Category ఎడిటోరియల్

సమస్యల వలయంలో బిఆర్‌ఎస్‌

ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది అధికార భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌)‌ని సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఒక పక్క సొంత పార్టీలో నాయకుల మధ్య విభేదాలు, విపక్షాల దాడులతో ఆ పార్టీ ఉక్కిరిబిక్కిరవు తున్నది. మరో పక్క ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాని కి అపకీర్తిని తెచ్చేవిధంగా వెలుగుచూస్తున్న లీకేజీలు, స్కామ్‌ ‌లతో బిఆర్‌ఎస్‌ ‌దిక్కుతోచని పరిస్థితి నెలకొంది.…

బిజెపీలోనూ అసంతృప్తి

ఒకనాడు క్రమశిక్షణకు పెట్టిందే పేరుగా చెప్పుకునే భారతీయ జనతాపార్టీలోనూ అసంతృప్తి రాగం మొదలైనట్లు కనిపస్తున్నది. ఇంతవరకు కాంగ్రెస్‌ ‌పార్టీయే ఇలాంటి అసంతృప్తులకు నిలయంగా చెప్పుకోవటం విన్నాం. ఒక వేళ బీజేపీలో విభేదాలున్నా ఏనాడు బహిరంగంగా విమర్శించుకోవడంగాని, మీడియాకు ఎక్కడం కాని ఉండేది కాదు. ఏవైనా ఆరోపణలు వొస్తే నేరుగా ఆ పార్టీ కేంద్ర నాయకత్వమే చీవాట్లు…

దుమారం లేపిన బండి ‘ముద్దు’..

రాష్ట్ర గవర్నర్‌ ‌డా. తమిళి సై పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కౌశిక్‌ ‌రెడ్డి జాతీయ మహిళా కమిషన్‌ ‌ముందు హాజరు అయి క్షమాపణలు చెప్పిన ఘటన ప్రజలు మరవక ముందే భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌దిల్లీ మద్యం కుంభకోణం లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల అరెస్ట్ ‌ను ఉద్దేశించి చేసిన…

మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లుకు మోక్షమెప్పుడు..?

అన్ని రంగాల్లో మహిళలు ముందుకు దూసుకుపోతున్నప్పటికీ వారికి కావల్సినంతగా అవకాశాలు రావడంలేదు. ఆకాశంలో సగం అని చెబుతున్నప్పటికీ మగవాళ్ళతో సమానంగా పోటీ పడే అవకాశాలు వారికి లభించడంలేదు. ముఖ్యంగా రాజకీయాల్లో ఇది కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నది. అక్కడ వారి ప్రతిభను చూపించుకునే వీలు లేకుండా పురుషుల పెత్తనం అడ్డుపడుతోంది. ఉదాహరణకు గ్రామస్థాయిలో సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లుగా వారు…

యువరాజు పట్టాభిషేకానికి వేళాయె..!

తెలంగాణ రాష్ట్రంలో యువరాజు పట్టాభిషేకానికి ముహూర్తం సమీపించినట్లుంది. పట్టాభిషేకంపై చాలా కాలంగా నలుగుతున్న చర్చలకు ముగింపుదశ వచ్చినట్లు కనిపిస్తున్నది. ఇటీవల యువరాజు కార్యక్రమాల జోరు చూస్తుంటే అందుకు రంగం సిద్దమవుతున్నట్లుగానే ఉంది. వాస్తవంగా రాష్ట్రంలో గత ముందస్తు ఎన్నికలు జరిగినప్పటినుండి ఈ విషయమై విస్తృత ప్రచారం జరుగుతూనే ఉంది. రాష్ట్ర క్యాబినెట్‌లోని బాధ్యతాయుతమైన మంత్రులు, శాసనసభ్యులు…

కోమటి రెడ్డి వెంకట్‌ ‌రెడ్డి బెదిరింపును ‘ప్రజాతంత్ర’ తీవ్రంగా ఖండిస్తుంది..

నాలిక కర్చుకోవడం నాయకులకు అలవాటైంది. అధికార గర్వంతో కొందరు రాజకీయ నాయకులు ఒక్కోసారి కనీస విచక్షణాజ్ఞానాన్నికోల్పోతూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం, ఆ తర్వాత నాలిక కర్చుకోవడమన్నది వారికి అలవాటైపోయింది. రాజకీయాల్లో ఉన్న ప్పుడు కనీసమర్యాదలు పాటించాలన్న విచక్షణను కూడా కోల్పోతున్నారు. తమపై వొచ్చిన విమర్షలను ఎదుర్కునే విషయంలో నేర్పుగా సమాధానాలు చెప్పలేక అసహనానికి, ఆగ్రహానికి గురిఅవుతున్నారు.…

‌మోదీ పేదల దేవుడన్నా…!!

‘‘మోదీ పేదలపాలిటి దేవుడన్నా…’’, పేదలు ఇబ్బంది పడొద్దని బియ్యం ఇస్తున్నడన్నా…’’,  ‘‘అలాంటోన్ని ఎందుకు తిట్టాలన్నా..’’…. అన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌  ‌మాటలను గుర్తుచేస్తున్నాయి దేశంలోని ప్రధాన రాజకీయ పక్షాలు.  ప్రధాని మోదీ నిజంగానే పేదలను ఆదుకునే దేవుడే అయితే పేదలపై ధరల భారాన్ని ఎందుకు మోపుతున్నాడని వారు ప్రశ్నిస్తున్నారు. మోదీ అధికారంలోకి వొచ్చిన…

‌ప్రతిపక్ష పార్టీల సభలపై అధికార పార్టీ దాడులు ..

రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలకు ఇంకా కొన్ని మాసాల వ్యవధి ఉన్నప్పటికీ రాజకీయ వేడి రాచుకుంటోంది. అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాలను విస్తృతం చేశాయి. ఇంటింటికని ఒకరు, గడప గడపకని ఒకరు, పల్లెలు పట్టణాలని కాకుండా వీధి సమావేశాలు, కార్నర్‌ ‌మీటింగ్‌లని, బహిరంగ సభలని ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్ళు, ప్రతి సవాళ్ళతో వేడి…

దేశపతి కి అవకాశం దక్కేనా ..?

మరో తొమ్మిది నెలల్లో రానున్న శాసనసభ ఎన్నికలకు సిద్ధపడుతున్న పార్టీలకు ముందుగానే తమ బలాబలాలు తేల్చుకునే అవకాశం ఏర్పడింది. నేటికి సరిగ్గా 22 రోజుల్లో జరుగనున్న మినీ సంగ్రామంలో ఎవరి సత్తా ఏమిటో నిరూపించుకునేందుకు రాజకీయ పార్టీలన్నీ తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించాయి. రాష్ట్రంలో ఖాలీ  ఏర్పడిన మూడు ఎంఎల్సీ స్థానాలకు గాను ఈ నెల…