NEWS

NEWS

దసరా సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్ 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 24: దసరా పండుగను పురస్కరించుకొని పటాన్ చెరు పట్టణంలోని మైత్రి స్టేడియంలో  నిర్వహించిన దసరా సంబరాల్లో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిహెచ్ఎంసి కార్యాలయం వద్ద నిర్వహించిన ద్వజారోహన కార్యక్రమంలో పాల్గొని, జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ వద్ద నిర్వహించిన శమీ పూజలో పాల్గొన్నారు.…

ఆర్థిక సాయం అందజేత

జగదేవపూర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 24: మండలంలోని మునిగడప గ్రామానికి చెందిన  కాసాని పాపన్న(50) అనారోగ్యంతో మృతి చెందాడు. మంగళవారం మృతుని కుటుంబ సభ్యులను కాంగ్రెస్ సేవాదళ్ నాయకులు పరామర్శించి రూ.5000 నగదును అందజేశారు. ఈ సందర్భంగా సేవాదళ్ నాయకులు ప్రసాద్, మరాటి వెంకటస్వామి మాట్లాడుతూ… గ్రామంలో నిరుపేద కుటుంబ సభ్యులు మృతి చెందితే వారి కుటుంబ…

దేవి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్

పటాన్ చెరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 24: అమీన్ పూర్ మున్సిపాలిటీ బీరంగూడలోని నరేంద్ర కాలనీ, ఇస్నాపూర్ సెంట్రింగ్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ విజయదశమిని పురస్కరించుకొని అంగరంగ వైభవంగా జరుగుతున్న దేవి నవరాత్రి ఉత్సవాల్లో ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు నీలం మధు ముదిరాజ్ పాల్గొన్నారు.…

సిద్దిపేట పోలీస్ కమిషనర్ సాయుధ దళ కార్యాలయంలో ఘనంగా ఆయుధపూజ

సిద్దిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 24: సిద్దిపేట పోలీస్ కమీషనరేట్ పెద్దకోడూర్ గ్రామ శివారులోగల సాయుధ దళాల కార్యాలయంలో పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత దుర్గాదేవి నవరాత్రులులో భాగంగా ఆయుధాలకు, ప్రభుత్వ వాహనాలకు వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా పూజలు చేశారు. జమ్మి చెట్టుకు పూజలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ శ్వేత మాట్లాడుతూ చేసే ప్రతి పనిలో అధికారులు…

బండ్లగూడలో కాంగ్రెస్ పార్టీకి షాక్

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 24: దశాబ్ది కాలంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆకర్షితులై ప్రతిపక్ష పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు, కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్ చెరు నియోజకవర్గం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని బండ్లగూడ కాంగ్రెస్ పార్టీకి చెందిన…

ఘనంగా దసరా పండుగ వేడుకలు

తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 24: వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో దసరా పండుగ వేడుకలు సోమ వారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ దసరా పండుగ వేడుకలకు మంత్రి మహేందర్రెడ్డి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి డిసిసిబి  చైర్మన్ మనోహర్ రెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్ పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు హాజరయ్యారు. అనంతరం…

టీ హబ్ ను సందర్శించిన గీతం ఫార్మసీ విద్యార్థులు

పటాన్ చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 24: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలోని బీఫార్మసీ, ఏం ఫార్మసీ, విద్యార్థులు మంగళవారం హైదరాబాదులోని టీ- హబ్ కార్యాలయాన్ని సందర్శించారు. ఫార్మసీ స్కూల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పి. హేమై ఈ పర్యటనను సమన్వయంగా చేయగా డాక్టర్ పవన్ కుమార్ సహకరించారు. ఈ సందర్భంగా గీతం ఫార్మసీ విద్యార్థులు …

కాంగ్రెస్ పార్టీ గాలిపోయిన బెలూన్

తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 24: కాంగ్రెస్ పార్టీ గాలిపోయిన బెలూన్ అని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి  విమర్శించారు. మంగళవారం తాండూరులోని ఎమ్మెల్యే నివాసంలో బషీరాబాద్ మండలం కొర్వి చేడ్ ఘని కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహారాష్ట్ర అంబన్న పలువురు యువకులతో కలిసి ఎమ్మెల్యే సమక్షంలో బీఅర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైలెట్…

ఈ ఎన్నికలు ఎవరికి ప్రయోజనం..?

    కార్పోరేట్ ఏజెంట్లకు సీట్లు ఇస్తున్న ప్రధాన పార్టీలు పొంగులేటి.. పువ్వాడ అజయ్ ఇద్దరూ కార్పోరేట్ రాజకీయ నాయకులే వేల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్దం అవుతున్న పార్టీలకు బుద్ది చెప్పండి. మావోయిస్టు పార్టీ అగ్రనేత అజాద్ ప్రకటన విడుదల   భద్రాచలం, ప్రజాతంత్ర , అక్టోబర్ 24 : తెలంగాణ రాష్ట్రంలో శాసన…

కాళేశ్వరం’ భద్రతను పరిశీలించేందుకు  కేంద్ర బృందం

*- కేంద్ర జలవనరుల సంఘం సభ్యుడు అనిల్ జైన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీ *- మేడిగడ్డ రిజర్వాయర్ పిల్లర్లు కూలడంతో బ్యారేజీ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు కేంద్ర బృందాన్ని పంపండంటూ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ *-  వాస్తవాలు తేల్చాలని కోరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కాళేశ్వరం…