Category తెలంగాణ

సమగ్ర సంక్షేమ బడ్జెట్‌

– మంత్రి సీతక్క హర్షం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20: ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ ప్రజల అవసరాలను అర్థం చేసుకుని రూపొందించిన సమగ్ర సంక్షేమ బడ్జెట్‌గా నిలిచిందని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే దిశగా కీలకంగా ఉంటుందని…

శాసనసభ సోమవారానికి వాయిదా

– బడ్జెట్ ప్రసంగాన్ని బహిష్కరించిన బీఆర్ఎస్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20: తెలంగాణ శాసనసభ సోమవారానికి వాయిదా పడింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సభలో శుక్రవారం ప్రవేశపెట్టారు. రూ.3,24,234 కోట్ల భారీ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బ్జడెట్ ప్రసంగం పూర్తి అయిన అనంతరం…

బాకీ కార్డులతో గన్‌పార్కు వద్ద బీఆర్ఎస్ నిరసన

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20: కాంగ్రెస్ ప్రభుత్వ హామీల వైఫల్యంపై గన్ పార్క్ వద్ద భారత రాష్ట్ర సమితి (బీఆరఎస్) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు ప్లకార్డులతో శుక్రవారం నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ఇచ్చిన బాకీ కార్డులు ప్రదర్శిస్తూ ప్రజలను మోసం చేసిన విధానాన్ని…

సైన్యంలో నియామకానికి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

– దరఖాస్తుల సమర్పణ చివరి తేదీ ఏప్రిల్ 1 హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20: భారత సైన్యంలో వివిధ కేటగిరీల్లో నియామకానికి సంబంధించి అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించడానికి ఆన్‌లైన్ నమోదు, దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అగ్నివీర్ కేటగిరీల్లో అవివాహిత యువత కోసం నియామక నోటిఫికేషన్ 13 ఫిబ్రవరి 2026న www.joinindianarmy.nic.in వెబ్‌సైట్‌లో విడుదలైంది. సికింద్రాబాద్…

బ్రాహ్మణ పరిషత్‌కు కార్యవర్గం నియమించాలి

– మంత్రి శ్రీధర్‌బాబుకు బ్రాహ్మణ ప్రతినిధుల విన్నపం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 18: తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తుకు చైర్మన్, సభ్యులను నియమించడంతోపాటు నిధులు కేటాయించాలని బ్రాహ్మణ ఆర్గనైజేషన్స్ ఫర్ సోషల్ సర్వీస్(బాస్) ప్రతినిధులు బుధవారం ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధs బాబును కలిసి వినతి పత్రం సమర్పించారు. ‘బాస’ చీఫ్ కో ఆర్డినేటర్…

బురద చల్లడం ఆపాలి

– బీఆర్‌ఎస్‌కు మంత్రి శ్రీధర్‌బాబు హితవు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 18: మేం బురద చల్లుతాం.. మీరు తుడుచుకోండి అన్నట్టుగా మొదటి నుంచీ బీఆర్‌ఎస్ వైఖరి ఉంటోందని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అసహనం వ్యక్తం చేశారు. శాసనసభ ప్రశ్రోత్తరాల సమయంలో బుధవారం కేటీఆర్ చేసిన ఆరోపణలపై ఆయన తీవ్రంగా స్పందించారు. మూసీ పునరుజ్జీవన…

యూరియా యాప్‌తో రైతులకు నానా యాతన

– అసెంబ్లీలో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వేముల హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 18: కాంగ్రెస్‌ ‌సర్కారు యూరియా యాప్‌ ‌పేరుతో రైతులను వేధిస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను వివరించారు. రాష్ట్రంలో 50 శాతం మంది రైతుల దగ్గర స్మార్ట్‌ఫోన్‌లు…

ఎస్సీ ,ఎస్టీల బడ్జెట్ కేటాయింపులపై చర్చించాలి

– ఎస్సీ, ఎస్టీ ప్రజా సంఘాల జేఏసీ హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 18: ఎస్సీ, ఎస్టీల సంక్షేమ అభివృద్ధి రక్షణల పై అసెంబ్లీ చర్చించాలని ఎస్సీ ఎస్టీ ప్రజాసంఘాల జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  జేఏసీ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ అధ్యక్షతన బుధవారం ధర్నా…

పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌

– అధికారులు అప్ర‌మ‌త్తంగా వుండాలి – కొత్త స‌బ్‌స్టేష‌న్లు, ట్రాన్స్ ఫార్మ‌ర్ల ఏర్పాటు – ఉప‌ ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 18: యాసంగి పంటల సీజన్‌తో పాటు వేసవి ప్రభావం కారణంగా రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్వి, నియోగం గణనీయంగా పెరుగుతుంది. 19 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్‌నూ సమర్థంగా తట్టుకునే…