Category తెలంగాణ

పోలీసులు నిజాయతీగా పనిచేయాలి

– పీడించే వారిని ప్రజలు ఉపేక్షించరు – పర్యవేక్షణ అధికారులు ఖ‌చ్చితంగా పనిచేయాలి – ఎస్.ఐని అరెస్టు చేసిన‌ ఏసీబీ పనితీరు భేష్ : డీజీపీ  హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 19: మెదక్ జిల్లాలోని టేక్మల్ సబ్-ఇన్స్పెక్టర్ను అవినీతి ఆరోపణలపై పకడ్బందీగా అరెస్టు చేసిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ను డైరెక్టర్ జనరల్ ఆఫ్…

ప్రభుత్వ హాస్పిటళ్లలో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు

– జెరియాట్రిక్ సేవలు విస్తరించాలి – అనారోగ్యంతో వున్న వృద్ధుల జాబితా సిద్ధం చేసుకోండి – మంత్రి దామోదర రాజనరసింహ – డీఎంహెచ్‌వోలు, సూపరింటెండెంట్లతో సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 19: దేశంలో, రాష్ట్రంలో పెరుగుతున్న వృద్ధుల జనాభాకు అనుగుణంగా వారికి అవసరమైన వైద్య సేవలను కూడా విస్తరిస్తున్నామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ…

వ్యక్తిత్వ వికాసానికి పుస్తకాలు దోహదం

– కేయూ గ్రంథాలయ శాస్త్ర అధ్యాపకుడు కృష్ణమాచార్య – కిట్స్‌ వరంగల్‌ కేంద్ర గ్రంధాలయంలో పుస్తక ప్రదర్శన వరంగల్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 19: మనిషి వ్యక్తిత్వ వికాసానికి, ఆలోచనలకు, భవిష్యత్‌ దిశా నిర్దేశానికి పుస్తకాలు బాటలు వేస్తాయని కాకతీయ యూనివర్సిటీ గ్రంథాలయ శాస్త్ర అధ్యాపకుడు వేదాంతం కృష్ణమాచార్య తెలిపారు. చదవాలనే అలవాటు మరింతగా అభివృద్ధి చేసుకోవటం…

మదీనా చేరుకున్న మంత్రి అజారుద్దీన్‌ బృందం

– బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు అండ – సహాయక చర్యలను సమన్వయం చేస్తున్న మంత్రి మదీనా/న్యూదిల్లీ, నవంబర్‌ 19: సౌదీ అరేబియాలో ఇటీవల జరిగిన బస్సు ప్రమాదంపై వివరాలు తెలుసుకునేందుకు బాధితులకు బాసటగా ఉండేందుకు రాష్ట్ర మైనారిటీ సంక్షేమం, పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ మంత్రి మొహమ్మద్‌ అజారుద్దీన్‌ సోమవారం రాత్రి మదీనా చేరుకున్నారు. అక్కడ సహాయక…

యాదగిరిగుట్ట ఆలయంలో స్వాతి నక్షత్ర వేడుకలు

– గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, నవంబర్‌ 19 :యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం స్వామివారి జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకుని భక్తులు వేకువ జామునే గిరి ప్రదక్షిణ చేసి మొక్కులు చెల్లించుకున్నారు. స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం కవచమూర్తుల అష్టోత్తర శతకటాభిషేకం పూజలు నిర్వహించారు.…

ఉప్పల్‌-నారపల్లి కారిడార్‌ వచ్చే దసరాకు పూర్తి

– ఆ మార్గంలో ఇప్పటికే బీటీ రోడ్డు పనులు మొదలయ్యాయి – మేడారం జాతర నాటికి నాణ్యమైన బీటీ రోడ్డు పూర్తి చేస్తాం – మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 19: ఉప్పల్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌కు సంబంధించి ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులకు, ప్రయాణికులకు రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి…

ఈ నెల 22న జాబ్‌ మేళా

– బీటెక్‌, డిప్లమా మెకానికల్‌ & డీజిల్‌ మెకానికల్‌ ఐటిఐతో భర్తీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 19 : ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయ్‌మెంట్‌ బ్యూరో ఆధ్వర్యంలో మిత్రా ఏరిన ఆటోమొబైల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఈ నెల 22వ తేదీ ఉదయం 11 గంటలకు జాబ్‌ మేళా నిర్వహించనున్నది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కాలేజీ ఎదురుగా ఉన్న…

మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే నవీన్‌ కృతజ్ఞతలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 19: జూబ్లీహిల్స్‌ నియోజవర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ విజయసాధనకు విశేష కృషి చేసిన రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే నవీన్‌ యాదవ్‌ రాష్ట్ర సచివాలయంలో బుధవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆయనను జ్ఞాపిక, శాలువాతో సత్కరించారు. రహ్మత్‌ నగర్‌, బోరబండ డివిజన్‌లకు…

వయోవృద్ధులను వేధిస్తే కఠిన చర్యలు

– హన్మకొండ డిస్ట్రిక్ట్‌ జడ్జి డాక్టర్‌ పట్టాభి రామారావు హన్మకొండ, ప్రజాతంత్ర, నవంబర్‌ 19: ట్రిబ్యునల్‌ బెంచ్‌ సీనియర్‌ సిటిజన్స్‌కు వరం అని, వారికి ఏ సమస్య వచ్చినా ట్రిబ్యునల్‌ బెంచ్‌కు ఫిర్యాదు చేయవచ్చని హన్మకొండ జిల్లా జడ్జి డాక్టర్‌ కె.పట్టాభిరామా రావు తెలిపారు, డిస్ట్రిక్ట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అధారిటీ హన్మకొండ ఆధ్వర్యంలో డాక్టర్‌ అనితా…