Category ప్రత్యేక వ్యాసాలు

కఠోర నియమాలు… రంజాన్ దీక్షలు

“పరమ పవిత్రంగా ప్రత్యేక ప్రార్థనలతో, ఉపవాస దీక్ష కంకణులైన ధార్మికులు, భక్తి శ్రద్ధలతో అన్ని అలవాట్లకు దూరంగా ఉంటూ, నెల రోజులు దీక్షలో నిమగ్నమై ఉంటారు. “రంజాన్” పండగ పేరు కాదు. నెల పేరు. “రంజ్” అనగా కాలుట (జ్వలించుట) ఉపవాసము చేయుటచే, మను షులుచేయు పాపమును కాలి పోవునని భావము. నెల అంతయు, ఉదయం…

భక్తుల కోరికలు నెరవేర్చే యాదగిరి లక్ష్మీ నరసింహుడు

“ప్రహ్లాదుని రక్షించటానికి, అహోబిలంలో నరసింహస్వామి స్తంభాన్ని చీల్చుకుని వచ్చి హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత ఆ భీకర రూపాన్ని శాంత పరచటం ఎవరికీ సాధ్యం కాలేదట. అప్పుడు దేవతలంతా లక్ష్మీదేవిని ప్రార్ధిస్తే ఆమె ప్రత్యక్షమై స్వామిని శాంతింప చేసిందట. అప్పుడు ప్రహ్లాదుడు స్వామిని అక్కడే ప్రసన్న రూపంలో కొలువై ఉండమని కోరాడట. అయితే స్వామి అతి భీకర…

నెహ్రూ సెక్యులరిస్టే..

“పాకిస్థాన్ లో వలె మన రాజ్యాంగంలో మతచట్టాలు లేవు. మనది మతాతీత రాజ్యాంగం.ఆర్టికల్ 25 మన రాజ్యాంగ లౌకిక లక్షణాన్ని ప్రతిబింబిస్తుంది.ఆర్టికల్ 26,27,28 చెప్పే విషయాలను గమనించినా మన రాజ్యాంగం ఒక మతానికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వలేదని స్పష్టమవుతుంది. ప్రభుత్వ వ్యవహారాలలో మతం తాలూకు జోక్యాన్ని మన రాజ్యాంగం అనుమతించదు. కానీ దుగ్గరాజు వారి కళ్ళకు…

తెలంగాణ సమస్య ‘పరిష్కారానికి’ ఇందిరాగాంధీ రూపొందించిన అష్టసూత్ర పధకం

“పార్లమెంట్ లో ప్రకటించారు కనుక ఈ ఇది అమలు చేసే పథకం అన్నారు. మళ్లీ తెలంగాణ జనం నమ్మింది. అందులో మళ్లీ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. దానికి సాక్షి – పార్లమెంట్, పెద్దమనుషుల ఒప్పందపు సంతకాలు. పెద్దమనుషుల ఒప్పందం అంటే కోర్టుకు లో పరిష్కారం అడగకుండా, రాజకీయంగా, రెండు ప్రాంతాలలో సమ అభివృద్ధి సాధిస్తారనే…

రావ్‌బహాదూర్ నాగూ సయాజీ

ఇరుగు పొరుగు బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలసవెళ్ళి, పట్టుదలతో, అకుంఠిత పరిశ్రమతో, అంకితభావంతో అంచె లంచెలుగా జీవితంలో ఎదిగి ముందు తరాలకు ఆదర్శంగా నిలిచిపోయిన మహనీయులెందరో మనకు చరిత్రలో కనిపిస్తారు. అలాంటి వారిలో ‘రావ్‌బహాదూర్ నాగూ సయాజీ’  ముందు శ్రేణిలో నిలుస్తారు. తెలంగాణ ప్రాంతానికి, ముంబై నగరానికి అవినాభావ సంబంధం ఉంది. మూడు వందల యాభై…

తెలంగాణ ఉద్యమ శిఖరం..

“కేసిఆర్ జీవితం ఒక పోరాటం. అనేక మహా మహులు, రాజకీయ ఉద్దండులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పనిచేశారు. ఆ క్రమంలో ఒక్కొక్కరు ఒక్కో స్థాయిలో ఉద్యమాన్ని నడిపించే క్రమంలో నిష్క్రమించారు. కొందరు స్వప్రయోజనాల దృష్ట, మరికొందరు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్యమాన్ని నీరుగార్చిన సందర్భాలు అనేకం. ఆనాడు తెలుగుదేశం, కాంగ్రెస్ బలమైన…

దురంధరుడు ..!

“60 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ఉద్యమ చరిత్రలో కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రస్థానం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. తెలంగాణ చచ్చిపో లేదని, తెలంగాణ ప్రజలు చేతులు ముడుచుకుని, చేష్టలుడిగి, చైతన్యరహితులై కూర్చోలేదని తెలంగాణా రాష్ట్ర ఉద్యమం ఒక మహా అగ్ని పర్వతం అని అది ఎప్పుడు బద్దలైన ఆంధ్ర పాలకవర్గ పాలన అంతం తప్పదని గర్జించిన…

జీ హెచ్ ఎమ్ సీ… మూడు ముక్కలాట …?

“నేడు, తెలంగాణ ప్రభుత్వం అదే “మెరుగైన పరిపాలన ” సాకుతో  జీ హెచ్ ఎమ్ సీ   ని మూడు కార్పొరేషన్లుగా (హైదరాబాద్, సైబరాబాద్, మరియు మల్కాజిగిరి) విభజించడానికి ప్రయత్నిస్తోంది. వికేంద్రీకరణ అనేది ఒక గ్లోబల్ హబ్‌కు అవసరమైన సాంకేతిక చర్య అని మద్దతుదారులు వాదిస్తుంటే, విమర్శకులు మాత్రం ఇది కొత్త పేరుతో దక్కన్ ప్రాంతానికి తిరిగి వచ్చిన…

వియత్నాం నుంచి తిరుగు ప్రయాణం

“ఇలాంటి గెరిల్లా యుద్ధ పద్ధతులు అక్కడ చాలా ఉన్నాయి. అందువల్లనే అమెరికా సైనికులు భారీగా మరణించారు. ఫలితంగా అమెరికా లాంటి అగ్రరాజ్యం యుద్ధం విరమించినట్లు ప్రకటించింది. అప్పటినుంచి ఉండిపోయిన అమెరికన్లు, ఆ ప్రదేశంలో జరుగుతున్నంత సేపు వియత్నా మీస్ యుద్ధ నైపుణ్యానికి ఆశ్చర్య పోయాను. పలు యుద్ధాలను ఎదుర్కొని 1975లో స్వతంత్రాన్ని పొందిన వియత్నాం అతి కొద్ది సమయంలోనే వాళ్ళు సాధించిన సాంకేతిక, సామాజిక, ఆర్థికాభివృద్ధికి ఫిదా అయ్యాను. శ్రమపట్ల వాళ్ళకున్న గౌరవం, క్రమశిక్షణ, కష్టపడి పనిచేసే తత్వం వాళ్ళను ఈనాడు ముందంజలో ఉంచింది. ప్రస్తుతం అమెరికా వియత్నాం మిత్రదేశాలు.” గిరియానం – 1 హోచిమన్ నగరం వియత్నాం దేశానికి రాజధాని. దక్షిణ వియత్నాంలో ఉంది. వాతావరణం వెచ్చగా ఉంటుంది. పూర్వం ఈ నగరాన్ని సైగాన్ అని పిలిచేవాళ్ళు. సైగాన్ నదీ తీరంలో ఉండడం వల్ల ఆ పేరు వచ్చి ఉంటుంది. తరువాత కమ్యూనిష్టు నాయకుడు హోచిమన్ మీద గౌరవంతో ఆ పేరు స్థిరపడింది. ఈ నగర జనాభా 14 మిలియన్లు. ఆర్థిక, సాంస్కృతిక కేంద్రం. హోచిమన్ అసలు పేరు న్గుయెన్ సీన్ కుంగ్. మే 19 తేదీన 1890 సంవత్సరంలో జన్మించాడు. సుమారు ఇరవై యేళ్ళ వయసులో దేశం విడిచిపెట్టి వెళ్ళి ‘ వియత్ మిన్ ‘ అనే సంస్థను స్థాపిం చాడు. ఫ్రాన్స్ , అమెరికా యుద్ధాలలో వియత్నాం విముక్తి కొరకు గెరిల్లా యుద్ధ పద్ధతుల్లో పోరాటం చేసాడు. ఉత్తర వియత్నాం, దక్షిణ వియత్నాం అని రెండు భాగాలుగా ఉన్న వియత్నాంను ఏకం చేయాలని ఆయన ఆశయం. 1945 నుంచి 1969 దాకా ఉత్తర వియత్నాం అధ్యక్షుడుగా పనిచేసాడు. 1969లో మరణించాడు. ఆయన మరణించిన తర్వాతనే ఉత్తర దక్షిణ వియత్నాంలు 1975లో ఒకే దేశంగా రూపొందింది. ఈ విషయాలు గైడ్ చెర్రీ చెపుతున్నప్పుడు నాకు ప్రొ. జయశంకర్ గుర్తుకు వచ్చాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కొరకు కలగన్న ఆయన మరణించిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. తొమ్మిది మంది బృందంలో నేను, పద్మ, అనురాధ వియత్నాం వార్ మ్యూజియం చూడడానికి వెళ్ళాం. ఈ మ్యూజియం ను 1975 లో ప్రారంభించారు. ఇది అమెరికా వియత్నాం యుద్ధానికి సజీవ సాక్ష్యం. బయటి ప్రాంగణంలో ఆ యుద్ధంలో ఉపయోగించిన ట్యాంకర్లు, విమానాలు ఉన్నాయి. వార్ మ్యూజియం…