Category ఎడిటోరియల్

పాఠం నేర్పుతున్న మును ‘గోడు’

గత నెల రోజులుగా మునుగోడు లో జరుగుతున్న ప్రచార పర్వం మరికొద్ది గంటల్లో ముగియనుంది. మంగళవారం సాయంత్రం అయిదు గంటల్లోగా ఎంత వీలైతే అంత మంది వోటర్లను స్వయంగ కలుసుకునేందుకు రాజకీయ పార్టీలన్నీ పరుగులు పెడుతున్నాయి. ఏ పార్టీ ఎంత మందిని ప్రభావితం చేయగలిగింది, దానివల్ల ఎవరు లాభపడేది, ఏ పార్టీ ఏ మేరకు నష్టపోయేదన్న…

నిన్నటి వరకు చూసింది ట్రైలరే…

నిన్నటివరకు దేశం మొత్తం చూసింది ట్రైలరే.. ఇంకా చూడాల్సింది చాలా ఉందంటూ కెసిఆర్‌ ‌చెప్పిన దాన్నిబట్టి ఎంఎల్‌ఏల ఎర ఎపిసోడ్‌ అం‌తా వాస్తవమేనన్నది స్పష్టమవుతున్నది. గత మూడు రోజులుగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అనేక చర్చోపచర్చలు జరుగుతున్న విషయం తెలియందికాదు. ఇందులో వాస్తవంలేదని, అంతా కల్పనేనంటూ బిజెపితో పాటు టిఆర్‌ఎస్‌ను వ్యతిరేకిస్తున్న వర్గాలు…

మునుగోడులో మొయినాబాద్‌ ‌ప్రభావం

మొయినాబాద్‌ ‌ఘటన మునుగోడుపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నదే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల కింది వరకు దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఈ ఉప ఎన్నికలో గెలుపు తమదేనంటే తమదని ధీమాను వ్యక్తం చేస్తూ వొచ్చాయి. అయితే మొయినాబాద్‌ ‌సంఘటన ఒక్కసారే అన్ని పార్టీలను కుదిపేసింది. ఈ ఘటన ఆయా…

కోర్టుకు చేరిన మోయినాబాద్‌ ‌ఘటన

మోయినాబాద్‌ ‌ఫామ్‌ ‌హౌజ్‌లో టిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏల కొనుగోలు అంశం చేరాల్సిన చోటికే చేరింది. ఈ అంశంలో వాస్తవం ఏమిటో నిగ్గు తేల్చాల్సిందిగా భారతీయ జనాపార్టీ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఈ అంశం బుధవారం సాయంత్రానికి మరో మలుపు తిరిగినట్లు అయింది. ఫామ్‌ ‌హౌజ్‌లో జరిగిన సంఘటనగా గత రెండు రోజులుగా ఎలక్ట్రానిక్‌, ‌ప్రింట్‌ ‌మీడియాల్లో వొస్తున్న…

భారత్‌ ‌జోడో యాత్రకు తెలంగాణ ‘ప్రజాతంత్ర’ స్వాగతం…!

ఈ నెల 23, ఆదివారం పొద్దున్న కృష్ణా నది వంతెనపై పొరుగు రాష్ట్రం కర్నాటక నుంచి తెలంగాణలో అడుగు పెట్టిన రాహుల్‌ ‌గాంధీ భారత్‌ ‌జోడో యాత్ర మూడు రోజుల విరామం తరువాత ఈ రోజు తిరిగి ఉమ్మడి మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లా మఖ్తల్‌ ‌నుంచి ప్రారంభమవుతున్న సందర్భంగా తెలంగాణ సమాజం యాత్రకు స్వాగతం పలుకుతుంది.…

మూడు పార్టీలకు ముఖ్యం…‘మునుగోడు’

మునుగోడు భవితవ్యం మరో పది రోజుల్లో తేలనుంది. ఈ నియోజకవర్గంలోని దాదాపు రెండున్నర లక్షల మంది వోటర్లు ఎవరికి పట్టం కట్టబోతున్నారన్నది వొచ్చే నెల మూడవ తేదీన తేలనుంది. ఇక్కడ నలభై ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ పోటీ మాత్రం ప్రధానంగా మూడు పార్టీల మధ్యే కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలోని వోటర్లలో…

మునుగోడులో మారుతున్న సమీకరణాలు ..

మరో పదిరోజుల్లో జరుగనున్న మునుగోడు ఉప ఎన్నికల్లో సమీకరణాలు,విజయావకాశాలు రోజు రోజు కు మారుతున్నాయి.. కాంగ్రెస్‌ ‌పార్టీకి చెందిన సీనియర్‌ ‌నాయకుడు వెలిబుచ్చిన అభిప్రాయం నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న మునుగోడు ఎన్నిక సందర్భంగా ఆ పార్టీకి గొడ్డలి పెట్టుగా మారింది. రోగి చనిపోయేవరకు ఏం ఫరవాలేదని డాక్టర్లు ధైర్యం చెబుతారు. అలాగే ఏ రాజకీయ…

తెలంగాణ వ్యవసాయ పథకాల అమలుకు పెరుగుతున్న డిమాండ్‌

‌తెలంగాణలో అమలవుతున్న పథకాలపై ప్రతిపక్ష పార్టీల్లో అభిప్రాయభేదాలున్నప్పటికీ పక్క రాష్ట్ర ప్రజల్లో మాత్రం క్రమేణ ఆ పథకాలపైన మోజు పెరుగుతున్నట్లు స్పష్టమవుతున్నది. ఆ పథకాలను తమ రాష్ట్రంలోకూడా అమలు చేయాలని కొన్ని రాష్ట్రాల్లోని ప్రజలు కోరుతున్నారు. కాని పక్షంలో తమ ప్రాంతాలను తెలంగాణలో కలపాలన్న డిమాండ్‌ ‌కూడా చేస్తున్నారు. తాజాగా ఒడిశాలో ఇలాంటి డిమాండ్‌ ‌మొదలైంది.…

కోట్ల రూపాయలు మంచినీళ్ళ ప్రాయం

గెలుపే ధ్యేయం..అందుకు ఎంతవరకైనా సరే.. ఇది నేటి పోలిటికల్‌ ‌పార్టీల తీరు. వోటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఈ కాలంలో రాజకీయ పార్టీలు ఎంతకైనా దిగజారడానికి సిద్దపడుతున్నాయి. ఎన్నికలంటే ప్రజాస్వామ్యాన్ని ప్రతిబింబించే ఒక పక్రియ. ఎవరు పాలనకు అర్హున్నది వోటర్లే నిర్ణయిస్తారు. అలాంటి వోటు హక్కు నేడు అపహాస్యం పాలవుతున్నది. పవిత్రమైన వోటు హక్కు ప్రలోభాలపాలవుతున్నది. దీంతో…