NEWS

NEWS

పెట్టుబడులకు గమ్యస్థానంగా హైదరాబాద్‌

దేశంలోనే అత్యున్నత స్థాయిలో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ప్రపంచ పెట్టుబడిదారులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం సందేశం గ్రీన్‌ ప్రాపర్టీ షో 2024లో గ్లోబల్‌ హైదరాబాద్‌ విజన్‌ను ఆవిష్కరించిన మంత్రి ఉత్తమ్‌ నాలుగేళ్లలో ఐటి ఎగుమతుల రెట్టింపు ప్రభుత్వ లక్ష్యం : మంత్రి శ్రీధర్‌ బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 17 : ప్రపంచంలోని అగశ్రేణి మహానగరాలకు…

యుద్ధాలు మానసిక ఉన్మాద ప్రేరితాలు

ఎంతకాలమీ సంఘర్షణ?ఎంతకాలమీ అశాంతి? అలజడులతో అశాంతిని సృష్టించి, సాధించే దేమిటి? యుద్ధాల వలన ఒరిగే దేమిటి?  ఇప్పటి వరకు జరిగిన యుద్ధాలు నేర్పిన గుణపాఠం ఏమిటి? ప్రజలు ఆమోదించని యుద్ధాలను పాలకులు ప్రజల నెత్తిన రుద్ధుతున్నారెందుకు? అహం వలన, ఆధిపత్య భావజాలం వలన పుట్టుకొస్తున్న యుద్ధాలు ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి. ప్రజలు కట్టుకున్న ఆశా సౌధాలు…

వోటింగ్‌పై ఆసక్తి చూపని గ్రేటర్‌ వోటర్లు!

ఇటీవల జరిగిన లోక్‌ సభ ఎన్నికల్లో గ్రేటర్‌ పరిధిలోని మల్కాజిగిరి, సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, చేవెళ్ల లోక్‌ సభ సెగ్మెంట్ల పరిధిలో వోటు వేసేందుకు జనం అంతగా ఆసక్తి చూపలేదు. సికింద్రాబాద్‌ మరియు హైదరాబాదులోని నియోజకవర్గాల్లో యాభై శాతం వోటింగ్‌ కూడా నమోదు కాలేదు. మల్కాజిగిరి, చేవెళ్లలో మాత్రం  50 శాతం దాటింది.  గ్రేటర్‌ సిటీ పరిధిలోని…

ప్రైవేటు విద్యా…అంతా మిధ్యా..!

నేటి బాలలే రేపటి పౌరులు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేది పాఠశాలలే. కానీ అలాంటి పాఠశాలలే అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల  భవిష్యత్తును నాశనం చేస్తున్నాయి.పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేటు బడులు విద్యార్థుల చదువును సంతలో సరుకుగా మార్చేశాయి. స్కూల్ లు ప్రారంభం కానున్నాయి . దోపిడి మొదలైంది. అడ్మిషన్ తీసుకోవాలంటే డొనేషన్లని, బుక్స్ కు సపరేట్…

డ్రైనేజి నాలా అభివృద్ధి వ్యవస్థ పటిష్టపరచాలి

హైదరాబాద్ అర్బన్ అగ్లోమరేషన్లో భవిష్యత్తులో వరదలను నివారించడానికి  తగ్గించడానికి,  నష్టాలను తగ్గించడానికి, రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన ముందుకు తీసుకువెళ్లాలి. హైదరాబాద్‌లోని ఈ ప్రత్యేక ప్రాజెక్ట్ విభాగం భారీ వర్షాలు  పట్టణ వరదల యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించే ప్రాథమిక లక్ష్యంతో సమగ్ర మురికి నీటి పారుదల వ్యవస్థను ప్లాన్…

హ్యాట్రిక్‌ విజయం సాధించబోతున్నాం

ఇండియా కూటమి బలహీనతే మా బలం రామాలయాన్ని బుల్‌డోజర్లతో కూలుస్తామంటున్న కూటమి బుల్‌డోజర్ల ఉపయోగం యోగి నుంచి తెలుసుకోవాలి యూపి ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ విమర్శలు లక్నో, మే 17 : రాయబరేలి ప్రజలు ప్రధానిని ఎన్నుకుంటారంటూ కాంగ్రెస్‌ నేత ఒకరు చెప్పడాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. మోదీ ప్రభుత్వం…

యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ ట్రయల్‌ రన్‌ విజయవంతం

త్వరలో అవసరమైన మెటేరియల్‌ సరఫరాకు రవాణా వ్యవస్థ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి యాదాద్రి, ప్రజాతంత్ర, మే 15 : యాదాద్రి ధర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లో అధికారులు రెండు యూనిట్లకు విజయవంతంగా ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. ప్లాంట్‌కు అవసరమైన మెటేరియల్‌ సరఫరా, రైల్వే, రోడ్డు రవాణా వ్యవస్థలను త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం…

ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది వేడుకలకు సన్నాహాలు ..

ఇక ప్రజా పాలనపై నజర్‌.. మంత్రులు అధికారులతో సీఎం రేవంత్‌ సమావేశం తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృత సమస్యలపై దృష్టి ఆస్తులు, అప్పుల పంపిణీపై నివేదికకు ఆదేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 15: రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగియటంతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రజా పాలనపై దృష్టి కేంద్రీకరించారు. సచివాలయంలో బుధవారం  మంత్రులు ఉత్తమ్‌…

రాష్ట్రంలో క్రమేపీ చల్లబడుతున్న వాతావరణం

వొచ్చే  3 రోజులు వానలు కురిసే అవకాశం పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్‌.! హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 15 : తెలంగాణలో వాతావరణం క్రమేపీ చల్లబడుతుంది. ఎండల తీవ్రత తగ్గింది. కొన్ని ప్రాంతాల్లో 47 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు.. ప్రస్తుతం 40 డిగ్రీలకు పడిపోయింది. దీనికి కారణంగా ఉపరితల ఆవర్తనమే అని అంటున్నారు…

విద్యాహక్కు పరిరక్షణ అందరి బాధ్యత!

విద్యను పొందడం మాత్రమే హక్కు కాదు, సరైన ఉపాధ్యాయుడి వద్ద విద్యను అభ్యసించడం కూడా హక్కే. కాలం ఎంతగా మారినా మన సమాజం ఉత్తమ ఉపాధ్యాయులను అధికంగా  తయారు చేయలేక పోతుందనేది సత్యం. సాధారణ ఉపాధ్యాయుడు పాఠాల్ని బోధిస్తాడు. మంచి ఉపాధ్యాయుడు వాటిని వివరిస్తాడు. ఉత్తమ ఉపాధ్యాయుడు విశదీకరిస్తాడు. గొప్ప ఉపాధ్యాయుడు స్ఫూర్తిని అందిస్తాడు. గురువుల…