- సమయానికి తీసుకెళ్ళని వరి ధాన్యం లోడ్
- తాలు పేరుతో తరుగు తీస్తున్న వైనం
- వానొస్తే అంతే సంగతులని వాపోతున్న రైతులు
- క్షేత్ర స్థాయిలో నెరవేరలేకపోతున్న సర్కారు హామీలు
తాలు పేరుతో లోడ్కు 5 క్వింటాళ్ళు తరుగు తీస్తున్నరు : తోట సత్తయ్య, రైతు
తాలు ఒక లోడ్కు 5 క్వింటాలు కోత, కల్లం మీదకి వచ్చినంక రైతులను ఇబ్బందులు పట్టద్దని ప్రభుత్వం చెబుతున్నా వీరు మారడం, లేదు. గతంలో కూలీలతో వరిధాన్యం తీసుకుంటు, ఇప్పుడు హార్వెస్టర్లతో చేస్తే తాలు వచేచ అవకాశం లేదు.
సమయానికి ధాన్యం అన్లోడ్ చేయడం లేదు : చింతపూవు తిరుపతి, రైతు
సమయానికి ధాన్యం అన్లోడ్ చేయకుండా ఉద్దేశ్యపూర్వకంగానే మిల్లర్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీంతో ధాన్యం బరువు తగ్గేలా చేస్తున్నారు. తేమ 17 వరకు ఉన్నా తీసుకోవచ్చనే ప్రభుత్వ ఆదేశాలున్నప్పటికీ 12 శాతం తేమ వచ్చినా కాంటా పెట్టుకోవడం లేదు. రైతు కష్టాలను తీర్చేలా అధికారులు మిల్లర్లపై చర్యలు తీసుకోవాలి.
ఇబ్బందులు పెట్టకుండా ఆదేశాలిస్తున్నాం : సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్
రైతులను ఇబ్బందులు పెట్టకుండా ఇప్పటికే ఆదేశాలిచ్చాం. తాలు పట్టే యంత్రాలను సమకూర్చి వాటిద్వారా వందశాతం తాలుకోత కటింగ్ లేకుండా చేస్తున్నాం. రైతులకు అందుబాటులో గోలివాడ, ఆకెనపల్లి, సోమనపల్లి మిల్లులకు ధాన్యం తీసుకునేలా చేశాం.