మూడు పార్టీలది తెలంగాణను ముంచే ఎజెండా
ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్,ప్రజాతంత్ర,ఏప్రిల్
మజ్లిస్ పార్టీ,రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన స్వాతంత్య్ర సమరయోధులు, ఉద్యమకారుల వారసత్వాన్ని బీజేపీ కొనసాగిస్తోందని గుర్తు చేశారు. మజ్లిస్ పాత బస్తీకే మాత్రమే పరిమితం కాలేదని.. ఆ పార్టీ ప్రస్తుతం తెలంగాణలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో చాప కింద నీరులా విస్తరిస్తోందంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మజ్లిస్ పార్టీకి విజయాన్ని కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ మూడు పార్టీలు ఒకే తానుముక్కలుగా కలిసి పని చేస్తున్నాయన్నారు. ఈ ఎన్నికల్లో మజ్లిస్ను గెలిపించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు.
తెలంగాణ ప్రజలు చైతన్యంగా ఆలోచించక పోతే,మళ్లీ రజాకార్ల పాలన లాంటి పరిస్థితులు దాపురించే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మజ్లిస్ పార్టీ నాయకులు.. పాత బస్తీలోని హిందువుల ఇళ్లను స్వాధీనం చేసుకుని ప్రజలను ఖాలీ చేయించిన ఘటనలు చాలానే ఉన్నాయన్నారు. తెలంగాణను, హైదరాబాద్ను బలి చేసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వెనుకాడడం లేదన్నారు. ప్రజలను జాగృతం చేయాలనే పవిత్ర ఉద్దేశంతోనే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తోందని చెప్పారు. మాకు గెలుపు ఒక్కటే ముఖ్యం కాదని.. హైదరాబాద్ను రక్షించడం కూడా ప్రధాన లక్ష్యమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
మజ్లిస్ పార్టీ మతోన్మాదం, గూండాయిజాన్ని ఎదుర్కొంటూ బీజేపీ ధర్మయుద్ధం చేస్తోందన్నారు. బీఆర్ఎస్ హయాంలో హైటెక్ సిటీలో రంగులు వేసి అభివృద్ధి అంటూ ప్రచారం చేశారు. కానీ అభివృద్ధి పేరు చెప్పి ఎక్కడైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎక్కువ ఉందో అక్కడే పనులు జరిగాయని ఆరోపించారు. ఇరుకై•న రోడ్లు సైతం నిర్మించారన్నారు. జీహెచ్ఎంసీ స్థితి దారుణంగా మారిందని.. వీధిలైట్లు కొనడానికి డబ్బుల్లేని స్థితికి దిగజారి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పనితీరు అసమర్థంగా ఉందని.. పౌర సేవల మెరుగుదలకు నిధులు సైతం పెరగడం లేదన్నారు. మజ్లిస్ పార్టీ నుంచి నగరాన్ని రక్షించాలంటే.. చైతన్యంతో వోటు వేయాలని ప్రజలకు ఆయన సూచించారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వచ్చినపుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ నాయకులు విదేశీ పెట్టుబడుల గురించి చెబుతున్నారు..కానీ అవి ఎక్కడికి వెళ్లాయని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం వొచ్చిన తర్వాత ఆర్థిక, పన్నుల సంస్కరణలు ఉగ్రవాదం, మతోన్మాదాన్ని అరికట్టడంతోపాటు సమర్థవంతమైన విదేశాంగ విధానం.. ఇలా అన్నింటిలో ప్రగతి కనిపిస్తోందని చెప్పారు. గతంలో విద్యుత్ కోసం రైతులు మోటార్ల దగ్గర నిద్రించాల్సి వచ్చేదని..మోదీ పాలనలో విద్యుత్ కోతల్లేని దేశంగా మారిందన్నారు. సనత్ నగర్,మల్కాజ్గిరి,దిల్సుఖ్