జనాభా లో 60 శాతం ప్రజలకు ఉచిత రేషన్‌ ‌దేనికి సంకేతం ..?

వికసిత భారత్‌ ‌లక్ష్యంగా పదేళ్లుగా మోదీ నేతృత్వంలోని బిజెపి పాలన సాగుతోంది. పడికట్టు పదాలు బాగా అలవాటు చేసుకున్నారు. అభివృద్ది పేరుతో నయవంచన సాగుతోంది. గత 20 ఏళ్ల కాలానికి పోలిస్తే దేశంలో అభివృద్ది అన్నది ఎండమావి అన్న విమర్శలు ఉన్నాయి. కోట్లాది మంది రైతులకు నేరుగా నగదు బదిలీ చేస్తున్నామంటేనే వారికి తగిన గిట్టుబాటు ధరలు, వ్యవసాయ పనిముట్లు అందడం లేదని అర్థం చేసుకోవాలి. ఇన్ని సమస్యలను చర్చించకుండా అంతా బాగుందని చెప్పడం ద్వారా భారత్‌ ‌వెలిగిపోతోందని అంటే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని గుర్తించాలి. అందమైన ఎసి గదుల్లో కూర్చుని ఆలోచిస్తే ఎన్నటికీ అంటే 2047 నాటికి కూడా ప్రజల బతుకులు బాగుపడవని గుర్తించాలి. సామాజిక న్యాయం కేవలం రాజకీయ నినాదంగా మాత్రమే ఉండేదని,కానీ, మేం దాన్ని అమలు చేసి చూపుతున్నాం.. సామాజిక రుగ్మతగా మారిన వ్యవస్థీకృత అసమానతలను రూపుమాపుతున్నాం అన్న పదాలు వినడానికి బాగానే ఉంటాయి. గత పదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థలో అనేక గుణాత్మక మార్పులు వొచ్చాయని వీపులు చరుచుకుని సరిపుచ్చితే మార్పు రాదు. నిజానికి దేశంలో ఎక్కడ ఎలాంటి పంటలు పండుతున్నాయి. వాటికి ఎంత ఖర్చవుతుంది. రైతులు ఏం కోరుకుంటున్నారన్న చర్చ చేయడం లేదు. వ్యవసాయ చట్టాలు ఎత్తేశాక వాటి గురించి చర్చించడం లేదు.

పన్ను వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణల వల్ల ట్యాక్స్ ‌చెల్లింపుదారుల సంఖ్య పెరిగింది. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం వల్ల పొదుపులు, పెట్టుబడులకు భద్రత ఏర్పడిందంటున్నారు. నిజానికి ఇదొక్కటే దేశాన్ని, ప్రజలను అగాధం లోకి నెట్టుతోందని ఎంత త్వరగా గుర్తిస్తే అంతమంచిది. ద్రవ్యోల్బణం అదుపులోకి వొచ్చిందన్న మాటలు శుద్ద అబద్దం. ఆర్థిక వ్యవస్థ బలోపేతమై ప్రజలకు ఉపాధి లభించేలా ప్రజా ప్రయోజనాల కోసం అనేక కార్యక్రమాలు, పథకాలు రూపొందించాల్సి ఉంది. బ్యాంకులను సంస్కరించా ల్సిన అవసరం ఉంది. అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్‌ను రూపొందించడం జరిగిందన్న విషయంలో అబద్దాలను అందంగా చెప్పారు. 2014కు ముందు దేశం అనేక సవాళ్లను ఎదుర్కొందన్న ఆర్థిక మంత్రి.. ఇప్పుడు పరిస్థితులు చక్కబడ్డాయని చెప్పడం మోసం చేయడం తప్ప మరోటి కాదు. కార్పోరేట్లకే బిజెపి అనుకూలం అన్న ప్రచారం కూడా బలంగా ఉంది. పేదల అభివృద్ధే దేశ అభివృద్ధి. భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతోందంటే వారు బాగుపడ్డ దాఖలాలు కనబడాలి. 80 కోట్ల మందికి ఫ్రీ రేషన్‌తో ఆహార సమస్య తీరిందని పేర్కొనడంతోనే దేశం ఏ మేరకు అభివృద్ది చెందిందో అర్థం చేసుకోవొచ్చు. మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన తర్వాత చేపట్టిన సంస్కరణలు ఫలితాలిస్తాయని ఆశించారు. దేశ ప్రజలు భవిష్యత్‌పై ఆశతో ఉన్నారు. పేదలకు ఉచిత రేషన్‌ ఇస్తున్నా మంటేనే.. ప్రజల కొనుగోలు శక్తి లేకుండా పోయిందని గుర్తించడం లేదు.

దాదాపు 80 కోట్ల మంది దీని వల్ల లబ్ది పొందారని గర్వంగా చెప్పుకోవడం సిగ్గుచేటు..
రైతులకు కనీస మద్దతు ధరలు అన్నవి రావడం లేదు. కానీ బియ్యం, ఉప్పు,పప్పుల ధరలు మాత్రం ఏటికేడు ఆకాశాన్ని అంటుతున్నాయి. అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం అని వివరించడం అందంగా మోసగించడం తప్ప మరోటి కాదు. దేశంలో ఎన్నో సమస్యలు పరిష్కరించడం వేరు..కానీ పేదలు, మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వం అండలేకుండానే జీవించగలగాలి. కానీ ఈ పదేళ్లలో అలాంటి అవకాశాలు లేకుండా చేశాయి. సామాన్యులు ఇల్లు కొనుక్కునే పరిస్థితి లేదు. గ్రాణ ప్రజల ఆర్థిక వికాసం సాధ్యం అవుతోందని చెప్పకుండా ఉంటే బాగుండేది. అయితే పాలకులు సామాన్యులు బతకడమెలా అన్నది ఆలోచించడం లేదు. సామాన్యుడు తనకుతానుగా బతకగలిగినప్పుడే నిజమైన అభివృద్దికి గీటురాయిగా చూడాలి. వొచ్చే ఐదేళ్లలో భారత్‌ అద్భుతమైన ప్రగతి సాధించబోతుందని మోదీ• సహా నేతలంతా పేర్కొనడం చూస్తే..దేశం మరో ఐదేళ్లపాటు వేచి చూడాలన్న మాట. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడ మే లక్ష్యంగా పనిచేస్తున్నా మంటున్నారు. అప్పటికి వందేళ్ల స్వాతంత్య్ర భారతం అవుతుంది. గత పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశాం అని మోదీ చెప్పారు. అలాగే 80 కోట్ల మందికి ఉచిత రేషన్‌ అం‌దిస్తున్నామని చెప్పారు. నిజానికి అభివృద్ది జరిగివుంటే ఈ దుస్థితి ఎందుకని ప్రశ్నించుకోవాలి.

ప్రజలు తిండిగింజలను కొనుక్కునే పరిస్థితిలో లేరని చెప్పకనే చెప్పారు. పేద మధ్య తరగతి ప్రజలకు సొంతింటి కాల ఎండమావిగా మారింది. ఇల్లు కొనుక్కోగలిగే పరిస్థితులు లేకుండా చేశారు. స్టీల్‌, ‌సిమెంట ఇతర ఇంటి నిర్మాణ ధరలు విపరీతంగా పెరిగాయి. దీనికితోడు వీటిపై 18శాతం జిఎస్టీ వాయింపు ఉండను ఉంది. పేదలు, మహిళలు, యువకులు, రైతులపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పడమే తప్ప క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోవడం లేదు. అంతెందుకు జిఎస్టీ అన్నది ప్రజల రక్తామాంసాలను పీల్చి పిప్పి చేస్తోంది. జిఎస్టీ వసూళ్లు నెలకు లక్షా 40 వేల కోట్ల వసూళ్లను చూసి అభివృద్ది అనుకుంటున్నారు. కానీ అదంతా ప్రజలను జలగల్లా పీల్చి వసూలు చేస్తున్న డబ్బుగా చూడడం లేదు. ప్రజలు స్వచ్చందంగా పన్నులు కట్టలేని దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. బ్యాంక్‌ ‌వడ్డీ రేట్లు దారుణంగా ఉన్నాయి. భూములు, సిమెంట్‌, ‌స్టీలు ధరలను అడ్డం పెట్టుకుని బిల్డర్లు దోపిడీ చేస్తున్నారు. హైదరాబాద్‌ ‌లాంటి నగరంలో కోటిన్నర లేనిదే ఓ అపార్ట్‌మెంట్‌ ‌రావడం లేదంటే ఇది అభివృద్ది అవుతుందా.. లేక సామాన్యులకు ఇల్లు అందుబాటులో లేకపోవడమా అన్నది ఆలోచన చేయాలి. ఇందులో జిఎస్టీ పదినుంచి 12 లక్షలు, రిజస్టేష్రన్‌కు ఓ పదిపదిహేను లక్షలు కట్టాలంటే ఎంత భారం పడుతుందో ప్రభుత్వాలు ఆలోచించడం లేదు.

–ప్రజాతంత్ర బ్యూరో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page