– బీఆర్ఎస్ నేతలు టిమ్స్ కు కొబ్బరికాయ కొట్టి మరిచిపోయారు
– మీరే కడితే మీరెందుకు రిబ్బన్ కట్ చేయలేదు
* సనత్ నగర్ టిమ్స్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 17 : బీఆర్ఎస్ నాయకులు సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్ కు కేవలం కొబ్బరికాయ కొట్టి మరిచిపోయారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరవాతనే హైదరాబాద్లోని మూడు టిమ్స్ హాస్పిటల్ ల నిర్మాణాలను శరవేగంగా పూర్తి చేశామని వెల్లడించారు. సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, కేటీఆర్ ను టిమ్స్ వద్దకు తీసుకు వచ్చి ఇదంతా మేమే కట్టాం అని గొప్పలు చెప్పుకుంటున్నారని సీఎం రేవంత్ ఎద్దేవా చేశారు. వరంగల్ లోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం కూడా వేగంగా సాగుతోందని, 2027 డిసెంబర్ నాటికి అన్ని ప్రధాన హాస్పిటల్ల నిర్మాణాలను పూర్తి చేసి ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. పేదల ఆరోగ్య పరిరక్షణను తమ బాధ్యతగా భావిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. ప్రజాపాలనలో విద్య, వైద్య రంగాలకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని, రాష్ట్ర విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా లభించే అవకాశాలను అందుకునేలా తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు.
రాష్ట్రంలో వైద్య విప్లవం : ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. సనత్ నగర్ వద్ద 53 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 1,000 పడకల పైగా సామర్థ్యంతో నిర్మించిన టిమ్స్ హాస్పి టల్ను డాక్టర్ మర్రి చెన్నారెడ్డి పేరుతో ప్రారం భించి ప్రజలకు అంకితం చేయడం గొప్ప కార్య క్రమమని ఆయన పేర్కొన్నారు. ఈ హాస్పిటల్ కేవలం ఒక భవనం కాదని, భవిష్యత్తులో లక్షలా ది మంది తెలంగాణ ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించే ఆధునిక వైద్య దేవాలయంగా నిలు స్తుందని భట్టి విక్రమార్క అన్నారు. ప్రజా ప్రభు త్వం 2023లో ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు ప్రభుత్వ దవాఖానలు, వైద్య మౌలిక వసతుల అభివృద్ధికి రూ.8,922 కోట్లు ఖర్చు చేసి, నిధులు విడుదల చేసినట్లు ఆయన చెప్పారు. సనత్ నగర్ టీమ్స్, అల్వాల్ టీమ్స్, ఎల్బీ నగర్ టీమ్స్, ఇతర
ప్రధాన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణాలకు మాత్రమే రెండున్నరేళ్లలో రూ.3,880 కోట్లు విడుదల చేసినట్లు ఆయన వివరించారు. టిమ్స్ సనత్నగర్, టిమ్స్ అల్వాల్, టిమ్స్ ఎల్బీనగర్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, నిమ్స్ విస్తరణ, ఉస్మానియా హాస్పిటల్ నూతన భవన నిర్మాణం వంటి ప్రాజెక్టులకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించి పనులను వేగవంతం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఇవికాక మరో 193 ఆరోగ్య ప్రాజెక్టులకు రూ.3,953 కోట్లు విడుదల చేసినట్లు భట్టి చెప్పారు. ఆస్పత్రుల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసేందు కు అక్టోబర్ నుంచి జూలై వరకు ప్రత్యేకంగా రూ.1,452 కోట్ల యాక్సిలరేటెడ్ పేమెంట్స్ చేసినట్లు వెల్లడించారు. అదనంగా సబ్ సెంటర్ల నిర్మాణానికి మరో రూ.331 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో టిమ్స్ సనత్ నగర్ నిర్మాణానికి కేవలం రూ.70 కోట్లు మాత్రమే ఖర్చు చేసి, మొత్తం నిర్మాణాన్ని తామే చేపట్టినట్లు ప్రచారం చేసుకోవడం సరికాదన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, అందుకే ఈ లెక్కలన్ని చెప్పానని ఆయన వివరించారు. రాష్ట్రంలోని కోటి 15 లక్షల కుటుంబాల్లో 1.06 కోట్ల కుటుంబాలకు సంవత్సరానికి రూ.10 లక్ష ల వరకు వైద్య సాయం అందించే రాజీవ్ ఆరో గ్యశ్రీ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఆరోగ్యశ్రీకి ప్రతి నెలా రూ.100 కోట్లకు పైగా నిధులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. వైద్య మౌలిక వసతులు, ఆస్పత్రుల నిర్మాణం, ఆరోగ్యశ్రీ, ఆస్పత్రులకు అవసరమైన వైద్య పరి కరాల సమకూర్పుపై ప్రభుత్వం సమగ్రంగా దృష్టి సారించిందన్నారు. ఈ ఏడాది అనేక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు భవనాలను పూర్తి చేసి వేలాది పడకలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఉప ముఖ్యమంత్రి ప్రకటించారు. పేదలకు ఆధునిక వైద్య సేవలు అందించడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమన్నారు. కొత్తగా నిర్మిస్తున్న ఆస్పత్రులు పేదలకు ఆధునిక దేవాలయాల్లా ఉపయోగపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి రాజనర్సింహ ప్రత్యేక చొరవతో రాష్ట్ర వైద్యరంగంలో పెద్దఎత్తున మార్పులు తీసు న్న కొస్తున్నారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





