మావోయిస్టు అగ్రనేత కేశవరావు మృత దేహం అప్పగింతలో సాగిన హైడ్రామా – 

మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు సైద్ధాంతిక, సాయుధ పోరాట విధానాలతో అందరూ ఏకీభవించక పోవచ్చు. కాని ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో బస్తర్ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో చనిపోయిన నంబాల కేశవరావు తో పాటు ఆయన సహచరుడు సజ్జా నాగేశ్వరరావు మృత దేహాలను బంధువులకు అప్ఫగించడంలో ఛత్తీస్ ఘడ్ పోలీసు అధికారులు సాగించిన హైడ్రామా మానవత్వానికే మాయని మచ్చగా మిగిలి పోయింది. కోర్టు ధిక్కరణకు పాల్పడి సాంకేతిక కారణాలతో తప్పించుకున్నా ఇది ఇంతటితో ముగుస్తుందని భావించలేము. మరణ శిక్ష విధించిన ఖైధీలతో పాటు ఎన్కౌంటర్లల   ల్లో మృతి చెందిన క్రిమినల్స్ పార్థివ దేహాల్ని సాధారణ స్థాయిలో సగౌరవంగా లేకున్నా అపచారం లేకుండా వారి బంధువులు ఖననం చేయడం రాజ్యాంగ కల్పించిన ప్రాథమిక హక్కు. మను స్మృతి అదే చెబుతుంది. . కమలనాథుల పాలనలో రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు చట్టుబండలౌతున్నా అంతిమంగా మను స్మృతి ఆచరించుతున్నామని గొప్పలు చెప్పుకొనే పార్టీ అధికారంలో వున్న ఛత్తీస్ ఘడ్   లో తద్విరుద్ధంగా కేశవరావు అతని సహచరుని విషయంలో జరిగింది.

వాస్తవం చెప్పాలంటే ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించింది. ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో కేశవరావు బంధువులు మృత దేహాన్ని పోస్టుమార్టం అనంతరం తమకు అప్పగించమని పిటిషన్ వేసినపుడే న్యాయ మూర్తి ఆదేశాలు ఇవ్వక ముందే ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరైన అడ్వకేట్ పోస్టు మార్టం అనంతరం మృత దేహాన్ని బంధువులకు అప్పగించుతామని చెప్పడంతో హైకోర్టు న్యాయమూర్తి కూడా అదే ఆదేశాలు జారీ చేశారు. ఇందులోనే మతలబు ఇమిడి వుంది. హైకోర్టు న్యాయమూర్తి నేరుగా ఆదేశాలు జారీ చేసి ఉంటే హైకోర్టులో పిటిషన్ వేసిన కేశవరావు సోదరునికి మృతదేహం విధిగా అప్పగించ వలసి వచ్చేది. ఇప్పుడు ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర ప్రభుత్వమే హైకోర్టుకు మాట ఇచ్చి తప్పించుకొన్నందున కేశవరావు తాలూకా బంధువులు దాఖలా చూప లేదని ఇతర కారణాలు చూపి తప్పించుకొనే అవకాశం మిగుల్చుకున్నారు.

కుత్సిత బుద్ధితో వ్యవహరించిన ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర ప్రభుత్వంపై ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో వేయబడిన కోర్టు ధిక్కరణ కేసు దురదృష్టం కొద్దీ సాంకేతిక కారణాలతో కొట్టివేయబడింది. నిస్సిగ్గుగా వ్యవహరించిన ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా తప్పించుకొన్నా మున్ముందు ఏం జరుగుతుందో చూద్దాం!
తాము ఎన్ని కుంటి సాకులు మిగుల్చుకున్నా హైకోర్టు ముందు దోషిగా నిలబడ వలసి ఉంటుందనే భయంతోనే కేశవరావు ఆయన సహచరుడు మృత దేహాల్ని దహనం చేసిన తర్వాత కూడా ఛత్తీస్ ఘడ్ పోలీసు అధికారులు హైడ్రామా నడిపారు. మృతదేహాన్ని ఇవ్వక పోయినా కనీసం చితాభస్మం ఇవ్వమని కోరిన కేశవరావు సోదరుడు రామ ప్రసాద్ ను నారాయణ పూర్ పోలీసు స్టేషన్ లో కూర్చోబెట్టి – వారి అనుమతితోనే దహనం చేసినట్లు తమకు అనుకూలంగా పిటిషన్ రాసి చివరగా చితాభస్మం కోరినట్లు రాసితే అందుకు కేశవరావు సోదరుడు రామ ప్రసాద్ తదితరులు అంగీకరించకుండా తప్పించుకొని వచ్చినట్లు కొన్ని మీడియాల్లో వార్తలు వచ్చాయి. ఇదే నిజమైతే తాము చేసిన ఘాతుకం హైకోర్టులో మెడకు చుట్టుకొంటుందనే భయం ఛత్తీస్ ఘడ్ పోలీసులకు వున్నట్లుంది.
తాము ఎన్ని కుంటి సాకులు మిగుల్చుకున్నా హైకోర్టు ముందు దోషిగా నిలబడ వలసి ఉంటుందనే భయంతోనే కేశవరావు ఆయన సహచరుడు మృత దేహాల్ని దహనం చేసిన తర్వాత కూడా ఛత్తీస్ ఘడ్ పోలీసు అధికారులు హైడ్రామా నడిపారు. మృతదేహాన్ని ఇవ్వక పోయినా కనీసం చితాభస్మం ఇవ్వమని కోరిన కేశవరావు సోదరుడు రామ ప్రసాద్ ను నారాయణ పూర్ పోలీసు స్టేషన్ లో కూర్చోబెట్టి – వారి అనుమతితోనే దహనం చేసినట్లు తమకు అనుకూలంగా పిటిషన్ రాసి చివరగా చితాభస్మం కోరినట్లు రాసితే అందుకు కేశవరావు సోదరుడు రామ ప్రసాద్ తదితరులు అంగీకరించకుండా తప్పించుకొని వచ్చినట్లు కొన్ని మీడియాల్లో వార్తలు వచ్చాయి. ఇదే నిజమైతే తాము చేసిన ఘాతుకం హైకోర్టులో మెడకు చుట్టుకొంటుందనే భయం ఛత్తీస్ ఘడ్ పోలీసులకు వున్నట్లుంది..  

కేశవరావు ఆయన సహచరుడు మృత దేహాల్ని ఇచ్చి వుంటే వారి బంధువులు రీ పోస్టుమార్టం కోరే అవకాశం ఉందని వాస్తవంలో కేశవరావు ఆయన సహచరుడు ఎన్ కౌంటర్ లో చనిపోలేదని రాయపూర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతుంటే పట్టుకొని వచ్చి ఎన్ కౌంటర్ చేసినట్లు ఆయన బంధువులు ఆరోపించినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. ఆ భయంతోనే మృత దేహాల్ని ఇవ్వలేదని ఈ కథనాలు తెలిపాయి. కాని ఇందుకు భిన్నంగా ఎన్ కౌంటర్ అనంతరం మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి ప్రకటన వుంది. ఎన్ కౌంటర్ సందర్భంగా కేశవరావును కాపాడుకోలేక పోయామని ఈ ప్రకటన తెలుపుతోంది. ఏదిఏమైనా పౌర హక్కుల సంఘాలు కోరుతున్నట్లు న్యాయ విచారణ జరిగితే ఏం జరిగిందీ వెలుగు చూస్తుంది.

ఈ విషయంలో ఆంధ్ర ప్రదేశ్ చెందిన శ్రీ కాకుళం జిల్లా పోలీసు అధికారులు వ్యవహార సరళి కూడా అనుమానాస్ఫదంగా వుండినదని వార్తలు వెలువడ్డాయి . లేకుంటే ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర పోలీసు అధికారులు కూడా ఈ విధంగా వ్యవహరించే వారు కాదేమో! ఒక వేళ కేశవరావు మృత దేహం స్వస్థలం తీసుకు వచ్చి వుంటే ఖననం చేసిన చోట స్మారక స్థూపం విధిగా నిర్మింప బడేదని ఖననం సమయంలో జన సమీకరణ జరగడం కొంత అలజడి ఉంటుందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పోలీసులు భావించినట్లు మీడియాలో వచ్చిన తదితర కథనాల్లో వాస్తవం లేకపోలేదు. ఏదిఏమైనా కేశవరావు తాలూకు స్మృతి చిహ్నాలు లేకుండా చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విజయం సాధించినా ఆయన భావజాలాన్ని మాత్రం దహనం చేయ లేకపోయారు.

అంతేకాదు. మావోయిస్టుల అంశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి బహు దుర్మార్గంగా వుంది. అడవిలో జంతువులను వేటాడినట్లు క్రూరంగా కాల్చి చంపుతోంది. ఈ మారణహోమం అంత వరకే పరిమితం కావడం లేదు. మావోయిస్టులకు ఆశ్రమం ఇచ్చారని కొన్ని సందర్భాల్లో అన్నం పెట్టారని వార్తాహరులుగా ఉన్నారని వందలాది మంది ఆదివాసీలు పోలీసుల దాష్టీకానికి అతి క్రూర హింసలకు బలి అవుతున్నారు. మావోయిస్టుల పేరుతో ఎంతో మంది ఆదివాసీలు హతమార్చ బడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తుదకు బద్ద శత్రు దేశమైన పాకిస్థాన్ యెడల చూపిన ఔదార్యం కూడా మావోయిస్టులు యెడల చూపించ లేక పోతోంది. భారత్ పాక్ దేశాల మధ్య కాల్పుల విరమణ తన జోక్యంతో జరిగిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనతో పరువు పోతోందని భావించిన కేంద్ర ప్రభుత్వం పదేపదే పాకిస్తాన్ బలహీన పడి కోరినందున కాల్పుల విరమణకు తలపడినట్లు భారత్ అధికారులు పలు వేదికల మీద చెప్పుకొచ్చారు.

ఇందులో భారత్ అధికారులు చెప్పిందే నిజమని నమ్మినా ఇదే ఔదార్యం కేంద్ర ప్రభుత్వం తమ దేశ పౌరులైన మావోయిస్టుల యెడల ఎందుకు అమలు చేయడం లేదు? మావోయిస్టులు నుండి కాల్పుల విరమణ ప్రతి పాదన వచ్చినా ఏమాత్రం పరిగణనలోనికి తీసుకోలేదు. మావోయిస్టుల నుండే కాకుండా దేశంలోని పలు పౌర హక్కుల సంఘాల నుండి కాల్పుల విరమణ ప్రతి పాదన వచ్చిన తర్వాతనే కేశవరావు పాటు పలువురిని మట్టు బెట్టి ఎదురు కాల్పుల్లో మృతి చెందినట్లు ప్రకటించారు. . కాల్పుల విరమణ చేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని వివిధ పౌర హక్కుల హక్కుల సంఘాలు చేసిన విజ్ఞప్తులు నిష్ప్రయోజనం అయ్యాయి. ఇదంతా పథకం మేరకు జరుగుతోందని వార్తలు వస్తున్నాయి .
అటవీ ప్రాంతాల్లో నిక్షిప్తమై వున్న ఖనిజ సంపద కార్పొరేటర్ల పరం చేయాలంటే ముందుగా ఆదివాసీల గొంతుకగా వున్న మావోయిస్టులను దండకారణ్యం నుండి తుడిచి పెట్టాలనే వ్యూహంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నందున పాకిస్తాన్ యెడల చూపిన ఔదార్యం కూడా చూపడం లేదు.

వి. శంకరయ్య విశ్రాంత పాత్రికేయులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page