Category తెలంగాణ

తీరని వేదన మిగిల్చిన బలిమెల ఘటన

– ఘటనలో అమరులైన పోలీస్ కుటుంబీకులకు ఇళ్ల స్థల పట్టాలు – అందజేసిన డిజిపి శివధర్ రెడ్డి హైదారాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 17: బలిమెల రిజర్వాయర్ లో మావోయిస్టులు దాడి చేసి 38మందిని హత్య చేసిన ఆనాటి దారుణ మారణకాండ పోలీస్ యంత్రాంగానికి తీరని వేదనను మిగిల్చిందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి.శివధర్ రెడ్డి…

ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి ఓంకార్

– ప్రజా ఉద్యమాల్లో ఆరితేరారు – ఓంకార్ శతజయంతి కార్యక్రమంలో మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 17: నిరంతరం ప్రజల కోసం పరితపించిన ఓంకార్ లేని లోటు నర్సంపేటకే కాదు.. యావత్ తెలంగాణకు తీరని లోటు అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. ఓంకార్ లాగే తాను కూడా తుపాకీ…

రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయానికి బాటలు

– 61 వేల మంది రైతులకు ఫార్మర్ కిట్ల పంపిణీ ప్రారంభం – ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని రైతులకు పిలుపు – 20 నుండి 22 వరకు రైతు మహోత్సవం : మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 17: జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్‌లో భాగంగా రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం…

మజ్లిస్ ‘వందేమాతరం’ ఉల్లంఘనపై చర్యలేవి?

– మీరు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారనేది మ‌రిచారా? – స్పీకర్‌ను ప్రశ్నించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 17: పవిత్రమైన అసెంబ్లీ వేదికగా మజ్లిస్ నేతలు వందేమాతరం గేయాన్ని అవమానిస్తే స్పీకర్ ప్రేక్షక పాత్ర వహించడాన్ని కేంద్ర హోం శాఖ‌ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆక్షేపించారు. వందేమాతరం గేయం…

పెచ్చుమీరుతున్న రాజకీయ దాడులు

– పోలీసుల పక్షపాత వైఖరి – డీజీపీకి బీజేపీ బృందం ఫిర్యాదు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 17: రాష్ట్రంలో పెచ్చుమీరుతున్న రాజకీయ దాడులతోపాటు పోలీసుల పక్షపాత వైఖరిపై డీజీపీకి బీజేపీ బృందం ఫిర్యాదు చేసింది. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు నేతృత్వంలోని పార్టీ ప్రతినిధుల బృందం రాష్ట్ర డీజీపీ బి.శివధర్‌రెడ్డిని మంగళవారం కలిసి వినతిపత్రం సమర్పించింది.…

20న ఫార్మసిస్ట్ పోస్టులకు జాబ్ మేళా

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 17 : ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయిమెంట్ బ్యూరో ఆధ్వర్యంలో అపోలో ఫార్మసీ ఈ నెల 20న ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న ఎంప్లాయిమెంట్ బ్యూరో కార్యాలయంలో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నారు. అపోలో ఫార్మసీలోని ఫార్మసిస్టు, అసిస్టెంట్ ఫార్మసిస్టులకు చెందిన…

అబద్దాలు, సెటైర్లు వేయడం మానుకో

  – మహిళలకు ఎవరేం చేశారో వారినే అడుగుదాం – అసెంబ్లీలో కేటీఆర్‌కు కౌంటర్‌ ఇచ్చిన మంత్రి సీతక్క హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి17: మహిళలంటే మాజీ మంత్రి కేటీఆర్‌కు చిన్నచూపని మంత్రి సీతక్క అన్నారు. తెలంగాణ శాసనసభలో గవర్నర్‌ ‌ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ  సందర్భంగా కేటీఆర్‌పై మంత్రి సీతక్క విరుచుకుపడ్డారు. కుటుంబ సభ్యులైనా, బయట మహిళలనైనా…

టీపీసీసీ సమన్వయ కమిటీ ఏర్పాటు

Gandhi Bhavan

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 17: రాష్ట్రంలో పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం కోసం టీపీసీసీ సమన్వయ కమిటీని ఏఐసీసీ నియమించింది. ఎనిమిదిమందితో కూడిన కమిటీని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ ప్రకటించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్…

నందిని సిధారెడ్డికి సీఎం అభినందనలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 17: ప్రముఖ కవి, రచయిత నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం-2025 లభించడంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిధారెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. కరోనా మహమ్మారి కాలంలో మానవాళి ఎదుర్కొన్న సంక్షోభాలను, మానవ సంబంధాల విచ్ఛిన్నతలను అనిమేష అనే కవితా సంపుటిలో హృద్యంగా తెలియజేసిన…