నగరంలో విస్తృతంగా డ్రంకెన్‌ ‌డ్రైవ్‌లు

– తాగి వాహనాలు నడపరాదని పోలీసుల హెచ్చరిక

హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 25: ‌నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో హైదరాబాద్‌ ‌ట్రాఫిక్‌ ‌పోలీసులు ప్రత్యేక తనిఖీలు ప్రారంభించారు. హైదరాబాద్‌ ‌కమిషనరేట్‌ ‌పరిధిలో ప్రత్యేకంగా డ్రంక్‌ అం‌డ్ ‌డ్రైవ్‌ ‌తనిఖీలు చేపట్టారు. బుధవారం ప్రారంభమైన ఈ తనిఖీలు డిసెంబర్‌ 31‌వ తేదీ వరకు కొనసాగనున్నాయి. వరుసగా రెండోరోజూ తనిఖీలు చేపట్టారు. ఓఆర్‌ఆర్‌పైనా తనిఖీలకు సిద్దమయ్యారు. నగరంలో 120 ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు ఉంటాయని హైదరాబాద్‌ ‌కమిషనర్‌ ‌సజ్జనార్‌ ‌తెలిపారు. బుధవారమే డ్రంక్‌ అం‌డ్‌ ‌డ్రైవ్‌ ‌పరీక్షలో 304 మందిని పట్టుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన 304 మంది వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మద్యం మత్తులో వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్‌ ‌హెచ్చరించారు. న్యూ ఇయర్‌ ‌వేడుకల నేపథ్యంలో నగర వాసులకు పలు సూచనలు చేశారు. డ్రంక్‌ అం‌డ్‌ ‌డ్రైవ్‌లో పట్టుబడితే వాహనాలను సీజ్‌ ‌చేయడమే కాకుండా, పది వేల రూపాయల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు. న్యూ ఇయర్‌ ‌సెలబ్రేషన్స్ ‌కోసం పబ్‌లకు వెళ్లే వారు తమ డ్రైవర్లను వెంట తీసుకెళ్లాలని కమిషనర్‌ ‌తెలిపారు. లేదంటే క్యాబ్‌ ‌బుక్‌ ‌చేసుకుని ప్రయాణించాలని సూచించారు. సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా సెలబ్రేషన్స్ ‌చేసుకోవాలని పేర్కొన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page