Category ఎడిటోరియల్

పోడు గర్జనకు సిద్ధమవుతున్న ఆదివాసీలు

గిరిజన, ఆదివాసీలకు పోలీసు, ఫారెస్టు అధికారులమధ్య పోడుపై జరుగుతున్న యుద్ధ వాతావరణాన్ని మరింత ఉధృతం చేసేందుకు ‘ఆదివాసీ గిరిజన సంఘాల పోడు గర్జన’ పేర తమ హక్కుల సాధనకు మరింతగా ఉద్యమించాలని వారు నిర్ణయం తీసుకున్నారు. వార్తల్లో నేడు వివాదగ్రస్తమై ప్రధాన చర్చనీయాంశంగా మారిన మంచిర్యాల జిల్లా కోయపోషగూడెం నుండి ఈ నెల పదవ తేదీన…

మొన్న తీర్మానించింది.. నిన్న యాక్షన్‌ ‌చేపట్టింది

దక్షిణాది రాష్ట్రాలన్ని తమ ఆధిపత్యం కిందకు వొచ్చేలా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని నిన్నగాక మొన్న తీర్మానించిన భారతీయ జనతాపార్టీ కేంద్ర కమిటి అందుకు అనుగుణంగా నిన్నటినుండే పావులు కదపడం ప్రారంభించిందనడానికి రాజ్యసభకు ఎంపిక చేసిన అభ్యర్థుల తీరే చెబుతున్నది. ఉత్తర, ఈశాన్య, పశ్చిమ రాష్ట్ల్రా ఒక వెలుగు వెలుగుతున్న బిజెపికి కొంతకాలంగా దక్షిణాది విషయంలో నిద్రపట్టడంలేదు.…

కాకతీయ ఉత్సవ సప్తాహం

మరోసారి కాకతీయ ఉత్సవాలకు ఓరుగల్లు ముస్తాబవుతున్నది. నేటి నుండి ఏడు రోజుల పాటు అత్యంత వైభవంగా ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు ఉమ్మడి జిల్లాల యంత్రాంగమంతా సిద్దమయింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ‘కాకతీయ ఉత్సవా లంటూ ప్రత్యేకంగా నిర్వహిస్తున్నది ఈ సంవత్సరమే. సరిగ్గా పదేళ్ళ కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజులపాటు ఉత్సవాలు జరిగాయి.…

మోదీ నోట తెలంగాణ విశిష్టత ..!

భారతీయ జనతాపార్టీ జాతీయ సమావేశాలు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో జరుగుతాయన్న వార్త వొచ్చినప్పటినుండి రాష్ట్ర రాజకీయాలు వేడి పుంజుకున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలతో పెద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ సమావేశాలకు ప్రధాని మోదీ కూడా వొస్తుండడంతో రాజకీయ పార్టీల మధ్య సవాళ్ళు, ప్రతిసవాళ్ళు చోటుచేసుకున్నాయి. ఈ విమర్శల నేపథ్యంలో…

రాజకీయ ఎత్తుగడే ..!

‘‘‌సహజంగా తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలోనే ఇలాంటి సమావేశాలను ఆయాపార్టీలు ఏర్పాటు చేస్తాయి. కాని, తెలంగాణలోగాని, పక్కనున్న ఏపిలోగాని అంతగా మెజార్టీలేక పోయినా హైదారాబాద్‌లో ఈ సమావేశాలు ఏర్పాటు చేయడంలోనే ఆ పార్టీ ఎత్తుగడ ఏమిటన్నది అర్థమవుతున్నది. పైగా ఆ పార్టీ అగ్రనేతలంతా కట్టకట్టుకుని ఇక్కడి వొస్తున్నారు. ఈ సందర్భంగా కెసిఆర్‌ ‌సర్కార్‌ను టార్గెట్‌…

బిజెపి వ్యూహాత్మక అడుగులు

అభ్యర్థుల ఎంపిక విషయంలో భారతీయ  జనతాపార్టీ వ్వూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా దేశంలోని అత్యున్నత రాజకీయ పదవుల విషయంలో చాలా కసరత్తు చేస్తున్నట్లే కనిపిస్తున్నది. దేశంలో అత్యధికంగా జనభా కలిగిన బిసిలు, ఆ తర్వాత అణగారిన వర్గాలుగా పేర్కొనబడుతున్న ఎస్సీ, ఎస్టీలను ఆకట్టుకునే విషయంలో ఆచీతూచి ఆ పార్టీ అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతున్నది. వెనుకబడిన వర్గాలకు చెందిన…

రాష్ట్రపతి అభ్యర్థిని నిలపడంలో ఏకమైన విపక్షాలు

భారతీయ జనతాపార్టీకి ప్రత్యమ్నాయ రాజకీయ వ్యవస్థనొకదాన్ని ఏర్పాటు చేసేందుకు తలమునకలవుతున్న విపక్షాలు తుదకు ఒక అడుగు మాత్రం ముందు కేశాయి. మరో రెండు సంవత్సరాల్లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బిజెపి వ్యతిరేక పార్టీలన్నీ ఒక తాటిపైకి రావాలని దాదాపు సంవత్సరకాలానికి పైగానే మంతనాలు జరుపుతూ వొస్తున్నాయి. కాని, పిల్లి మెడలో గంట ఎవరు…

నేడు ప్రపంచ వితంతువుల దినోత్సవం

వితంతువుల పట్ల వివక్ష ఇంకెన్నాళ్ళు.. వితంతు అనే పదం అనాగరికమైనది. ఈ పదం వినడానికి మనకే ఎంతగానో బాధ వుంటుంది. అలాంటిది వితంతువుల జీవితాలు ఎంత దుర్భరంగా వుంటాయో వేరే చప్పక్కర్లేదు. ఇవాల్టికి కూడా ఎంతో మంది వితంతువులు కుటుంబ పరంగా, సామాజిక పరంగా వివక్షతకు గురౌతున్నారు. ఎంతోమంది సంఘ సంస్కర్తలు వితంతువుల హక్కుల కోసం…

అగ్నిపథ్‌పై కేంద్రం అడుగు ముందుకే..

దేశంలోని యువతకు ఉపాధి, దేశ భక్తిని కలిగించాలన్న ఉద్దేశ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ ‌పథకంపట్ల దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నా కేంద్రం మాత్రం ఆ పథకం అమలులో ముందుకే వెళ్ళుతున్నది. ఎవరు ఎంత వ్యతిరేకించినా ఈ పథకాన్ని అమలుచేసి తీరుతామంటోంది కేంద్రం. ఈ పథక రచనపై దేశం మొత్తం అట్టుడికి పోయిన విషయం…