Category ఎడిటోరియల్

పక్క పార్టీలతో ఐక్యతారాగం.. స్వీయపార్టీలో ముసలం

భారతీయ జనతాపార్టీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కలిసివచ్చే పార్టీలన్నీ ఐక్యం అయ్యేందుకు ఒక పక్క మంతనాలు జరుగుతుంటే, కాంగ్రెస్‌లో మాత్రం నిత్యం ఎక్కడో ఒక దగ్గర అంతర్ఘత కుమ్ములాటలు కొనసాగుతూనే ఉన్నాయి. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బిజెపిని ఓడించేందుకు దేశంలోని పలు పార్టీలు చాలా కాలంగా వ్యూహరచన చేస్తున్నాయి. అయితే కేంద్రంలో ఎదురులేని మెజార్టీతో ప్రభుత్వాన్ని…

‌బతుకమ్మ సంబురాలు

నేటి నుండి బతుకమ్మ సంబురాలు మొద)వుతున్నాయి. ప్రతీ ఆశ్వీయుజశుద్ధ అమావాస్య మొదలు తొమ్మిది రోజుల పాటు జరుపుకునే ఈ వేడుకలు తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక శ్రద్ధతో అడుకోవటం ఆనవాయితీ.. కాకతీయుల కాలానికి పూర్వంనుండే ఈ వేడుకలు ఈ ప్రాంతంలో ప్రాచుర్యంలో ఉన్నట్లు తెలుస్తున్నది. వర్షాకాలం ముగిసి శీతాకాలం ఆరంభలో ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు ప్రకృతినే పరవశింపజేసేవిగా…

రాష్ట్ర రాజకీయాలకు ‘మునుగోడు’ ఎన్నిక దిక్సూచీ కానుందా?

మునుగోడు ఉప ఎన్నిక భవిష్యత్‌లో రాష్ట్ర రాజకీయాలను శాసించేదిగా కనిపిస్తున్నది. రాష్ట్ర రాజకీయాలిప్పుడు మునుగోడు చుట్టూ తిరుగుతున్నా, జాతీయ రాజకీయ పార్టీల దృష్టి అంతా ఈ నియోజకవర్గంపైనే ఉంది. ఈ నియోజకవర్గ ఉప ఎన్నికకు ఇంకా నోటిఫికేషన్‌ ‌విడుదల కాకముందే ఇక్కడి రాజకీయాలు వేడందుకున్నాయి. ఎవరిని కదిలించినా మునుగోడు ఉప ఎన్నికపైనే చర్చిస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా…

కాంగెస్‌ ‌పార్టీకి పెద్ద సమస్యగా జాతీయ అధ్యక్ష ఎన్నిక

National Congress Party జాతీయ కాంగ్రెస్‌ ‌పార్టీకి ఇప్పుడు అధ్యక్షుడి ఎంపిక పెద్ద సమస్యగా తయారయింది. ఈ పదవిని చేపట్టే విషయంలో రాహుల్‌ ‌గాంధీ సుముఖంగా లేకపోవడంతో కొత్త వ్యక్తిని ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం కాంగ్రెస్‌ ‌తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. చాలా కాలంగా అమె అస్వస్థతగా ఉండటం వల్ల అధ్యక్ష…

థర్డ్ ‌ఫ్రంట్‌ ‌కాదు… మెయిన్‌ ‌ఫ్రంటే

బిజెపియేతర పార్టీలన్నీ ఏకమైతే దేశంలో ఏర్పడేది మెయిన్‌ ‘‌ఫ్రంటే’ అవుతుందన్న నమ్మకాన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్రంలో ఏర్పడిన యుపిఏ ప్రభుత్వంపైన ప్రజలకు పూర్తిగా నమ్మకం పోయింది. ప్రభుత్వరంగంలో కొనసాగుతున్న సంస్థలను ఒక్కొక్కటిగా ప్రైవేటుకు అప్పగిస్తున్నారని, ముఖ్యంగా ఆదాని, అంబానీలకు ఈ సంస్థలను దారదత్తం చేస్తుండడం, సంస్కరణల పేరున…

మళ్ళీ ‘విమోచన’ లొల్లి

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించుకునే విషయంలో గత ఎనిమిదేళ్ళుగా రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ప్రధానంగా ఈ విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాస మధ్య విమర్శలు ప్రతి విమర్శలు నిత్యం చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తెరాస అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల…

టిఆర్‌ఎస్‌కు కమ్యూనిస్టుల అండ

కేవలం ఒక ప్రాంతంలో జరిగే ఉప ఎన్నికపై ఇవ్వాళ యావత్‌ ‌దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్నది. సార్వత్రిక ఎన్నికలకు ఒక సంవత్సరకాలం ఉండగా ఏర్పడిన ఈ ఉప ఎన్నిక ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తమ ఖాతాలో వేసుకునేందుకు తమ శక్తియుక్తులతో ముందుకు పోతున్నాయి. వాస్తవంగా ఈ ఉప ఎన్నిక కావాలని సృష్టించిందేనన్న అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి.…

అమిత్‌షాతో జూనియర్‌ ఎన్టీఆర్‌ ‌భేటి తెలంగాణ రాజకీయాల్లో చర్చ

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తాజా హైదరాబాద్‌ ‌పర్యటనలో ప్రముఖ తెలుగు సినిమా హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌తో సమావేశం కావడం అటు ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ రాజకీయాల్లోకూడా తీవ్ర చర్చకు దారితీసింది. అయితే అమిత్‌షాతో జూనియర్‌ ఎన్టీఆర్‌ ‌భేటీలో ఏలాంటి రాజకీయ కోణం లేదని భాజపా వర్గాలు చెబుతున్నప్పటికీ అమిత్‌షా లాంటివాడు అకస్మాత్తుగా ఈ ఆలోచన చేయడం…

మోదీపై మరోసారి స్వరం పెంచిన కెసిఆర్‌

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మరోసారి ప్రధాని నరేంద్రమోదీపై స్వరం పెంచారు. బిజెపి, టిఆర్‌ఎస్‌ ‌దోబూచు లాడుతున్నాయని, ఈ రెండు పార్టీలు ఒకటేనని ఆరోపిస్తున్న కాంగ్రెస్‌కు కాదని జవాబు చెప్పినట్లుగా కెసిఆర్‌ ‌మాటలున్నాయి. కేంద్ర రాష్ట్రాల మధ్య గతంలో అనేక విభేదాలు వొచ్చినా, ఏనాడు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికూడా అనని విధంగా వికారాబాద్‌ ‌సభలో ప్రధాని…