Category శీర్షికలు

సునామీలపై అవగాహన అవసరం!

19 ఏళ్ల కిందట భయంకరమైన అలలు లక్షల మందిని పొట్టన పెట్టుకున్నాయి. 2004 డిసెంబరు 26న ఇండొనేసియాలోని సుమత్రా తీరంలో ఒక్కసారిగా భారీ కుదుపు. 9.3 తీవ్రతతో  హిందూ మహా సముద్ర గర్భంలో వచ్చిన భూకంపం ప్రళయాన్ని తలపించింది. దాని ఉద్ధృతితో ఒక్కసారిగా విరుచుకు పడిన సునామీ పెను విషాదాన్ని మిగిల్చింది. ఆ భూకంపం ధాటికి…

రాష్ట్ర మంత్రివర్గంలో యాదవులకు స్థానం దక్కేనా?

గోల్కొండ పూర్వ నామం గొల్లకొండ.గొల్లకొండ పరిసర ప్రాంతాల్లో యాదవులు అధిక సంఖ్యలో నివసించే వారు.16 శతాబ్ధంలో గోల్కొండకు సమీపంలోనే హైదరాబాద్‌ నగర నిర్మాణం జరిగింది.హైదరాబాదు నిర్మాణం తర్వాత కుతుబ్‌ షాహి,అసఫ్‌ జాహి పాలనలో యాదవులు సైనికులుగా,యుద్ద వీరులుగా ప్రముఖ పాత్ర పోషించారు.బ్రిటిష్‌ వారి కాలంలో అహిర్‌ రెజ్మెంట్‌ గా పేరుగాంచిన యాదవ సైన్యం 1853 వరకు…

పాచిపోతున్న పాశుపతాస్త్రం!

 నేడు  జాతీయ  వినియోగదారుల  దినోత్సవం ప్రజల చేతిలో  పాశుపతాస్త్రంలా ఉన్నటువంటి వినియోగదారుల పరిరక్షణ చట్టాన్ని గత పాలకులు సక్రమంగా అమలు చేయకపోవడంతో అది దాని ఉనికిని కోల్పోయే దుస్థితిలో ఉన్నది. 1986లో వినియోగదారుల పరిరక్షణ చట్టం ఏర్పడ్డది. అప్పటి మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ చొరవతో ఇది చట్టంగా రూపుదిద్దుకున్న అనతి కాలంలోనే రాష్ట్రాలు అంతే…

డ్రోన్‌ క్లినిక్స్‌, గగన నిఘాల్లో డ్రోన్‌ టెక్నాలజీ..!

నాటి పాతరాతి యుగం నుంచి నేటి అత్యాధునిక డిజిటల్‌ నానో యుగం వరకు శాస్త్రసాంకేతికశాస్త్ర అనూహ్య ప్రగతి మానవాళి జీవనశైలిలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది. వైజ్ఞానిక కల్పిత సినిమాలు, సాహిత్యరంగాల్లో కనిపించే ఊహాజనిత టెక్నాలజీలను నేటి ఆధునిక డిజిటల్‌ నిపుణుడు సుసాధ్యం చేయడంతో పాటు ఇలాంటి డిజిటల్‌ టెక్నాలజీలను మానవాళి సేవల్లో వినియోగించడం చూస్తున్నాం.…

నిరంకుశానికి దారితీస్తున్న టెలికమ్యూనికేషన్‌ బిల్లు!

పార్లమెంటులో ప్రవేశపెట్టిన టెలికమ్యూనికేషన్స్‌ బిల్లు 2023 అత్యంత క్రూరమైన చట్టం. ఇది వైర్డు, ఎలక్ట్రానిక్‌, ఆప్టికల్‌ మొదలైన వాటితో సహా ఏదైనా రూపంలో ప్రసారం చేయబడే, విడుదలయ్యే,  స్వీకరించబడే ప్రతి సందేశంపై ప్రభుత్వ నియంత్రణ బలవంతం చేస్తుంది. బిల్లులోని సందేశం నిర్వచనం సైన్‌, సిగ్నల్‌, రచన, వచనం, చిత్రం, ధ్వని, వీడియో, డేటా స్ట్రీమ్‌, ఇంటెలిజెన్స్‌…

కోటి పుణ్యాలకు సాటి ముక్కోటి ఏకాదశి!

వైకుంఠ ఏకాదశి.. విశిష్టత ఏంటో తెలుసుకుందామా! ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. కోటి పుణ్యాలకు సాటి.. ఒక ముక్కోటి ఏకాదశి అని పెద్దల సూక్తి.. ఈ పండుగ తెలుగు నెలల ప్రకారమే జరుపుకున్నా.. ప్రతి ఏడాది…

మరో సంగ్రామానికి సిద్ధ్దమవుతున్న తెలంగాణ

దేశ అధికారాన్ని నిర్ణయించగలిగే పార్లమెంటు ఎన్నికలు త్వరలో రానున్నాయి. ఈ ఎన్నికల్లో అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు ప్రధానంగా రెండు జాతీయ పార్టీలు తమ కూటములను సన్నద్దం చేసుకుంటున్న దశలో, తెలంగాణ రాష్ట్రం కూడా అందుకు రంగం సిధ్ధం  చేసుకుంటున్నది. తాజాగా పక్షం రోజుల క్రితం జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ఒక విధంగా మహా యుద్దంగా…

వైద్యవిద్యకు పివి నరసింహారావు ప్రదానాలు!

భారతదేశానికి ఒక విపత్కర పరిస్థితిలో ప్రధాని పదవిని (జూన్‌ 1991 – మే 1996) చేపట్టి, కష్టాలనుంచి గట్టెక్కించిన వ్యక్తి పివి నరసింహారావు (28.06.1921 -23.12.2004). ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడుగా, విదేశీ సంబంధాలు చక్కదిద్దిన చాణక్యుడుగా పేరొందిన వ్యవహారదక్షుడు. పివి విద్యారంగానికి, ప్రత్యేకించి వైద్యవిద్యా రంగానికి కూడా చేసిన సేవలు ఎనలేనివి. విద్యలో అంతర్భాగమే వైద్య…

వైకుంఠ ఏకాదశికి ధర్మపురి దేవస్థానం ముస్తాబు!

తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రాచీన పుణ్య క్షేత్రమై దక్షిణకాశిగా, హరిహర క్షేత్రంగా, నవనార సింహ క్షేత్రలలో నొకటిగా పేరెన్నికగని పవిత్ర గోదావరీ తీరస్థ తీర్ధమైన ధర్మపురి క్షేత్రంలో, ప్రతి సంవత్సరం శ్రీలక్ష్మీనరసింహ (ఉగ్ర, యోగ), శ్రీవేంకటేశ్వర ఆలయాల్లో వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. డిసెంబర్‌ 23న శనివారం సంప్రదాయ రీతిలో నిర్వహించే ఈ…