prajatantra_news

prajatantra_news

ఆదివాసీల సంస్కృతి ఉట్టిపడేలా ఆధునికీకరణ

జాతర పూజారుల సంఘం సలహా సూచనలను పాటిస్తాం మేడారం మాస్టర్‌ ప్లాన్‌పై సమావేశంలో మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 5: మేడారం మాస్టర్‌ ప్లాన్‌పై పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సచివాలయంలో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించి కీలక సూచనలు చేశారు. మేడారం ఆలయ పరిసరాలను ఆదివాసుల ఆచారాలు,…

ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మంథని పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన మంథని, ప్రజాతంత్ర, జూలై 5 : విద్యార్థులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సూచించారు. మంత్రి శ్రీధర్‌బాబు కలెక్టర్‌ కోయ శ్రీహర్షతో కలిసి శనివారం మంథనిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు,…

ప్రతీ రెవెన్యూ గ్రామానికి జీపీవోలు

వీఆర్‌వో, వీఏవోలకు మరో అవకాశం రెవెన్యూ ఉద్యోగ సంఘాలతో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి భేటీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 5: గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్ధను బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక గ్రామ పరిపాలనాధికారి (జీపీవో)ను నియమిస్తున్నామని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సచివాలయంలో…

గ్రీన్‌ చానల్‌ ద్వారా పరిహారం

పోక్సో కేసు బాధితులకు ప్రభుత్వ సహాయ సహకారాలు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్‌, జులై 5: లైంగిక నేరాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని, గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్టు చేసి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క…

జీహెచ్‌ఎంసీ జోన్లకు స్పెషల్‌ ఆఫీసర్లు

సీజనల్‌ వ్యాధులపై సమీక్షలో మంత్రి దామోదర హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 5: సీజనల్‌ వ్యాధుల నివారణ, నియత్రణపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శనివారం సమీక్ష నిర్వహించారు. డెంగీ కేసులు ఎక్కువగా నమోదవుతున్న జిల్లాలు, గ్రేటర్‌ హైదరాబాద్‌లో యాంటి లార్వల్‌ ఆపరేషన్‌ను విస్తృతం చేయాలని అధికారులను ఆదేశించారు. వాతావరణ పరిస్థితుల మార్పు కారణంగా వ్యాధుల…

వైద్యుల సెలక్షన్‌ లిస్టు విడుదల

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 5: ఆయుష్‌ మెడికల్‌ ఆఫీసర్‌, ఎంఎన్‌జే హాస్పిటల్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు సెలక్షన్‌ లిస్టును మెడికల్‌ రికూట్ర్‌మెంట్‌ బోర్డు శనివారం విడుదల చేసింది. ఆయుష్‌ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు 156 ఉండగా, ఎంఎన్‌జేలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు 45 ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంపికైన వారి వివరాలను బోర్డు శనివారం ప్రకటించింది.…

రైతులకు అందుబాటులో ఏఐ టెక్నాలజీ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 5: శాటిలైట్‌ ఇమేజింగ్‌ ద్వారా పంటలకు వచ్చే చీడపీడలు, రసం పీల్చే పురుగులను ముందస్తుగానే గుర్తించి వాటిని మొదట్లోనే నిరోధించే విధంగా తమ సంస్థ తయారు చేసిన ఏఐ టెక్నాలజీ గురించి కృషివాస్‌ సంస్థ ప్రతినిధులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు వివరించారు. పంట బయటకు కనిపించే వాటినే కాకుండా…

మహిళల ఎదుగుదలే సమాజ ఎదుగుదల

– ప్రజాభవన్‌లో ఇందిరా మహిళా శక్తి సంబరాలు -ఆర్టీసీ అద్దె బస్సుల మొదటి నెల అద్దె అందజేత – మంత్రి సీతక్కతో మహిళా సంఘాల ముఖాముఖి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 5: మహిళల ఎదుగుదలే సమాజ ఎదుగుదల.. మండల సమాఖ్యలో ఉన్న మహిళల కోరికలు నెరవేరుతున్నాయి.. మహిళా సంఘాల ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదుగుతున్నారు అని…

మహిళలకు 5వేల ఈవీ ఆటోలు

ఇందిరా మహిళా శక్తి సంబరాలలో మంత్రి పొన్నం మహిళా సంఘాలకు ఆర్టీసీ తరపున అద్దె చెల్లింపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 5: తమ ప్రజాప్రభుత్వం మహిళా సాధికారత కోసం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించిందని, వారం రోజుల్లో 200 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేసిన టార్గెట్‌…

బీబీకా ఆలంలో పొన్నం, అడ్లూరి ప్రార్థనలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 5: మొహర్రం సందర్భంగా డబీర్‌పురాలోని బీబీకా ఆలంను మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌లు సందర్శించారు. ఈ సందర్భంగా బీబీకా ఆలంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీలు అమీర్‌ అలీఖాన్‌, ఎఫండీ, వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ అజ్మాతుల్ల హుస్సేనీ ఇతర మైనార్టీ ముఖ్య నేతలు కూడా బీబీకా…