పోటీపోటీగా సెప్టెంబర్ పదిహేడు
ప్రతీఏటా సెప్టెంబర్ పదిహేడు వొస్తుందంటేనే తెలంగాణలో రాజకీయ రణరంగం మొదలవుతుంది. ఈసారి మరో రెండుమూడు నెలల్లో రాష్ట్ర శాసనసభ ఎన్నికలు రాబోతుండడంతో దాన్ని రాజకీయంగా సద్వినియోగం చేసుకునేందుకు పార్టీలు మాయత్తమవుతున్నాయి. నిజామ్ తన నిరంకుశ ప్రభుత్వాన్ని వొదులుకుని భారత్ యూనియన్లో కలిపిన రోజుగా తెలంగాణ ప్రజలకు అత్యంత ప్రాధాన్యమైన ఈ రోజు పట్ల గత సీమాంధ్ర…
