతి రైతు ప్రతి ఏడాది రూ.91 వేలు లబ్ధి పొందుతున్నారని, బీజేపీ ఎంపీలు వేస్ట్‌ అని ఆరోపిస్తున్నారు.. తెలంగాణను ఆదుకుంటోంది కేంద్రమేనని, నవోదయ స్కూల్స్‌, టూరిజం నిధులు, పీఎంశ్రీ, పీఎం కుసుమ్‌ పథకాల కింద మిగతా రాష్టాల్ర్రతో పోల్చుకుంటే తెలంగాణకు ఎక్కువ నిధులు వచ్చాయని ఆయన చెప్పారు. కేబినెట్‌ అంటే కేసీఆర్‌.. కేసీఆర్‌ అంటే కేబినెట్‌. కమిషన్‌ అడిగిన దానికి ఈటల రాజేందర్‌ సమాధానం చెప్పారు. కేసీఆర్‌ గురించి అడిగి ఉంటే ఈటల చెప్పేవారని వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page