Category ముఖ్యాంశాలు

చురుకుగా తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పనులు పరిశీలించిన సిఎం రేవంత్‌ ‌రెడ్డి

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, నవంబర్‌22: ‌సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పనులు చురకుగా సాగుతున్నాయి. డిసెంబర్‌ 9‌న విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం చురుకుగా సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో పనులు జరుగుతున్న తీరును పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి శుక్రవారం పరిశీలించారు. పనులను త్వరగా  పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

చత్తీస్ గడ్ లో భారీ ఎన్ కౌంటర్…

పదిమంది మావోయిస్టు మృతి ధ్రువీకరించిన బస్తర్ ఐజి. పి. సుందర్‌రాజ్ భద్రాచలం, ప్రజాతంత్ర, నవంబర్ 22: ఛత్తీస్ గడ్ రాష్ట్రంలోని కొంటాం, భెజ్జీ ప్రాంతంలో భద్రత బలగాలకు మరియు మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురుకాల్పులు జరిగాయి.ఈ సంఘటనలో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి మూడు ఆటోమేటిక్ ఆయుధాలతో సహా పలు…

ఇన్ ఫార్మర్ అనుమానం తో ఇద్దరినీ హతమార్చిన మావోయిస్టులు

ఘటనా స్థలం వద్ద లేక విడుదల భద్రాచలం, ప్రజాతంత్ర, నవంబర్ 22 : ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలో ఇద్దరు వ్యక్తులను మావోయిస్టులు ఇన్ ఫార్మర్ నెపంతో హతమార్చారు. పంచాయతీ కార్యదర్శి రమేష్ మరియు అర్జున్ లను అతి దారుణంగా గొడ్డలితో నరికి చంపినట్లు తెలుస్తుంది. ఈ హత్య తామే చేసామని సంఘటన స్థలం…

‌బానిస… బానిసలకింత అహంభావమా..!

రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ ‌టాపిక్‌గా ‘గులాంగిరి’ వ్యాఖ్యలు.. (మండువ రవీందర్‌రావు) ‘బానిస… బానిసలకింత అహంభావమా..!’ ఈ మాటలు ఎక్కడో విన్నట్లు ఉంది కదా! అవును అచ్చంగా ఇది సినిమా డైలాగే. జూదంలో ఓడిపోయిన పాండవులు సుయోధనుని సూటిపోటి మాటలను ధిక్కరించిన క్రమంలో దుర్యోదనుడితో పై విధంగా డైలాగ్‌ ‌చెప్పించాడు సినిమా డైరెక్టర్‌. ‌నిజంగానే ఆ డైలాగ్‌…

గుంట భూమిని కబ్జా చేసినట్లు రుజువు చేయగలవా?

రేవంత్‌ రెడ్డివి బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు మాజీ మంత్రి హరీష్‌ రావు ఘాటు విమర్శలు సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్‌21:  బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలకు సీఎం రేవంత్‌ రెడ్డి తెరలేపుతున్నాడని మాజీ మంత్రి హరీశ్‌ రావు మండిపడ్డారు.  భూ కబ్జాలకు పాల్పడుతున్నాడని సీఎం చేసిన తప్పుడు ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. గురువారం అందోల్‌ మండలం మాసాన్‌పల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి…

అదానీని తక్షణమే అరెస్ట్ ‌చేయాలి

‌న్యూదిల్లీ, నవంబర్‌ 21: ‌లంచం ఆరోపణలపై అమెరికాలో కేసు నమోద్కెన అదానీ గ్రూప్‌ ‌ఛ్కెర్మన్‌ ‌గౌతమ్‌ అదానీని తక్షణమే అరెస్ట్ ‌చేయాలని కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ డిమాండ్‌ ‌చేశారు. సెబీ చీఫ్‌ ‌మాధభి పురీ బచ్‌పైనా విచారణ జరిపించాలన్నారు. ఈ మేరకు గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి జ్కెరాం రమేశ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. అమెరికా, భారత చట్టాలను అదానీ ఉల్లంఘించారనే విషయంపై ఇప్పుడు స్పష్టత వొచ్చిందని రాహుల్‌ ‌గాంధీ అన్నారు. మోదీ, అదానీల బంధం భారత్‌లో ఉన్నంత వరకే సురక్షితమన్నారు. తాజా ఆరోపణలపై తక్షణమే జేపీసీతో విచారణ జరిపించాలన్నారు. శీతకాల సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతామన్నారు. తన అవినీతి ద్వారా దేశ ఆస్తులన్నీ అదానీ కొల్లగొట్టారని ఆరోపించారు. ఆయనను వెంటనే అరెస్ట్ ‌చేసి విచారిస్తే విషయాలన్నీ బయట పడతాయని అన్నారు. ఆయనను రక్షిస్తున్న సెబీ చీఫ్‌ను ఆ పదవి నుంచి తొలగించి ఆమె పైనా విచారణ జరపాలని డిమాండ్‌ ‌చేశారు. లంచం ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సంబంధం లేకుండా విచారణ జరిపించాలని రాహుల్‌ ‌గాంధీ కోరారు. ‘అదానీ అరెస్టు కాడని, ఆయనపై విచారణ జరగదని నేను గ్యారంటీ ఇస్తాను. ఎందుకంటే ఆయన్ను మోదీ కాపాడుతున్నారు’ అని రాహుల్‌ ‌గాంధీ ఆరోపించారు.

సెబీ చీఫ్‌ ‌మాధభి పురీ బచ్‌పైనా విచారణ జరిపించాలి కాంగ్రెస్‌ అ‌గ్రనేత నేత రాహుల్‌ ‌గాంధీ  డిమాండ్‌ ‌న్యూదిల్లీ, నవంబర్‌ 21: ‌లంచం ఆరోపణలపై అమెరికాలో కేసు నమోద్కెన అదానీ గ్రూప్‌ ‌ఛ్కెర్మన్‌ ‌గౌతమ్‌ అదానీని తక్షణమే అరెస్ట్ ‌చేయాలని కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ డిమాండ్‌ ‌చేశారు. సెబీ చీఫ్‌ ‌మాధభి…

ఏరోస్పేస్‌ ‌భారీ విస్తరణతో 1200 కొత్త ఉద్యోగాలు

ఐటి, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌ ‌బాబు రఘువంశీ ఏరోస్పేస్‌ ‌భారీ విస్తరణ పనులకు శంకుస్థాపన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 21 : ‌విమాన ఇంజన్ల కీలక విడి భాగాలు, రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో గణనీయ వృద్ధిని సాధించిన రఘువంశీ ఏరోస్పేస్‌ ‌భారీ విస్తరణ పనులకు శ్రీకారం చుట్టింది. గురువారం శంషాబాద్‌ ఏరోస్పేస్‌ ‌పార్క్ ‌లో…

మూసీ ప్రక్షాళన చేయకుంటే నా జన్మ దండగ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌21: ‌మూసీ నదిని ప్రక్షాళన చేసి హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి నగరంగా అభివృద్ధి చేస్తామని.. ఎన్ని శక్తులు అడ్డుపడినా ప్రక్రియ పూర్తి చేసే బాధ్యతను కాంగ్రెస్‌ ‌ప్రభత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘నదుల వెంట నాగరికత వర్ధిల్లాలి.. నదులను కబళిస్తే.. మనిషి మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. ప్రజా ఆరోగ్యం పటిష్ఠ ఆర్ధికం పర్యావరణ కోణాల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చెందాల్సిన హైదరాబాద్‌కు మూసీ ఒక వరం కావాలి. కానీ, శాపంగా మిగిలిపోకూడదు. మూసీ ప్రక్షాళన చేయాలన్నదే ప్రజా ప్రభుత్వ సంకల్పం. ఈ తరానికే కాదు.. తరతరాలకు మేలు చేసే నిర్ణయం. ఈ నిర్ణయానికి అండగా నిలవాలి‘ అని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. ఈ మేరకు ఎక్స్‌లో సీఎం రేవంత్‌ ఓ ‌పోస్ట్ ‌చేశారు. కాగా.. మూసీ పరీవాహక ప్రాంతం మురికి కూపంగా మారి.. హైదరాబాదీలకు విష వాయువులు అందిస్తుందని, దుర్భరంగా మారిన వారి జీవన విధానం మార్చేందుకు మూసీని ప్రక్షాళన చేసి, పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. మూసీ వెంట నరకం అనుభవిస్తోన్న పేదవారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. బుల్డోజర్లు ఎక్కించి అయినా ప్రాజెక్టును చేపట్టి తీరతాం.. రాబోయే రోజుల్లో యాదవులకు అత్యధికంగా సీట్లు ఇస్తామని, కార్పొరేటర్లు, ఎమ్మెల్యే, ఎంపీ, ప్రజాప్రతినిధులుగా అవకాశాలు పెంచి నాయకులుగా తీర్చిదిద్దే బాధ్యత కాంగ్రెస్‌ ‌పార్టీ తీసుకుంటుందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇదిలావుంటే మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును అడ్డుకోవాలని చూసేవారు కుక్కచావు చస్తారని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. బుల్డోజర్లు ఎక్కించి అయినా ప్రాజెక్టును చేపట్టి తీరతామని ప్రకటించారు. మూసీ కాలుష్యం వల్ల ఆ నది పరీవాహక ప్రాంత ప్రజలు అణుబాంబుతో కలిగే ప్రమాదం కంటే ఎక్కువ దుష్పరిణామాలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. వరంగా ఉండాల్సిన మూసీ.. శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ పునరుజ్జీవంతోనే వారికి ఆ సమస్య నుంచి విముక్తి కలుగుతుందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గంగా, సబర్మతి నదులను రూ.40 వేల కోట్లతో సుందరీకరణ చేసుకుంటే, తాను తెలంగాణ ముఖ్యమంత్రిగా మూసీ పునరుజ్జీవం చేయొద్దా? అని ప్రశ్నించారు. ప్రధాని చేసిన పనిని మెచ్చుకుంటూ.. మూసీ ప్రక్షాళనపై నకిలీ బీజేపీ నేతలు అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. కషన్ల కోసమే మూసీ ప్రాజెక్టు చేపట్టానని బీఆర్‌ఎస్‌ అం‌టోందని, ఈ మూసీ ప్రక్షాళన చేయకపోతే తన జన్మ దండగ అని భావోద్వేగానికి లోనయ్యారు. ‘రూ.1.50 లక్షల కోట్లతో మూసీ ప్రక్షాళన చేపట్టి.. రూ.25 వేల కోట్లు దోచుకునే ప్రయత్నం చేస్తున్నామంటున్నారని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదు.. ఎన్ని శక్తులు అడ్డుపడినా పూర్తి చేస్తాం హైదరాబాద్‌ను ప్రపంచస్థాయికి తీసుకువెళతాం : ఎక్స్ ‌వేదికగా స్పష్టం చేసిన సిఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌21: ‌మూసీ నదిని ప్రక్షాళన చేసి హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి నగరంగా అభివృద్ధి చేస్తామని..  ఎన్ని శక్తులు అడ్డుపడినా ప్రక్రియ పూర్తి చేసే…

గాంధీ భవన్‌ ‌కు చేరుకున్న పటాన్‌ ‌చెరు కాంగ్రెస్‌ ‌పంచాయితీ

సీఐల పోస్టింగులపై భగ్గుమన్న కాంగ్రెస్‌ ఇం‌చార్జ్ ‌కాట శ్రీనివాస్‌ ‌గౌడ్‌ కాంగ్రెస్‌ ‌వ్యతిరేకులకు పదవులు ఇవ్వడంపై గాంధీ భవన్‌ ‌లో పిసిసి అధ్యక్షుడు మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కు ఫిర్యాదు పటాన్‌ ‌చెరు,ప్రజాతంత్ర, నవంబర్‌ 21:‌పటాన్‌ ‌చెరు నియోజకవర్గం కాంగ్రెస్‌ ‌నాయకుల పంచాయితీ గాంధీభవన్‌ ‌కు చేరుకుంది. ఎంపీ…