prajatantra_news

prajatantra_news

స్ధానిక* ఎన్నికల కోసమే బీఆర్‌ఎస్‌ రంకెలు

మరోసారి కేసీఆర్‌ అండ్‌ కోకు కర్రుకాల్చి వాతపెట్టండి రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి మహబూబాబాద్‌/హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 8: రాబోయే స్ధానిక ఎన్నికలలో లబ్దిపొందేందుకు బీఆర్‌ఎస్‌ నాయకులు రంకెలు వేస్తున్నారని, వారికి మరోసారి రాష్ట్ర ప్రజానీకం కర్రుకాల్చి వాతపెట్టాలని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు.…

ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తినిచ్చే కార్యక్రమం

‘ప్రజావాణి’ సందర్శించిన డిప్యూటీ కలెక్టర్ల బృందం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 8: జ్యోతిబాపూలే ప్రజా భవన్‌లో మంగళవారం నిర్వహించిన ముఖ్యమంత్రి ప్రజావాణి, ప్రవాసి ప్రజావాణిని మధ్యప్రదేశ్‌ రాష్ట్ర డిప్యూటీ కలెక్టర్ల బృందం సందర్శించింది. వీటి పని తీరు చాలా బాగుందని, ఇలాంటి విధానాన్ని తమ రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు తమ రాష్ట్ర ఉన్నతాధికారులకు సిఫారసు చేస్తామని…

అభివృద్ధి, సంక్షేమంలో వైఎస్‌ది చెరగని ముద్ర

~ వైఎస్‌కు సీఎం నివాళులు దిల్లీ, ప్రజాతంత్ర, జులై 8: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో చెరగని ముద్ర వేశారని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి కొనియాడారు. వైఎస్‌ జయంతిని పురస్కరించుకొని దిల్లీలోని తన అధికారిక నివాసంలో ఆయన చిత్రపటానికి సీఎం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇందిరమ్మ ఇళ్లు, రైతు రుణమాఫీ, జలయజ్ఞం,…

ఏపీకి నీళ్ల తరలింపుపై రేపు పీపీటీ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 8: ఆంద్రప్రదేశ్‌కు కృష్ణా జలాల అక్రమ తరలింపుతోపాటు బీఆర్‌ఎస్‌ పాలనలో తుమ్మడిహట్టి నుండి మేడిగడ్డకు ప్రాజెక్టు మార్చిన అంశంపై డాక్టర్‌ జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌లో బుధవారం పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ (పీపీటీ) ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులకు ఈ అంశంపై సమగ్రమైన సమాచారాన్ని అందించేందుకు మధ్యాహ్నం 3 గంటలకు…

చర్చకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధమే

కేటీఆర్‌కు స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం భట్టి మహబూబాబాద్‌, ప్రజాతంత్ర, జులై 8: కృష్ణా, గోదావరి బేసిన్లపై శాసనసభలో చర్చించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం స్ధింగా ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ లెక్కలు తీసుకొని అసెంబ్లీకి వస్తే చర్చిద్దాం అన్నారు. సిఎం రేవంత్‌ రెడ్డి…

చర్చిద్దామంటే దిల్లీ పోయిండు

సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్‌ ధ్వజం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 8: నోటికొచ్చిన హామీలు, 420 హామీలు ఇచ్చి వంద రోజుల్లో ఆరు గ్యారంటీల అమలు అని డైలాగులు కొట్టి 18 నెలలుగా రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులను, కోట్లాది కుటుంబాలను కాంగ్రెస్‌ దగా చేసిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో…

చిల్లర రాజకీయాలు మానండి

– కేటీఆర్‌కు మంత్రి సీతక్క ఉద్బోధ ములుగు, ప్రజాతంత్ర, జులై 8: ములుగు ప్రజలు దీవిస్తే మంత్రిని అయ్యాను.. నియోజకవర్గమే నాకు అండ.. నీలాగా కుల బలం.. ధన బలం అహంకార బలం నా వద్ద లేవు అని మహిళా శిశు సంక్షేమ, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. ములుగులో ఆమె మీడియా…

మూడు నెల్లుగా జీతాల్లేని ’ఉపాధి‘ ఏపీఓలు

Harish rao

-మాజీ మంత్రి హరీష్‌ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 8: చేసిన పనికి వేతనాలు రాక ఉపాధి హామీ సిబ్బంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ కుటుంబ పోషణ భారమై సతమతమవుతుంటే ఈ ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరించడం దుర్మార్గం అని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మనోవేదనకు గురై ఆ ఉద్యోగులు…

బాంబులు పెట్టినట్లు హెచ్చరిక

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 8: నగరంలోని నాలుగు ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్లు అగంతకుడి నుంచి మెయిల్‌ వచ్చింది. దీంతో పోలీసులు అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు. రాజ్‌భవన్‌, పాత బస్తీలోని సిటీ సివిల్‌ కోర్డు, జింఖానా క్లబ్‌, సికింద్రాబాద్‌ సివిల్‌ కోర్టుల్లో బాంబులు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తి మెయిల్‌ చేశాడు. పోలీసులు అప్రమత్తమై బాంబ్‌, డాగ్‌స్క్వాడ్‌లతో…

పంచాయతీల్లోని మల్టీపర్పస్‌ వర్కర్లకు శుభవార్త

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 8: రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న 53 వేల మంది మల్టీ పర్పస్‌ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. వారికి ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు సంబంధించి మొత్తం రూ.150 కోట్లు వేతనాలుగా ఆర్థిక శాఖ విడుదల చేసింది. గ్రామ పంచాయతీల ఖాతాల్లో ఆ నగదు మంగళవారమే జమ…